India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 జిల్లాలుగా మారుస్తామనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. మదనపల్లె, మార్కాపురం జిల్లాపై తాము హామీలు ఇచ్చామన్నారు. ఆయా జిల్లాలు కూడా ఇప్పుడే ఏర్పాటు చేయబోమని తెలిపారు. ఎన్నికలకు ముందే పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరుతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

చిత్తూరు జిల్లా నూతన అటవీశాఖ అధికారిణిగా భరణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేస్తున్న చైతన్య కుమార్ రెడ్డిని ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన భరణి నూతన డీఎఫ్వోగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ.. అందరి సహకారంతో అటవీశాఖ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్)కు విజయదశమి సందర్భంగా సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 12వ తేదీ శనివారం ఓపీ, ఓటీ సేవలు అందుబాటులో ఉండవు. స్విమ్స్ అత్యవసర విభాగం(క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని వీసీ ఆర్.వి.కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

చిత్తూరు రైతు బజారులలో నేటి నుంచి రాయితీ ధరతో టమాటాలు పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ విద్యాధరి తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన టమాటాను కిలో రూ. 49కే అందజేస్తామని ఆమె చెప్పారు. ఈ మేరకు రైతు బజారులో ఉదయం కౌంటర్ ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. త్వరలోనే ఉల్లిపాయలను అందిస్తామని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 14వ తేదీ నుంచి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నాలుగు రోజులపాటు కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో ఆమె పర్యటన కొనసాగుతుందని సమాచారం. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

చిత్తూరు జిల్లాలో ఈనెల 14 నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. 20వ తేదీ వరకు ఇవి కొనసాగుతాయని చెప్పారు. పంచాయతీల వారీగా శంకుస్థాపనలు, ఎమ్మెల్యేల వారీగా రోజువారి అభివృద్ధి పనుల ప్రణాళిక తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ రోడ్లు, పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నట్టు వెల్లడించారు.

బెట్టింగ్కు యువత దూరంగా ఉండాలని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోళ్ విజ్ఞప్తి చేశారు. జీడీ నెల్లూరులో బెట్టింగ్ కారణంగా అప్పులపాలై కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన స్పందించారు. ‘బెట్టింగ్లో రూ.25 లక్షల వరకు పోగొట్టుకోవడంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. ఏపీలో బెట్టింగ్ చట్టవ్యతిరేక చర్య. దీని ఊబిలో పడి మోసపోకండి’ అని ఎస్పీ సూచించారు.

ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద జరిగిన హత్య కేసులో దినేశ్ కుమార్, లోకేశ్ ఇద్దరు ముద్దాయిలను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రవీణ్ కుటుంబానికి, దినేశ్ కుటుంబానికి మనస్పర్థలు ఉన్నాయని చెప్పారు. మందు సేవించేటప్పుడు ప్రవీణ్ దినేశ్ను తిట్టేవాడని, కొట్టేవాడని చెప్పారు. మనస్పర్ధలు కారణంగా ప్రవీణ్ను మచ్చు కత్తితో లోకేశ్ సహాయంతో దారుణంగా చంపినట్లు చెప్పారు.

మదనపల్లె జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమారిని అదే కాలనీలో ఉండే వెంకటేశ్ నమ్మించి నీరుగట్టుపల్లిలోని సాయిరాంవీధికి చెందిన అనిల్ ఇంటికి గతనెల 28న తీసుకొచ్చాడు. అక్కడ మంత్రాలు, తాయత్తుల పేరుతో స్వర్ణకుమారిని అనిల్ పథకం ప్రకారం వెంకటేశ్, అనిల్ ఇద్దరు కలిసి హతమార్చారు. అనంతరం మూటగట్టుకుని గుంత తవ్వి స్వర్ణకుమారిని అందులో పాతిపెట్టారు. అనంతరం విమానాల్లో షికార్లు చేస్తుండగా పట్టుకున్నారు.
Sorry, no posts matched your criteria.