India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సూక్ష్మ, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. గురువారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ డీఅర్డీఏ సమావేశ మందిరంలో పీఎంఈజీపీ పథకానికి సంబంధించి జిల్లా స్థాయి అవగాహన సదస్సును నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ , అధికారులు పాల్గొన్నారు.
సదుం మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని అర్షియాను దత్తత తీసుకుంటున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. విద్యార్థిని పదవ తరగతి వరకు అయ్యే విద్య అవసరాలకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బాగా చదువుకోవాలని ఆమెకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం జయ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 25 నుంచి అక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులకు అందరూ సహకరించాలని కోరారు.
హార్ట్ ఎటాక్తో హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. బైరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న చలపతి హార్ట్ ఎటాక్తో మృతి చెందినట్లు సహచర పోలీసు సిబ్బంది తెలియజేశారు. స్టేషన్లో ఎస్సై, ఏఎస్ఐ పోస్టులు ఖాళీగా ఉన్నా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నట్టు వారు చెప్పారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తలు రద్దీ కొనసాగుతోంది. ఆరు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న స్వామి వారిని 77,939 మంది దర్శించుకున్నారు.
చంద్రగిరి కోటకు పూర్వ వైభవం తీసుకొస్తామని, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన ఈ కోటలో వసతులు కల్పించి పర్యాటకులు వచ్చేలా చూస్తామని తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. చంద్రగిరి కోటను బుధవారం రాత్రి ఆయన సందర్శించారు. శుక్రవారం సౌండ్ అండ్ లైటింగ్ షోను వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్న నేపథ్యంలో కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.
చిత్తూరు రూరల్ మండలం, దిగువమాసపల్లె వద్ద బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఇసుక స్టాక్ ను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇసుకను తరలిస్తున్నారు లేదా అని ట్రాక్టర్ డ్రైవర్లతోపాటు యజమానులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు కానీ, మధ్యవర్తులుగాని ఇసుకను ప్రభుత్వ నిర్దేశిత ధర కంటే ఎక్కువకు తీసుకోవాలని బలవంతం చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో (B.Pharmacy) బీఫార్మసీ ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తమ్ముడు కోనేటి పాండురంగం (68) బుధవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. నారాయణవనం మండలం భీముని చెరువుకు చెందిన కోనేటి పాండురంగంను రెండు రోజులక్రితం అస్వస్థతకు గురికావడంతో తిరుపతిలోని స్వీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో ఎమ్మెల్యే ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
తిరుమల లడ్డూ ఘటనపై CBIతో విచారణ జరిపించాలని MP మిథున్ రెడ్డి అన్నారు. తిరుమలలో నెయ్యి ఆర్డర్ ఇచ్చింది, శాంపిల్ టెస్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వంలోనే అని ఎంపీ ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. నిజం బయటికి రావాలంటే CBI లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. టీటీడీ ఈఓ శ్యామల రావు భిన్న సమాధానాలు చెబుతున్నారని, ఆఫీసర్ల మీద ఒత్తిడి తెస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.