India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన రంగంపేట క్రాస్ వద్ద చోటుచేసుకుంది. తేనేపల్లి పంచాయతీ బీదరామిట్టకు చెందిన నవీన్ అనే యువకుడు రంగంపేట క్రాస్ గువ్వల కాలనీ సమీపంలో నడుచుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
2000 వ సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వ టెండరు దక్కించుకొని సక్రమంగా పంపిణీ చేయని చర్చి వీధికి చెందిన శ్రీ షిరిడి సాయి ఎంటర్ప్రైజెస్ అధినేత కామేశ్వరరావుపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ జయరామయ్య తెలిపారు. 25 ఏళ్లుగా కేసు నడుస్తున్నప్పటికీ వాయిదాకు గైర్హాజరు కావడంతో నేడు దండోరా వేశామన్నారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.
రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఫిబ్రవరి 4వ తేదీన అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. NRIలు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ప్రకటించింది.
స్నేహితులు, బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు బహుమతిగా విలువైన వస్తువులు ఇస్తుంటాం. కానీ చిత్తూరులో ఓ జంటకు అందిన బహుమతికి అందరూ ఆశ్చర్యపోయారు. నగరంలో జరిగిన ఓ పెళ్లికి ట్రాఫిక్ CI నిత్యబాబు హాజరయ్యారు. అనంతరం ఆయన దంపతులకు బైకు హెల్మెట్ను బహూకరించారు. బైకులపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించాలని, అప్పుడే మనతోపాటూ మనల్నే నమ్ముకున్న వారు సంతోషంగా ఉంటారన్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటో చెప్పండి.
తిరుపతి నగరంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి ఆటోనగర్కు చెందిన ఓ వ్యక్తి తన బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు. విద్యార్థి శ్రీకాళహస్తిలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సంక్రాంతికి ఇంటికి రాగా.. నిద్రిస్తున్న సమయంలో తండ్రి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. డిగ్రీ తృతీయ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మూడో తేదీ, మొదటి సంవత్సరం పరీక్షలు 14వ తేదీ నుంచి ప్రారంభమం అవుతాయి. అభ్యర్థులు ఇతర వివరాలకు www.svudde.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
గత అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలుకు అవార్డు వచ్చింది. ఉత్తమ ఎన్నికల నిర్వహణ జాతీయ అవార్డుకు ఆయన సెలెక్ట్ అయ్యారు. విజయవాడలో 25న జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సభలో ఈ అవార్డును అందుకోనున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించినందుకు ఎస్పీ అవార్డు వచ్చిందని పలువురు పోలీస్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో గతేడాది డిసెంబరు 30వ తేదీ నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారంతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని వేంచేపు చేసి దివ్యప్రబంధ గోష్టి నిర్వహించారు. 25 రోజులుగా శ్రీవారి శ్రీవైష్ణవ జీయంగార్లు 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్యప్రబంధ పాశురాలను గోష్ఠిగానం ద్వారా స్వామివారికి నివేదించారు.
76వ భారత గణతంత్ర వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహిద్దామని కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ నెల 26న నిర్వహించే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు సంబంధించి అధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ నెల 26న పోలీసు పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన జయ కన్నన్ ఈనెల 21న తిరుపతిలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకున్నారు. 22న సిబ్బంది తలుపు తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా పడకపైనే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ మహేశ్ చెప్పారు.
Sorry, no posts matched your criteria.