Chittoor

News August 6, 2024

చిత్తూరు: ఎన్ఎంఎంఎస్‌కు దరఖాస్తు చేసుకోండి

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షకు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో దేవరాజు తెలిపారు. పరీక్ష రాసేందుకు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, ప్రాథమికోన్నత పాఠశాలలతో పాటు వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు అర్హులన్నారు. కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోగా ఉండాలన్నారు. పరీక్ష డిసెంబరు 8న నిర్వహించనున్నట్లు చెప్పారు.

News August 6, 2024

తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

image

108లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏఈఎంఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎలీ, బి.ఫార్మసీ, డీఎంఎల్ పూర్తి చేసి ఉండాలని, పైలట్ కి పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News August 6, 2024

చిత్తూరు: కేంద్రీయ విద్యాలయ ఏర్పాటుకు స్థల పరిశీలన

image

సంతపేట PNC మున్సిపల్ స్కూల్ క్రీడా మైదానంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటుకు డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ త్రిసభ్య కమిటీ, MEO సెల్వరాజ్ తో కలిసి స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కమిటీ సభ్యులు ఆర్డీవో చిన్నయ్య మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రామకృష్ణుడు, తహశీల్దార్ కళావతి, హైస్కూల్ హెచ్ఎం వేద కుమారి పాల్గొన్నారు.

News August 5, 2024

SVU : PG ఫలితాలు విడుదల

image

తిరుపతి : శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) పరిధిలో ఈ ఏడాది (PG) M.A, M.Sc 1, 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 5, 2024

గురుకులాల్లో ఉద్యోగాలు.. నేడే చివరి అవకాశం

image

జిల్లాలోని 7 అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DCO T.పద్మజ తెలిపారు. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు అర్హులైన వారు గురుకుల పాఠశాలలో దరఖాస్తులను అందజేయాలన్నారు. B.Edతో పాటు TET అర్హత సాధించిన వాళ్లు అర్హులు. ఈనెల 6న చిత్తూరు సంజయ్ గాంధీ నగర్ గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు డెమో క్లాసు నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

News August 5, 2024

పెద్దపంజాని: రోడ్డు ప్రమాదంలో MCA విద్యార్థి మృతి

image

పెద్దపంజాని మండలం బసవరాజుకండ్రిగ గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన MCA విద్యార్థి సాయి కిరణ్ (23) బైక్‌పై  వెళుతుండగా పలమనేరు-పుంగనూరు జాతీయ రహదారి వద్ద ఎదురుగా వస్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో సాయికిరణ్ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిపారు.   

News August 5, 2024

శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం

image

తిరుమలలో భక్తులు రద్దీ సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తులు డైరెక్ట్ క్యూ లైన్‌లో వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కాగా ఆదివారం 75,356 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

News August 5, 2024

మలేషియాలో సత్తాచాటిన మదనపల్లె విద్యార్థులు

image

మలేషియాలో జరిగిన కరాటే పోటీల్లో మదనపల్లె విద్యార్థులు సత్తా చాటి బ్లాక్ బెల్ట్ సాధించినట్లు మాస్టర్ డాక్టర్ ఏఆర్ సురేశ్ తెలిపారు. విద్యార్థులు మహేశ్వర్, షేక్ మిస్బా, జోషితారెడ్డి , మహమ్మద్ ఐమాన్ , మోహిబుల్ రెహమాన్, విశిష్టసాయి , కాలేషామస్తాన్ , చారుకేశరాయల్ , ప్రజ్వల్ రాయల్ బ్లాక్ బెల్ట్ సాధించారన్నారు. వారంతా ఆదివారం మదనపల్లెకు రావడంతో స్థానికులు అభినందనలు తెలిపారు.

News August 4, 2024

తిరుమలకు వచ్చే వృద్ధులకు అలర్ట్

image

టోకెన్లు లేకున్నా రోజూ వయోవృద్ధులను శ్రీవారి దర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారని కొందరు ప్రచారం చేశారు. దీనిని టీటీడీ ఖండించింది. ‘రోజుకు 1000 మంది చొప్పున వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రతి నెలా 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటా విడుదల చేస్తాం. అలా బుక్ చేసుకున్న టోకెన్లతో వచ్చిన వారినే దర్శనానికి అనుమతిస్తాం. టోకెన్లు లేని వారికి అనుమతి లేదు’ అని TTD స్పష్టం చేసింది.

News August 4, 2024

త్వరలో తిరుపతి జిల్లాలో సీఎం పర్యటన

image

సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో శ్రీసిటీలో పర్యటిస్తారని తెలుస్తోంది. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ముఖ్యమంత్రిని కలిసి శ్రీసిటీలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిని వివరించారు. అలాగే శ్రీసిటీని సందర్శించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 3వ వారంలో సీఎం పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.