Chittoor

News July 31, 2024

కురబలకోట: ఉరేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

image

బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు ముదివేడు ఎస్ఐ మల్లికార్జున రెడ్డి తెలిపారు. కురబలకోట రామిగానిపల్లి మధుసూదనరెడ్డి ఒక్కగానొక్క కొడుకు నవీన్ కుమార్(29) తిరుపతిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌లో రెండు సబ్జక్టులు ఫెయిలయ్యాడు. 2వ సంవత్సరం చదవనివ్వరని అమ్మానాన్నకు వాయిస్ మెసేజ్ పంపి సీటీఎం వద్ద ఉరేసుకున్నాడు.

News July 31, 2024

కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్

image

కుప్పంలో వైసీపీకి షాక్ ఇస్తూ పలువురు ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని కుప్పం, శాంతిపురం, గుడిపల్లి మండలాలకు చెందిన 14 మంది వైసీపీ ఎంపీటీసీలతోపాటు కుప్పం మున్సిపాలిటీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు బుధవారం అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

News July 31, 2024

పెద్దిరెడ్డి 20వేల ఎకరాలు కబ్జా చేశారు: మంత్రి

image

రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి పెద్దిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రామచంద్రారెడ్డి, ఆయన ముఠా దాదాపు 20 వేల ఎకరాలు కబ్జా చేశారని, వాటి విలువ రూ.45 వేల కోట్లు ఉంటుందన్నారు. దీనిని తప్పించుకోవడానికే మదనపల్లె ఆర్డీవో కార్యలయంలో 22A ఫైళ్లు దగ్ధం చేశారన్నారు. మొత్తం 14 వేల ఎకరాలకు సంబంధించి ఫైళ్లు బూడిదయ్యాయన్నారు. అంతే కాకుండా పెద్దిరెడ్డికి చెందిన కంపెనీ PLR కు చెందిన టిప్పర్లపై విచారణ చేపడతామన్నారు.

News July 31, 2024

చిత్తూరు బాలుడి సరికొత్త రికార్డ్

image

చిత్తూరులోని కొంగారెడ్డిపల్లికి చెందిన స్వరూప్, ప్రియాంక దంపతుల కుమారుడు శరణ్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఒక సంవత్సరం 9 నెలల వయసు ఉన్నప్పుడు 50 మీటర్ల రన్నింగ్ రేస్‌ను 28 సెకండ్లలో పూర్తిచేశాడు. తల్లిదండ్రులు వీడియో రికార్డ్ చేసి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు పంపారు. వాళ్లు పరిశీలించి బాలుడి రికార్డును నమోదు చేసి సర్టిఫికెట్ అందజేశారు.

News July 31, 2024

చిత్తూరు జిల్లాలో BSNLకు 19వేల మంది షిప్ట్..?

image

టెలికాం సంస్థల రేట్ల ప్రభావం చిత్తూరు జిల్లాలోనూ కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షలమంది BSNL కస్టమర్లు ఉన్నారు. ఫైబర్ నెట్‌ను 28 వేల మంది, ల్యాండ్ లైన్ సేవలను 4500 మంది వినియోగించుకుంటున్నారు. ఒక్క జులైలోనే ఈసంస్థకు 19వేల మంది కస్టమర్లు పెరిగారు. సాధారణ రోజుల్లో నెలకు 5 వేల మంది పెరుగుతుంటారు. త్వరలోనే 4G సేవలు అందుబాటులోకి తెస్తామని తిరుపతి ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ CAరెడ్డి వెల్లడించారు.

News July 31, 2024

పెద్దిరెడ్డి కుటుంబానికి 236 ఎకరాలు..?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన భార్య స్వర్ణలత, కుమారుడు మిథున్ రెడ్డి పేరిట 236 ఎకరాలు ఉన్నట్లు తేలింది. ‘మీ భూమి’ పోర్టల్ ప్రకారం పెద్దిరెడ్డి పేరుతో 41.35, మిథున్ రెడ్డి పేరిట 23.42, స్వర్ణలత పేరిట 171.23 ఎకరాలు ఉన్నాయి. పుంగనూరు మండలం రాగానిపల్లె, మేలుపట్ల, భీమగానిపల్లె, చౌడేపల్లె మండలం దిగువపల్లె, మంగళంపేట, వెంకటదాసరపల్లె, తిరుచానూరు తదితర గ్రామాల్లో భూములు కొన్నారు.

News July 31, 2024

కాల్ సెంటర్ పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్

image

తాగునీటి సమస్యలపై జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు సదరు పోస్టర్‌ను విడుదల చేశారు. కాల్ సెంటర్ నెంబర్ 9441725450 కు ప్రజలు అన్ని పని దినములలో, సమయాలలో ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు.

News July 30, 2024

తిరుపతి: PIC OF THE DAY

image

తిరుపతి బస్టాండ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుపతి నగరానికి చుట్టూ పక్కల కొండలు, బస్టాండ్‌కు ఇరువైపుల ఎత్తైన భవంతులు ఉన్న ఫొటో చూపరులను ఆకట్టుకుంటోంది.

News July 30, 2024

తిరుపతి : ఆగస్టు 1 నుంచి 15 వరకు MBA పరీక్షలు

image

తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని MBA 2023 2024 మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు ఆగస్టు 1 గురువారం నుంచి నిర్వహిస్తున్నట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ మంగళవారం తెలిపారు. రెండో సెమిస్టర్ పరీక్షలు 10 గంటల నుంచి 12 వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు 2 గంటల నుంచి 5 గంటలకు వరకు జరుగుతాయని అన్నారు. పరీక్షా కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలని తెలిపారు.

News July 30, 2024

తిరుపతి: ఆగస్టు 2న జాబ్ మేళా

image

ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు ఆగస్టు 2వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదవ తరగతి, ఐటిఐ, ఇంటర్, డిప్లొమా, B.Sc మ్యాథ్స్, కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మొత్తం 265 ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.