Chittoor

News January 9, 2025

తిరుపతిలో రేపు హర్యానా గవర్నర్ బండారు పర్యటన

image

తిరుపతిలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం పర్యటిస్తారని సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఉదయం 11. గంటలకు జరగనున్న ప్రవాసీ భారతీయ దివస్ (NRI) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. 

News January 9, 2025

రేపు తిరుపతికి చంద్రబాబు రాక

image

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం గురువారం తిరుపతికి రానున్నారు. మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆయన పరామర్శిస్తారని సమాచారం.

News January 8, 2025

పెద్దిరెడ్డికి ఆయుధాలు ఇచ్చేయండి: హైకోర్టు

image

ఎన్నికల ముందు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి నుంచి పోలీసులు లైసెన్స్‌డ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తిరిగి ఇవ్వకపోవడంతో పెద్దిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. 2 వారాల్లోనే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆయుధాలు అప్పగించాలని జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఆదేశించారు.

News January 7, 2025

ఢిల్లీలో శాంతిపురం యువకుడి దారుణ హత్య

image

ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ యువకుడి నిండు ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం(M) వెంకటేల్లికి చెందిన హరి కుమారుడు సునీల్ దిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో సునీల్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.4 లక్షలు అప్పులు చేశాడు. 3 రోజుల కిందట కుటుంబసభ్యులు అతడికి రూ.2 లక్షలు పంపించారు. మిగిలిన రూ.2లక్షలు ఇవ్వలేదని యువకుడిని సోమవారం బెట్టింగ్ గ్యాంగ్ హత్య చేశారని మంగళవారం కుటుంబసభ్యులు ఆరోపించారు.

News January 7, 2025

చిత్తూరు ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా డాక్టర్ రవిప్రభు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.

News January 7, 2025

చిత్తూరు ప్రజలు భయపడకండి: డాక్టర్లు

image

చిత్తూరు జిల్లాకు పక్కనే ఉన్న బెంగళూరులో HMPV కేసు నమోదైంది. బెంగళూరులో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతికి జిల్లాకు రానున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా లాగా దీని ప్రభావం ఉండదని.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తిరుపతి రుయా డాక్టర్ రవిప్రభు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతుందని తిరుపతి DMHO బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.

News January 7, 2025

నిమ్మనపల్లెలో అమానుషం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. మదనపల్లె తాలుకా రూరల్ సీఐ రమేశ్ వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బోయకొండ(28)కు నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. సుమారు 12 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలపై బోయకొండ లైంగిక దాడి చేశాడు. భార్యకు విషయం తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బోయకొండపై పోక్సో కేసు నమోదు చేశారు.

News January 7, 2025

TPT: PG కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2025-26 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET PG) నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆన్‌ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 2గా పేర్కొన్నారు.

News January 6, 2025

చిత్తూరు: మిడ్ డే మీల్స్‌లో స్వల్ప మార్పు

image

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో శనివారం ఒక్కరోజు మెనూలో మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని DEO వరలక్ష్మి తెలిపారు. గతంలో శనివారం పాఠశాల విద్యార్థులకు గ్రీన్ లీఫీ వెజ్ రైస్, స్వీట్ పొంగల్, రాగి జావా పెట్టే వారన్నారు. ప్రస్తుతం స్వల్ప మార్పు చేస్తూ.. ఆ స్థానంలో రైస్, సాంబార్, వెజిటేబుల్ కర్రీ, స్వీట్ పొంగల్, రాగి జావా వడ్డించాలన్నారు. మండలధికారులు పర్యవేక్షించాలని సూచించారు.

News January 6, 2025

తిరుపతి: సంక్రాంతి ట్రైన్లు.. 8గంటలకు బుకింగ్

image

➥ చర్లపల్లి-తిరుపతి(07077): 6వ తేదీ
➥ తిరుపతి-చర్లపల్లి(07078): 7వ తేదీ
➥చర్లపల్లి-తిరుపతి(02764):8, 11, 15 వ తేదీ
➥ కాచిగూడ-తిరుపతి(07655): 9, 16వ తేదీ
➥ తిరుపతి-కాచిగూడ(07656): 10, 17వతేదీ
పై ట్రైన్ల బుకింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతాయి. గెట్ రెడీ.