Chittoor

News January 6, 2025

తిరుపతి: అంబులెన్స్ ఢీకొని ఇద్దరు భక్తులు మృతి

image

కాలినడకన వస్తున్న భక్తులను 108 అంబులెన్స్ ఢీకొన్న ఘటన సోమవారం ఉదయం చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కళాశాల వద్ద చోటు చేసుకుంది. పుంగనూరు నుంచి నడుచుకొస్తున్న భక్తులు తిరుపతి వైపుగా వెళుతుండగా వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

News January 6, 2025

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News January 5, 2025

SVU: ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గతేడాది జూన్‌లో రెగ్యులర్ డిగ్రీ (UG) BA/B.COM/BSC/BCA/BBA/B.VOC రెండో సెమిస్టర్ జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News January 5, 2025

చిత్తూరు: రేపు PGRS రద్దు

image

జిల్లాలో ఈనెల 6 న సోమవారం జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈ నెల 6,7 వ తేదీలలో సీఎం చంద్రబాబు పర్యటనలో అధికారులందరూ నిమగ్నమై ఉన్నందున రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయం జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News January 5, 2025

వరదయ్యపాలెం: కరెంట్ బిల్లు రూ.47 వేలు

image

వరదయ్యపాలెం మండలం కోవూరుపాడుకు చెందిన మారెయ్య తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి కంగుతిన్నాడు. జనవరి నెలలో కరెంట్ బిల్లు రూ.47,932 రావడంతో నోరు వెల్లబెట్టాడు. గత నెలలో రూ. 830 బిల్లు వచ్చినట్లు తెలిపారు. ప్రతినెలా క్రమం తప్పకుండా బిల్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. దీంతో బాధితుడు వరదయ్యపాలెం విద్యుత్ శాఖ కార్యాలయ అధికారులను ఆశ్రయించాడు.

News January 5, 2025

కుప్పం: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

చెన్నై-బెంగళూరు రైల్వే మార్గంలోని కుప్పం మండలం గుల్లెపల్లి సమీపంలో శనివారం గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వివరాలు ఎవరికైనా తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులను సంప్రదించాలని పోలీసులు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News January 5, 2025

అధికారులు సమన్వయంతో పని చేయాలి: టీటీడీ ఛైర్మన్

image

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణతేజ రెస్ట్‌ హౌస్‌లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అన్నమయ్య భవన్‌లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ, పోలీసు అధికారులతో సమీక్ష  నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

News January 4, 2025

నవోదయ ప్రవేశానికి 18న ఎంపిక పరీక్ష

image

మదనపల్లె మండలంలోని వలసపల్లె నవోదయలో 2025-26 విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి ఎంపిక పరీక్ష ఈ నెల18న జరుగుతుందని నవోదయ స్కూల్ ప్రిన్సిపల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://navodaya.gov.in/ https://cbseitms.rcil.gov.in/nvs/2 హాల్ టికెట్లు / అడ్మిట్ కార్డ్స్ డౌన్ లోడ్ చేసుకొన వచ్చునని తెలిపారు. వివరాలకు హెల్ప్ డెస్క్ 8919956395 ఫోన్ చేయాలన్నారు. లేకపోతే డైరెక్ట్ గా అయినా సంప్రదించాలన్నారు.

News January 4, 2025

కుప్పంలో ఎయిర్‌పోర్టుపై CM చంద్రబాబు కీలక ప్రకటన

image

కుప్పంలో విమానాశ్రయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఆలోచనలో ఉందని CM చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో రెండు దశల్లో విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు రన్ వే కోసం, రెండో దశలో 567 ఎకరాలను భవన నిర్మాణాల కోసం సిద్ధం చేశారు. కుప్పంలో ప్రతిపాదించిన ఎయిర్‌పోర్టు ప్రాంతాన్ని అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) సందర్శించి సాధ్యాసాధ్యాలపై నివేదకను అందించింది. దీనిపై అథారిటీ నుంచి ఎన్‌ఓసీ రావాల్సి ఉంది.

News January 4, 2025

శేషాచలం అడవుల్లో శ్రీకాళహస్తి బీటెక్ విద్యార్థుల మిస్సింగ్

image

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పరిసరాలైన శేషాచలం అడవుల్లో బీటెక్ విద్యార్థులు దారి తప్పిపోయారు. శ్రీ కాళహస్తి నుంచి వచ్చిన ఆరుగురు బీటెక్ విద్యార్థులు, అడవిలోని అందమైన వాటర్‌ఫాల్స్‌ను చూసేందుకు శుక్రవారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు దారితప్పి అడవిలో చిక్కుకుపోయారు. దారి తప్పిన ఆరుగురిలో ఒకరు అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు గాలిస్తున్నారు.