India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంతరాయం లేని విద్యుత్తు, నాణ్యమైన సరఫరానే లక్ష్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 నూతన సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్ఈ సురేంద్ర నాయుడు వెల్లడించారు. వీటి నిర్మాణానికి ఉన్నతాధికారులు ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రమాదాల నివారణలో భాగంగా విద్యుత్తు లైన్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. ప్రమాదకర లైన్లు, స్తంభాలను ఎప్పటికప్పుడు మార్చేస్తున్నామని వివరించారు.
మదనపల్లెలో రికార్డుల దగ్ధం తర్వాత భూకబ్జా బాధితుల నుంచి ప్రభుత్వం ఫిర్యాదులు స్వీకరించింది. ఈక్రమంలో పెద్దిరెడ్డి, మాధవరెడ్డి, వైసీపీ నేతలు, తదితరులపై మొత్తం 229 ఫిర్యాదులు అందాయి. ఎవరిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయంటే..
➤ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: 20
➤ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి: 8
➤ వి.మాధవ రెడ్డి: 9
➤ వైసీపీ నేతలు: 27
➤ పేర్లు ప్రస్తావించనవి: 69
➤ ఇతరుల పేర్లుతో: 96
మదనపల్లెలో ఫైళ్ల దగ్ధంపై అధికారులు విచారణ వేగవంతం చేశారు. తట్టివారిపల్లెలో ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి సోదరుడు, తంబళ్లపల్లె MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి కీలక దస్ర్తాలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి అనుచరుడైన బాబ్జాన్ ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు. విచారణకు తాము ఎప్పుడు పిలిచినా రావాలంటూ బాబ్జాన్కు నోటీసులు ఇచ్చారు.
సోమల మండలం ఆవులపల్లె దగ్గర 165 ఎకరాల భూమిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి PA శశిధర్ బలవంతంగా కాజేశారని కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ కోసం హైదరాబాద్లోని ఆయన ఇంటికి అధికారులు వెళ్లారు. అరెస్ట్ భయంతో శనివారమే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు అధికారిక PAగా పని చేసిన తుకారం విదేశాలకు పారిపోయారని తెలుస్తోంది. తిరుపతిలోని ఆయన నివాసంలో 12 రికార్డులు సీజ్ చేశారు.
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాలను, దర్శన క్యూ లైన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆల్వార్ ట్యాంక్ అతిథి గృహాల వద్ద ఉన్న ఏస్ఎస్డీ క్యూలైన్లు, టోకెన్ తనిఖీ కేంద్రాలను పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్- 1,2లోని కంపార్ట్మెంట్లు, సుపథం వద్ద చిన్నపిల్లల తల్లిదండ్రులు, దాతలతోపాటు వివిధ దర్శనాలను సంబంధిత అధికారులు ఆయనకు క్షుణ్ణంగా వివరించారు.
‘అరకాసుపల్లి కోటకు ఆరుగురు రెడ్లు, ఒక్కో రెడ్డికి ఆరుగురు భోగంసానులు’ అని కథలుగా చెప్పుకొన్న ఆ కోట నేడు కనుమరుగైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం(M) ఎలవానెల్లూరు పంచాయతీలో ఉన్న ఈ కోటపై పలువురి కన్నుపడింది. కోనేరు, నగారా రాయి, ధ్వజస్తంభం గుప్తనిధుల అన్వేషకులు నాశనం చేశారు. కోటను కొందరు ఆక్రమించి చదును చేసి తమ పొలంలో కలిపేసుకున్నారు.
9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ. 10న కల్కి జయంతి. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి. 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. 15న స్వాతంత్య్ర దినోత్సవం. స్మార్త ఏకాదశి. 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. 16న వరలక్ష్మీ వ్రతం. 19న శ్రావణ పౌర్ణమి. గరుడ సేవ. 27న శ్రీకృష్ణాష్టమి, తిరుమల శ్రీవారి ఆస్థానం.
మదనపల్లెలో పైళ్ల దగ్ధంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ‘ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదు. దెబ్బతిన్న సీసీ కెమెరాలనే కావాలనే బాగు చేయించలేదు. చుక్కల భూములను అక్రమంగా కొట్టేశారు. ఈ అక్రమాలు బయటకు రాకూడదనే కాల్చేశారు. 2,440 పైళ్లు కాలిపోగా 700 పైళ్లను కాపాడారు. ఈ ఘటనలో పెద్దిరెడ్డి పీఏ, ఆయన అనుచరుల ప్రమేయం ఉండొచ్చు’ అని సిసోడియా పేర్కొన్నారు.
విదేశాల్లో చదివిన వాడిని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘నా కుమారుడి వయస్సు 25 ఏళ్లు. ప్రజా జీవితంలోకి వచ్చిన నా బిడ్డను అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. నన్ను మించి నా కొడుకు ప్రజల పక్షాన ప్రజా పోరాటాలు ఎలా చేస్తారో ఈ ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు రుచి చూపిస్తారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అని చెవిరెడ్డి అన్నారు.
జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి గాను పార్ట్ టైం పద్ధతిలో సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలు https://nsktu.ac.in/ వెబ్సైట్లో చూడొచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 12.
Sorry, no posts matched your criteria.