Chittoor

News December 19, 2024

బంగారుపాలెం: మినీ లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి 

image

టాటా ఏస్ వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన బంగారుపాలెం మండలంలో జరిగినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. చిల్లగుండ్లపల్లెకు చెందిన ధరణి బాబు కుమార్తె ఏ.నేత్ర (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా అదే ఊరికి చెందిన చందుప్రసాద్ వాహనాన్ని అతివేగంగా నడిపి పాపను ఢీకొట్టాడు. చిన్నారి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. 

News December 19, 2024

 భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు

image

భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2025 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆప్‌లైన్‌లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్‌ లైన్‌లో భక్తులకు విక్రయిస్తోంది. టీటీడీ వెబ్ సైట్ ద్వారా (www.tirumala.org, ttdevasthanams.ap.gov.in) ఆన్ లైన్ లో నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేసేందుకు కల్పించిన సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

News December 19, 2024

తిరుపతి: అత్తను అత్యంత కిరాతకంగా చంపిన అల్లుడు

image

తిరుపతిలో అత్తను ఆమె అల్లుడు అత్యంత కిరాతకంగా కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు.. అలిపిరి పరిధిలోని సింగాలగుంటకు చెందిన ద్రాక్షాయిని (55) కొడుకు, కోడలు తరచూ గొడవలు పడుతుండేవారు. గొడవలకు కారణం ద్రాక్షాయిని అని ఆమె కోడలి తమ్ముడు రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 19, 2024

చిత్తూరు: రూ.1750 చెల్లిస్తే.. రూ.35 వేలు పరిహారం

image

జిల్లాలో మామిడి పంటకు ప్రభుత్వం కల్పించిన బీమా పథకం గడువును ఈ నెల ఆఖరు వరకు పొడిగించినట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి తెలిపారు. మామిడి రైతులు ఎకరాకు రూ.1750 చొప్పున ప్రీమియం చెల్లిస్తే ఎకరాకు రూ.35 వేలు చొప్పున ప్రధానమంత్రి పసల్ బీమా యోజన కింద రైతులకు నష్టపరిహారం అందిస్తారని తెలిపారు. ఆధార్, బ్యాంక్ పాసుబుక్, 1బి పత్రాలతో మీ సేవలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.

News December 19, 2024

బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం

image

బెంగళూరు యువతులతో తిరుపతిలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ కథనం..కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన కుమార్, దేవళంపేటకు చెందిన పార్థసారథి తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ విద్యుత్‌నగర్ వద్దనున్న ఓ హోమ్ స్టేకు  బెంగళూరు నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు కుమార్, పార్థసారథి, విటుడు సోమశేఖర్‌ను అరెస్ట్ చేశారు.

News December 19, 2024

చిత్తూరు: వాయిదా పడిన పరీక్షల తేదీలు ఇవే

image

వర్షం కారణంగా వాయిదా పడిన పరీక్షలను తిరిగి నిర్వహించడానికి తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిందని జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి తెలిపారు. ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వివరాలు ఇవే..
➤ ప్రైమరీ స్కూల్స్(1-5) 
21న ఇంగ్లీష్, 
23న గణితం
➤ హైస్కూల్లో (6-10) 
20న గణితం
21న హిందీ
23న ఇంగ్లీష్ 

News December 18, 2024

చిత్తూరు: ABCD అవార్డు సాధించిన పోలీసులు

image

చిత్తూరు జిల్లా పోలీసులు ఏబిసిడి (అవార్డు ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్) సాధించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. గుడిపాలలో జూలై 7న జరిగిన ఏటీఎం దొంగతనం కేసు చేదించి కరుడుగట్టిన అంతర్రాష్ట్ర ముద్దాయిని అరెస్టు చేసినందుకు ఏబిసిడిలో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. విజయవాడలోడీజీపీ ద్వారకా తిరుమలరావు చేతుల మీదుగా ఎస్పీ అవార్డు అందుకున్నారు.

News December 18, 2024

శ్రీకాళహస్తి: అక్రమ సంబంధం నెపంతో హత్య

image

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి కనబడుటలేదని గత నెల 25వ తేదీ అతని భార్య సుధా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ గోపి సమాచారం మేరకు.. ఏర్పేడు మండలం పల్లం పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ భార్య వసంతతో ప్రభాకర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో వెంకటేశ్ బంధువులైన సుబ్రహ్మణ్యం, హేమంత్‌లతో కలిసి ప్రభాకర్‌ను చంపి సమీపంలో నీటి కుంటలో పూడ్చి పెట్టారు.

News December 18, 2024

చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా

image

చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.10 లక్షలు జరిమానా జడ్జి ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జరుగు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

News December 17, 2024

చిత్తూరు: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో భారీ జరిమానా

image

చిత్తూరు నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 11 మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ నిత్య బాబు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.1.10 లక్షలు జరిమానా జడ్జి ఉమాదేవి విధించినట్లు తెలిపారు. మొదటిసారి పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, 6 నెలలు జరుగు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.15 వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.