India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో అగ్ని వీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంటర్/ ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/ వెబ్ సైట్ లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 28.
రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారని చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ‘దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలి. నీ అద్భుత నటనతో గాయం కాని ఘటనలో 37 మంది అమాయకులను జైలుకు పంపించావు. ఆ కుటుంబాల శాపాలు నీకు తగులుతాయి. ఈ పాపం ఊరికే పోదు. దేవుడు, ప్రకృతి గొప్పవి. గుర్తుంచుకో’ అని చెవిరెడ్డి అన్నారు.
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్లో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ యానిమల్ హస్బండరీ (Animal Husbandry Diploma) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. పదో తరగతి పాసైనా అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 22.
పులిచెర్ల(మం)లోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయం వద్ద ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి రెడ్డి హుసేన్ మామిడి తోటలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా బాలిక కేకలు వేసింది. కేకలు విన్న బాలిక తల్లి ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. కడప జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న కమిషనర్ అదితి సింగ్ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అదితి సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరూ తమ విధులను బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో డిగ్రీ 3వ సెమిస్టర్, ఈ ఏడాది జులై నెలలో 6వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఓ ప్రైవేట్ హోటల్లో రహస్య సమావేశమయ్యారు. తిరుపతి కార్పొరేషన్ పై టీడీపీ, జనసేన పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మెజారిటీలో ఉన్న వైసీపీ కార్పోరేటర్లను తమవైపుకు తిప్పుకొనేలా టీడీపీ, జనసేన పార్టీలు పోటీపడుతున్నాయి. ఇవాళ జరిగిన రహస్య సమావేశంలో డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు ముఖ్యమైన కార్పోరేటర్లు పాల్గొన్నారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భద్రత మరింత కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆయనకు 4 + 4 భద్రత కొనసాగింది. ఆ తర్వాత 2+2 గన్మెన్లకు ప్రభుత్వం తగ్గించింది. ఇదే విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉంది. పుంగనూరు అల్లర్ల తర్వాత ఆయన భద్రతను 1+1కు కుదించారని.. దాడుల తర్వాత సెక్యూరిటీ పెంచాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో చిన్నారిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులకు వెళ్లారు. వాళ్ల కుమార్తె(10) సచివాలయం వద్ద ఆడుకుంటుండగా తాపీమేస్త్రీ రెడ్డి హుస్సేన్(28) తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె కనపడలేదు. చివరకు తోటలో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్నాడు.
తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జరిగిన అల్లర్లపై ప్రస్తుత చంద్రగిరి MLA పులివర్తి నాని ఫిర్యాదుతో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో తనకు మందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమంటూ ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించి.. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
Sorry, no posts matched your criteria.