India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుజరాత్లోని ఎర్రచందనం గోడౌన్పై తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి ముగ్గురు అంతర్రాష్ట్ర ప్రధాన స్మగ్లర్లను మంగళవారం అరెస్ట్ చేశారు. సుమారు రూ.3.5 కోట్ల విలువ గల 155 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా సానిపాయ ప్రాంతంలో ఇద్దరు ఎర్రచందనం ముద్దాయిలను అరెస్టు చేసి విచారించగా.. వారి ద్వారా గుజరాత్ గోడౌన్ గురించి సమాచారం తెలిసిందని వారు తెలిపారు.
తిరుపతి వేదిక్ యూనివర్సిటీ ఆవరణంలో ఓ చిరుత పులి రాత్రిపూట తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తుందని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో యూనివర్సిటీ ప్రధాన రోడ్లలో తిరుగుతుండడంతో సీసీ కెమెరాలకు చిక్కింది. దీంతో అధికారులు గుర్తించారు. చిరుత పులిని ఎలా బంధించాలనే విషయంపై అటవీ శాఖ, యూనివర్సిటీ, పోలీసు యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నారు. విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.
యర్రావారిపాలెం పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ YCP మాజీ MLA చెవిరెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై నిన్న విచారణ జరిగింది. కేసు పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను జడ్జి ఆదేశించారు. ఈ కేసులో ముందస్తు అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని..అవసరమైతే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలని పిటిషనర్కు సూచించింది. కాగా బాలిక విషయమై దుష్ర్పచారం చేసినందుకు చెవిరెడ్డిపై కేసు నమోదైంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల 2025 మార్చి నెల కోటాను 18న ఉ.10 గంటలకు TTD ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల రిజిస్ట్రేషన్ కోసం డిసెంబరు 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. అనంతరం లక్కీడిప్లో సెలెక్టయిన వారి జాబితాను ప్రకటిస్తారు. ఆపై సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
పెరుగుతున్న రైల్వే ట్రాఫిక్ దృష్ట్యా రేణిగుంట-గూడూరు మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణం కూడా అత్యవసరమని ఎంపీ గురుమూర్తి తెలిపారు. పార్లమెంట్లో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రైల్వే మార్గాలపై భారం తగ్గించి, ప్రయాణం వేగవంతం చేసేందుకు ఈ కొత్త లైన్ ఎంతో అవసరమనే విషయాన్ని వివరించారు. అలాగే పూడి, ఏర్పేడు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం ద్వారా కనెక్టివిటీ మెరుగవుతుందని తెలిపారు.
చంద్రగిరి రంగంపేట సమీపంలోని ఎంబీయూ యూనివర్సిటీకి నటుడు మంచు మోహన్ బాబు చేరుకున్నట్లు సమాచారం. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన రేణిగుంట నుంచి యూనివర్సిటీకి కారులో చేరుకున్నారని తెలుస్తోంది. తన కుటుంబ గొడవల కారణంగా చాలా రోజులుగా ఆయన యూనివర్సిటీకి రాలేదు.
ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గతంలో కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మళ్లీ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని IMD హెచ్చరించింది. దీంతో ఓ వైపు వర్షం, మరోవైపు చలితో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు.
తిరుపతి నగరంలోని భవానీ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కోస్తా, ఇతర ప్రాంతాల నుంచి మహిళలను పిలిపించి ఈ పని చేయిస్తున్నారు. పోలీసులు ఆదివారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడులు చేశారు. వ్యభిచారం నడిపిస్తున్న ఇద్దరు నిర్వాహకులను, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
చిత్తూరు కలెక్టరేట్లో రేపు (సోమవారం) ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం1 వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని ఆదేశించారు. ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
చిత్తూరు జిల్లా పేరు ప్రపంచవ్యాప్తంగా గట్టిగా రీసౌండ్ వినిపిస్తోంది. పుష్ప థియేటర్లలోతగ్గేదేలే అంటూ మాస్ దరువేయించగా.. ఇప్పుడు ఆ జాబితాలో తిరుపతి జిల్లా వాసి గుకేశ్ చేరాడు. ఇటీవల వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ పోటీలో 18 ఏళ్లకే టైటిల్ గెలిచి ‘ఇది ఉ.చిత్తూరు జిల్లా బ్రాండ్’ అంటూ గట్టిగా జిల్లా పేరు వినిపించాడు. దీంతో చిత్తూరు జిల్లా అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ జిల్లా వాసులు కాలరెగరేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.