Chittoor

News July 21, 2024

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహన తనిఖీలు

image

తిరుపతి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నిరంతరం ప్రజలతో మమేకమై, నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం జిల్లాలో 54 ప్రదేశాలలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి వాహనదారుడు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను కలిగి ఉండాలన్నారు.

News July 20, 2024

తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య

image

తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య నియమితులయ్యారు. ఏపీలో భారీగా IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నారపురెడ్డి మౌర్య కర్నూల్ జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.

News July 20, 2024

తిరుమల: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త

image

టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు శుభవార్త. గతంలో లోన్ కోసం ఉద్యోగులు మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. దానిని సులభతరం చేస్తూ ఆన్ లైన్ అప్లికేషన్ ను ప్రవేశ పెట్టినట్లు టీటీడీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు చీర్ల కిరణ్ తెలిపారు. వివరాల కోసం https://ehrmaps.tirumala.org లో లాగిన్ అవ్వాలని సూచించారు.

News July 20, 2024

TUDA ఛైర్మన్‌గా చైతన్య ఆదికేశవులు..?

image

తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్‌గా చైతన్య ఆదికేశవులు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ ఓటమితో మోహిత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

News July 20, 2024

చిత్తూరు: TODAY 6PM TOP NEWS

image

-కుప్పంలో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న నారా భువనేశ్వరి!
-తిరుపతి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
-శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత
-బయటకు వెళ్లిపోదామనుకున్నా: చెవిరెడ్డి
-RTC బస్సును నడిపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి
-ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

News July 20, 2024

ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

image

ముదివేడు కస్తూర్భా పాఠశాలలో ముగ్గరు విద్యార్థులు రెండు రోజులు క్రితం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నాధికారులు ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

బయటకు వెళ్లిపోదామనుకున్నా: చెవిరెడ్డి

image

వైసీపీలో ఏ ఒక్కరిపై చేయి వేసినా ఊరుకునేది లేదని చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన నానికి పరిపాలించే అవకాశం ఇద్దామనుకున్నా. బయటకు వెళ్లి వ్యాపారం చేసుకుందామని భావించా. కానీ నన్ను నమ్మిన కార్యకర్తలను రోజూ కొడుతూనే ఉన్నారు. అది చూడలేకపోతున్నా. ఇకపై పూర్తి సమయం కార్యకర్తలకే కేటాయిస్తా. ప్రతిపక్షంలో నా పోరాటం ఎలా ఉంటుందో ముందు చూస్తారు’ అని చెవిరెడ్డి అన్నారు.

News July 20, 2024

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిత

image

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతంరం ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

News July 20, 2024

తిరుపతి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

స్విమ్స్ యూనివర్సిటీ పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అల్లెడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు ఇంటర్ బైపీసీ తత్సమానమైన అర్హత, ఏపీ ఎంసెట్ ర్యాంకు-2024‌తో మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. దరఖాస్తులను ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో పొందవచ్చని సూచించారు.

News July 20, 2024

రేపు తిరుపతిలో రోల్‌బాల్ ఎంపికలు

image

తిరుపతి, చిత్తూరు రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌నాథ్, కార్తీక్ తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో అండర్-11, 14, 17, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు తమ పేర్లను శనివారం సాయంత్రంలోపు నమోదు చేసుకోవాలన్నారు.