Chittoor

News December 6, 2024

CTR : 10వ తేదీన జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో 10వ తేదీన చిత్తూరు పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 6, 2024

పుష్ప-2తో తిరుపతిలో ట్రెండ్ మారుతోంది..!

image

తిరుపతి గంగమ్మ జాతరలో భక్తులు ఒక్కో రోజు ఒక్కో వేషంతో అమ్మవారిని దర్శించుకుంటారు. ఇందులో మాతంగి వేషం కీలకమైంది. మగవారు ఆడవారిలా తయారు కావడమే ఈ వేషం ప్రత్యేకత. పుష్ప-2లో అల్లు అర్జున్ గెటప్ రిలీవ్ కాకముందు సాధారణంగా వేషాలు వేసేవారు. పుష్ప మేనియాతో అందరూ అదే తరహాలో వేషం వేస్తున్నారు. గత జాతరలో MP గురుమూర్తి సైతం ఇలాగే వేషం వేయడం విశేషం. మరి రానున్న జాతరలో ఎంత మంది పుష్పలాగా కనిపిస్తారో చూడాలి మరి.

News December 6, 2024

మదనపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్ 

image

మదనపల్లె అమ్మచెరువు మిట్టలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బి.కొత్త కోటమండలం బండమీదపల్లెకు చెందిన నరేశ్ కుమార్ రెడ్డి(26)తోపాటు నీరుగట్టుపల్లె మాయాబజార్‌కు చెందిన దామోదర్ రెడ్డి(25) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి మహేందర్(20) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 6, 2024

శ్రీ పద్మావతీ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ ఛైర్మన్

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారికి టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎనిమిదో రోజైన గురువారం రాత్రి శ్రీపద్మావతి అమ్మవారు మహారాణీ అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. టీటీడీ ఈవో చేతులు మీదుగా టీటీడీ ఛైర్మన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

News December 5, 2024

ఐరాల: హైవేపై ప్రమాదం.. ఒకరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన ఐరాలలో చోటుచేసుకుంది. చిత్తూరు-పీలేరు జాతీయ రహదారిపై ఐరాల మండలం చుక్కవారిపల్లి వద్ద బైకును  గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో బైక్‌‌పై వెళ్తున్న తెల్లగుండ్లపల్లికి చెందిన ఆత్మయ్య మృతి చెందగా.. సురేశ్ గురవయ్య గాయపడ్డారు. గాయపడ్డవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News December 5, 2024

చిత్తూరు:ధాన్యం కొనుగోలు ప్రక్రియపై CM సమీక్ష

image

పౌర సరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై గురువారం జిల్లా కలెక్టర్లతో అమరావతి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. చిత్తూరు జిల్లా  నుంచి సుమిత్ కుమార్ హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ..తడిసిన ధాన్యం ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు  చేయాలని సూచించారు.

News December 5, 2024

తిరుపతి: గంజాయి కేసులో 17 మంది అరెస్ట్

image

గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు చేపడుతున్న 17 మందిని అరెస్టు చేసినట్టు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు గురువారం తెలిపారు. శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, BN కండ్రిగ ప్రాంతాలలో పోలీసులు తనిఖీలు నిర్వహించారన్నారు. నిందితుల నుంచి 32 కేజీల గంజాయి, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి కట్టడికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది ద్వారా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 

News December 5, 2024

తిరుపతి: కిడ్నాప్ కేసులో ఆరుగురు అరెస్ట్

image

తిరుపతిలో గత నెల 28న కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిందే.పెనుమూరు(M) రేణుకానగర్ వాసి శ్రీనివాసులు(నాని) కొన్నేళ్ల క్రితం తిరుపతికి వచ్చాడు. మదనపల్లె వాసి సోనియాభానుతో సహజీవనం చేశాడు. నాని ప్రవర్తన నచ్చని ఆమె మదనపల్లెకు వెళ్లింది. సమీప బంధువుతో కలిసి నానిని కిడ్నాప్ చేసి కాలు, చేయి తీయించాలని ప్లాన్ వేసింది. కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆరుగురిని అరెస్ట్ చేశారు.

News December 5, 2024

చిత్తూరు: అభ్యంతరాలు ఉంటే తెలపండి

image

చిత్తూరు జిల్లాలోని మున్సిపల్, నగర పాలకోన్నత పాఠశాలలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాష పండితులకు SA లుగా పదోన్నతులు కల్పిస్తూ సీనియారిటీ జాబితా విడుదల చేస్తామని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఎంఈఓ, డివైఈవో మెయిల్ ద్వారా ఈ జాబితా పంపించామన్నారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో 7వ తేదీ సాయంత్రం 4 లోపు డీఈవో కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News December 4, 2024

తిరుపతి: 1535 మందితో బందోబస్తు

image

తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. 1535 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పుణ్యమి గడియలు రోజంతా ఉంటుంది కాబట్టి భక్తులు ఆతృత చెందరాదన్నారు. విడతలవారీగా భక్తులు పుణ్యస్నానం ఆచరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తొక్కిసలాటకు తావు లేకుండా ప్రతి భక్తుడు స్నానం ఆచరించేలా చూస్తామన్నారు.