India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా 2005 బ్యాచ్కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి నియమితులయ్యారు. డిప్యూటేషన్పై ఏపీలో మూడేళ్లపాటు పనిచేయనున్నారు. వెంకయ్య చౌదరిని డిప్యూటేషన్పై ఏపీకి పంపేందుకు కేంద్రప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది.
చిత్తూరు సంతపేట బండ్ల వీధికి చెందిన టింపుల్ అనే విద్యార్థి 6వ తరగతి చదువుతోంది. టింపుల్ తల్లిదండ్రులు మరణించారని, తన చదువు, ఆరోగ్య సంరక్షణ కోసం తమను ఆదుకోవాలని కలెక్టర్ ను ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద కలెక్టర్ సుమిత్ కుమార్ రూ.25 వేలును టింపుల్ కు ఆర్థిక సహాయం అందజేశారు.
అవి 1980 నాటి రోజులు. అప్పుడే తిరుపతి పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. ఆ రోజుల్లో తిరుచానూరు, రేణిగుంటకు వెళ్లాలంటే ఈ గద్ద ముక్కు ఆటోలే(టెంపోలు) దిక్కు. కోనేటి కట్ట దగ్గర(నేటి విష్ణు నివాసం) నుంచి చిత్తానూరు(తిరుచానూరు)కు ఇవి బయల్దేరేవి. రబ్బరు గొట్టం హారన్ మోగిస్తే వచ్చే శబ్దంతో ఎంతటోడైనా హడలేత్తి పక్కకు జరగాలసిందే. ఇందులో ప్రయాణం మరచిపోలేని అనుభూతి. మీరు ఇందులో ప్రయాణించి ఉంటే కామెంట్ చేయండి.
మొహర్రం సందర్భంగా చిత్తూరు జిల్లాలోని పాఠశాలలకు మంగళ, బుధవారాల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు డీఈవో దేవరాజు తెలిపారు. మంగళవారం ఆప్షనల్ సెలవుగా ఉంటుందన్నారు. ఆయా యాజమన్యాలు ఇష్టప్రకారమే మంగళవారం సెలవు అని.. బుధవారం ప్రభుత్వ సెలవు రోజని చెప్పారు. మరోవైపు తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోనూ మంగళవారం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.
‘అటవీ, మైనింగ్ శాఖలకు ఒకే మంత్రి ఎక్కడా ఉండరు. తొలిసారి గత ప్రభుత్వం ఈ రెండింటిని ఒకరికే కట్టబెట్టి, దొంగచేతికి తాళాలిచ్చి దోచేసింది’ అని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి సీఎం చంద్రబాబు అన్నారు. ‘పుంగనూరు, కార్వేటినగరంలో అటవీ భూమిని ఆక్రమించి 6.72 హెక్టార్లలో అక్రమ మైనింగ్ చేశారు. మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో 19.581 హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారు’ అని CM ఆరోపించారు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో 67, తిరుపతి డివిజన్లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. చిత్తూరు డివిజన్లో 67, తిరుపతి డివిజన్లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
ప్రైవేటు బస్సును బైకు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాదకర ఘటన సోమవారం సాయంత్రం మదనపల్లి మండలంలో చోటు చేసుకుంది. సీఐ శేఖర్ కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని చీకిలబైలు సరిహద్దు చెక్పొస్ట్ వద్ద ఓ ప్రయివేట్ బస్సును బైకు ఢీకొంది. బైక్పై వెళ్తున్న ఇద్దరు గుర్తు తెలియని యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కడపకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా పోలీసు అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసు అతిథి గృహం వద్ద ఆదివారం రాత్రి జిల్లా అధికారులు పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఆయన సేవలను కొనియాడారు. తనకు సహకరించిన వారికి ఎస్పీ కృతజ్ఞతలు చెప్పారు. అడిషనల్ ఎస్పీలు విమలాకుమారి, కులశేఖర్ పలువురు అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.