Chittoor

News February 8, 2026

చిత్తూరు: రైతన్నకు మారింత భారంగా..

image

రబీ సీజన్లో ఎరువుల ధరలు పెరుగుతుండడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు ఎరువుల ధరను పెంచారు. గతంలో వివిధ రకాల ఎరువుల బస్తాలు రూ. 1550 నుంచి 1600 వరకు లభించేది. ప్రస్తుతం వాటి ధరలు రూ. 50 నుంచి 150 రూపాయల వరకు పెరిగాయి. పంటలకు అంతంత మాత్రంగా ఉన్న గిట్టుబాటు ధరలతో నష్టపోతున్న రైతులకు ఎరువుల ధర భారమవుతోంది.

News February 8, 2026

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలియజేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జీలు, బస్సు స్టాండ్ లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల కేసులలో పట్టుపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 8, 2026

చిత్తూరు జిల్లాలో కోడి ధర KG రూ.140

image

చికెన్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.132-రూ.140 లవరకు ఉంది. మాంసం రూ.191-రూ.216 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.218 నుంచి రూ.240 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ.75 గా ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 8, 2026

చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు మరో ఛాన్స్

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నామినల్ రోల్స్ లో తప్పిదాల సవరణకు అవకాశం కల్పించారని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. విద్యార్థుల నామినల్ రోల్స్‌లో ఆన్ లైన్లో సవరణలు చేసుకునేందుకు హెచ్ఎం లాగిన్‌లో అవకాశం కల్పించారన్నారు. దీన్ని ఆయా హెచ్ఎంలు సద్వినియోగం చేసుకుని, ఈనెల 12వ తేదీ లోపు తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకోవాలన్నారు.

News February 7, 2026

కుప్పంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్

image

కుప్పం నియోజకవర్గ పరిధిలో వారం రోజుల్లో ఐదుగురు యువతుల మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమో లేక కుటుంబ కారణాల నేపథ్యమో తెలియదు గానీ మైనర్ బాలికలతో పాటు 22 ఏళ్లలోపు యువతులు అదృశ్యమవుతున్నారు. వారం రోజుల్లో రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క మిస్సింగ్ కేసు నమోదయింది.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.

News February 7, 2026

చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.