India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 6 నుంచి 2025 జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లతో రెవెన్యూ మంత్రి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సంబంధించి దిశా నిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు జిల్లా సచివాలయం నుంచి కలెక్టర్ సుమిత్ కుమార్, జేసీ హాజరయ్యారు.
బంగారుపాలెంలోని ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న 12 ఏళ్ల బాలిక మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. శేషాపురానికి చెందిన గుణశ్రీ జ్వరంతో బాధపడుతుండగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంజక్షన్ వేశారు. కొంతసేపటికే మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబీకులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పద్మావతి పురం ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 5న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి లోకనాథం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొంటున్నట్లు వివరించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు https://naipunyam.ap.gov.in/ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
టూ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ నెట్టికంటయ్య నగరంలోని పలు ప్రార్ధనా మందిరాలకు 120 స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నియంత్రణకు టూ టౌన్ పరిధిలోని అన్ని చర్చిలు, దేవాలయాలు, మసీదులకు స్మార్ట్ అలారం లాక్ లను పంపిణీ చేస్తున్నామన్నారు. దుకాణా దారులు, ఇంటి యజమానులు సైతం ఈ లాక్ లను తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తుఫాను ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో పోలీసు యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నట్టు ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. వాగులు, వంకల వద్ద ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్లపై నేలవాలిన వృక్షాలను ఎప్పటికప్పుడు తొలగించేలా సిబ్బంది చర్యలు చేపట్టారన్నారు. అత్యవసర సమయాలలో 112/80999 99977కు సమాచారం ఇవ్వాలన్నారు.
రైతుపై ప్రత్యర్థులు హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆదివారం పెద్దమడెం మండలంలో చోటుచేసుకుంది. SI రమణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బండమీదపల్లికి చెందిన లక్ష్మీనారాయణ(55) పొలంలో వేరే పొలానికి చెందిన వెంకటరమణ పాడి పశువులు పంట నష్టం చేశాయని ఇటీవల మందలించాడు. దీంతో కసి పెంచుకొన్న వెంకటరమణ తన అనుచరులతో దారికాసి కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచి, హత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.
కుటుంబ సమస్యలతో తన భార్య తిరుపతికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపిందని వినుకొండకు చెందిన ఓ వ్యక్తి తిరుపతి ఎస్పీకి ఫోన్ చేసి వివరించారు. వెంటనే SP సుబ్బారాయుడు ఆదేశాలతో సిబ్బంది ఆమె ఫొటోతో విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. చివరికి ప్లాట్ఫామ్ ట్రాక్ వద్ద ఆమెను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబానికి సమాచారం అందించారు. దీంతో సిబ్బందిని SP అభినందించారు.
మదనపల్లె MLA షాజహాన్ బాషా తనను బెదిరిస్తున్నారంటూ MRO ఖాజాబీ మంత్రి లోకేశ్కు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ ఎమ్మెల్యే తనపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆమె మంత్రి వద్ద వాపోయారు. తన విధుల విషయంలో జోక్యం చేసుకుని బెదిరిస్తున్నాడరన్నారు. తనకు ఎమ్మెల్యే నుంచి ఎలాంటి ఒత్తిడులు లేకుండా విధులు నిర్వర్తించేలా చూడాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
శ్రీకాళహస్తి రూరల్ మండలం చిన్నమిట్ట కండ్రిగ గ్రామపంచాయతీ ఒటి గుంట సెంటర్లో ఓ వ్యక్తి శనివారం హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. శ్రీకాళహస్తి మండలం K.వెంకటాపురం గ్రామానికి చెందిన గుండుగారి రవి (30)ని ఒటిగుంటకు చెందిన ఆర్ముగం (38) శనివారం కత్తితో నరికి హత్య చేశాడు. రూరల్ సీఐ రవి నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫెంగల్ తుఫాన్గా మారిన నేపథ్యంలో తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవరు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. జిల్లాలో ఎటువంటి ఆస్తి, పశు, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య ఉంటే కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూం(0877-2236007)ను సంప్రదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.