Chittoor

News March 21, 2025

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో మిథున్ రెడ్డి భేటీ

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. గురువారం పార్లమెంటు భవనంలో కలిశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌తో రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చించారు. ఆయనతో పాటు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఉన్నారు.

News March 21, 2025

పులిచెర్ల: నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

image

నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను కల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై కల్లూరు పోలీసులకు సమాచారం అందడంతో వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక కారు ఆగకుండా వెళ్లడంతో వెంబడించి పట్టుకున్నారు. కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు చెప్పారు.

News March 21, 2025

14400కు కాల్ చేయండి: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో సారా నిర్మూలనకు సమష్టి కృషి అవసరమని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో నవోదయం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. నవోదయం 2.0 ద్వారా సారా నిర్మూలనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా సారా తయారీ చేసినా, విక్రయించినట్లు తెలిసినా ప్రజలు 14400 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఎస్పీ మణికంఠ, ఎక్సైజ్, ఫారెస్ట్, రెవెన్యూ, అధికారులు పాల్గొన్నారు.

News March 20, 2025

చిత్తూరు: KGBVలో ప్రవేశాలు.. అర్హతలు ఇవే

image

చిత్తూరు జిల్లాలోని 8 కేజీబీవీల్లో 6, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సమగ్ర శిక్ష APC వెంకటరమణ మాట్లాడుతూ.. అలాగే 7, 8, 9, 10, 12వ తరగతుల్లో మిగిలిన సీట్లకు ఈనెల 22వ తేదీ నుంచి ఏప్రిల్11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాప్ అవుట్, SC, ST, మైనారిటీ, బీపీసీ బాలికలు దరఖాస్తుకు అర్హులని చెప్పారు. ఇతర వివరాలకు 7075159996లో సంప్రదించాలన్నారు.

News March 20, 2025

పుంగనూరు: కోర్టులో లొంగిపోయిన నిందితురాలు

image

పుంగనూరు మండలంలోని కృష్ణాపురంలో రామకృష్ణ హత్యకేసులో నిందితురాలైన రజిని బుధవారం న్యాయవాది శివప్పనాయుడు ద్వారా కోర్టులో లొంగిపోయింది. రికార్డులు పరిశీలించిన అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి వంశీకృష్ణ ఆమెను జుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ హత్య కేసులో నిందితులైన త్రిలోక, మహేశ్‌ను అరెస్టు చేసినట్లు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ చెప్పారు.

News March 20, 2025

చిత్తూరు: కురబ కులస్థుల పెద్ద జాతరకు రావాలని YS జగన్‌కు ఆహ్వానం

image

చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం జ్యోగ్గానూరులో కురబ కులస్థుల సిద్దేశ్వర, వీరేశ్వర పెద్ద జాతరకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జడ్పీటీసీ కృష్ణమూర్తి, మునెప్ప, రవిలు కోరారు. ఏడేళ్లకు ఒకసారి వైభవంగా పెద్ద జాతరను నిర్వహిస్తారు. బుధవారం విజయవాడలో జగన్ను కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చారు. కురబ కులస్థులకు ఆయన ఈ సందర్భంగా జాతర శుభాకాంక్షలు తెలిపినట్లు వారు తెలిపారు. కులస్థుల – సిద్దేశ్వర – సందర్భంగా

News March 19, 2025

పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

image

చిత్తూరు నగరంలోని మున్సిపల్ హైస్కూల్‌లో జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు బుధవారం పరిశీలించారు. చిత్తూరు జిల్లా అంతట పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు  స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని రకాల భద్రత చర్యలను ఏర్పాటు చేశామన్నారు.

News March 19, 2025

చిత్తూరు: లంచం కోసం SI అరాచకం.. మహిళ మంగళసూత్రం తాకట్టు పెట్టించి..!

image

SI వెంకట నరసింహులు సస్పెన్షన్‌కు గురయ్యారు. చిత్తూరు జిల్లా సోమల పీఎస్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ మహిళ నుంచి లంచం తీసుకున్న ఘటనలో సస్పెండ్ చేశారు. 2023లో ఓ మహిళ అదృశ్యమవ్వడంతో భర్త ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ఆమె స్టేషన్‌కు చేరుకుని తన భర్తతో కలిసి ఉంటానని చెప్పింది. అందుకు ఎస్ఐ రూ.లక్ష డిమాండ్ చేసి, మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టించాడు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు.

News March 19, 2025

చిత్తూరు: నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు

image

జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లాలో గుర్తించిన ప్రాంతాల్లో షెడ్యూల్ మేరకు బుధవారం నుంచి 22వ తేదీ వరకు, ఆ తర్వాత 25 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక క్యాంప్లను నిర్వహించనున్నారు. జిల్లాలోని సచివాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహించనున్నారు.

News March 19, 2025

పుంగనూరు: 450 ఏళ్ల చరిత్ర కలిగిన సుగుటూరు గంగమ్మ జాతర

image

పుంగనూరు నగరి వీధిలో వెలసి ఉన్న సగుటూరు గంగమ్మ జాతరకు జమీందారు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతర ఈనెల 25,26వ తేదీల్లో జరగనుంది. సగుటూరు గంగమ్మ జాతరకు సుమారు 450 సంవత్సరాల చరిత్ర ఉంది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా కొలువై ఉండటంతో జిల్లా వాసులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.