India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టీటీడీ నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో కియోస్క్(KIOSK) మిషన్ను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ మిషన్ను టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి బుధవారం ప్రారంభించారు. ఈ మిషన్ను కెనరా బ్యాంకు టీటీడీకి విరాళంగా అందించింది. రూ.1 నుంచి రూ.99,999 వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు యూపీఐ ద్వారా విరాళం ఇవ్వవచ్చు.
NTR సుజలస్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఓ హబ్, స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. చిత్తూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, శ్రీకాకుళంలో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పారని, అందులో 20 నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. చిత్తూరు, KNL, NDL నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటినీ పునరుద్ధరిస్తామన్నారు.
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 62,248 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,852 వేల మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుని హుండీ ద్వారా రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించింది.
900 ఏళ్ల ఘన చరిత్ర గల ‘తిరుపతి గంగమ్మ జాతర’ గురించి తెలిసిందే. ఏడు రోజులు జరిగే ఈ జాతరలో మగవారు విభిన్న వేషాలు ధరించడం, అమ్మ వారిని తిట్టడం, జాతర ముగింపు రోజు అమ్మ వారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడం దేశంలో మరెక్కడా కనిపించదు. దక్షిణ భారత దేశానికే తెలిసిన ఈ జాతర విశేషాలు ‘పుష్ప-2’తో ప్రపంచ వ్యాప్తంగా తెలియనుందని తిరుపతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎం. ఫార్మసీ (M.Pharmacy) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
ట్రాక్టర్ కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటన యాదమరి మండలంలో జరిగింది. పలమనేరుకు చెందిన దంపతులు యాదమరి మండలం వరిగిపల్లి వద్ద ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. వారి కుమార్తె సుదర్శన (4) ట్రాక్టర్ కింద ఆడుకుంటూ ఉండగా.. ట్రాక్టర్ ఇటుకలు లోడ్ చేసి వెనుక రివర్స్ ఎత్తినప్పుడు ప్రమాదవశాత్తు టైర్ కింద పడి మృతి చెందింది. మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాదమరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
శబరిమల యాత్రకు వెళ్లిన వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వాహనం చిక్కుకుంది. కేరళ పోలీసులు సహకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఎలాగైనా తమకు సాయం చేయాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేశ్.. వారిని వెనక్కు రప్పిస్తామని చెప్పారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో దస్త్రాల దహనం కేసుపై శాసన మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఎంతటి వారున్నా వదిలిపెట్టమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని మంత్రి ప్రస్తావించడంతో MLC బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా CID విచారణలో పేర్కొన్న అంశాలనే తాను చెప్పానని అనగాని అన్నారు.
సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మంగళగిరి వైసీపీ సోషల్ మీడియాకు చెందిన పాలేటి రాజకుమార్ పై చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసులు కలిసి టీడీపీ నాయకులు జాఫర్ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.
మాజీ మంత్రులు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు పై విశాఖ టూ టౌన్ స్టేషన్లో టీడీపీ నాయకులు సోమవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్పై గతంలో వీరు అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ టీడీపీ జిల్లా పార్లమెంటు ఉపాధ్యక్షుడు విల్లూరి చక్రవర్తి, విల్లూరి తిరుమల దేవి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.