India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అవినాక్షయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కార్వేటినగరం SI రాజ్ కుమార్ తెలిపారు. నిందితుడిపై జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 31 కేసులు ఉన్నట్లు వారు తెలిపారు. నిందితుడిని ఇవాళ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు ఊతుకోట వద్ద అరెస్ట్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసిన సిబ్బందిని SP అభినందించారు.

తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాల్గవ సౌత్ జోన్ షూటింగ్ బాల్ చాంఫియన్ షిప్ పోటీల్లో రామకుప్పం మండలంలోని బళ్లకు చెందిన విద్యార్థి మౌనిశ్ విశేష ప్రతిభ కనబరచాడు. సీనియర్ విభాగంలో ఇతను విజేతగా నిలిచాడు. ఇతను ఎస్వీయులో డిగ్రీ చదువుతున్నాడు. పోటీల్లో ప్రతిభ చాటిన మౌనిశ్ను బుధవారం స్థానిక టీడీపీ నేతలు మునస్వామి, నాగభూషణం, పట్ర నారాయణ, జయశంకర్, మునిరత్నం తదితరులు అభినందించారు.

వేసవిలో తాగునీటి సమస్యపై అలసత్వం వద్దని అధికారులకు చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయం నుంచి RWS అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్య నివారణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పంచాయతీల వారీగా తాగునీటి సరఫరాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నీరు కలుషితం కాకుండా చూసుకోవాలని సూచించారు.

మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలు పాఠశాలల్లో లింగ సమానత్వంపై పెయింటింగ్ పోటీలు బుధవారం నిర్వహించినట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. మహిళా, పురుష సమానత్వంపై అవగాహన పెంచేలా పోటీలు ఉపయోగపడతాయన్నారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయాన్ని అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈనెల 8 వరకు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు.

యూత్ పార్లమెంట్ పోటీలకు ఈనెల 9వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని NYK కోఆర్డినేటర్ ప్రదీప్ కోరారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత మై భారత్ పోర్టల్లో నిమిషం నిడివి గల వికసిత్ భారత్ అంటే ఏమిటి అనే వీడియోను అప్లోడ్ చేసి రిజిస్టర్ కావాలని సూచించారు. 15న చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో స్క్రీనింగ్ నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామన్నారు. ప్రిన్సిపల్ జీవనజ్యోతి గోడపత్రిక ఆవిష్కరించారు.

పూతలపట్టు నియోజకవర్గంలో పనిచేయడానికి రిపోర్టర్ల నుంచి Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఐరాల, తవణంపల్లె, పూతలపట్టు,బంగారుపాలెం,యాదమర్రి మండలానికి చెంది, అనుభవం ఉన్నవాళ్లే అర్హులు. ప్రస్తుతం ఏదైనా మీడియాలో పనిచేస్తున్న వాళ్లు సైతం అర్హులుగా పరిగణిస్తాం. <

కార్వేటినగరం(మం)లో విషాదం నెలకొంది. ఆళత్తూరు వాసి శ్రావణ్ తన ఫ్రెండ్ చెన్నకేశవులతో కలిసి ఓ పుట్టిన రోజు వేడుకకు కొల్లాంగుట్టకు బైకు మీద వెళ్లారు. తిరిగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న బైకును కొల్లాగుంట చెక్ పోస్ట్ సమీపంలో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో శ్రావణ్(25) అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నకేశవులు తీవ్రంగా గాయపడ్డాడు. శ్రావణ్కు ఐదు నెలల క్రితమే వివాహం కాగా.. ఆమె గర్భిణి.

చంద్రగిరి కళ్యాణి డ్యాం PTCలో సీఐగా పనిచేస్తున్న రామకృష్ణ ఇటీవల ఢిల్లీలో జరిగిన మారథాన్లో 3:26:36 గంటల్లో 42.2 కిలోమీటర్ దూరాన్ని పూర్తిచేసి పథకాన్ని సాధించారు. ప్రస్తుతం ప్రతిష్ఠాత్మకమైన బోస్టన్ మారథాన్ (USA) సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈయన గతంలో చిత్తూరులో సీఐగా పనిచేసి పలు మారథాన్లలో పథకాలు సాధించారు. ఈ మేరకు ఆయనకు ఉన్నత అధికారుల అభినందనలు తెలిపారు.

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు MP ప్రసాద్ రావు సూచించారు. డిజిటల్ అరెస్టు, కేవైసీ, ఓటీపీ, లాటరీ స్కామ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ స్కామ్, ఫేక్ యాప్స్, లోన్ స్కామ్స్, వర్క్ ఫ్రం హోమ్, యూపీఐ స్కామ్స్ వంటి సైబర్ మోసాల్లో ప్రజలు చిక్కుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

☞ తక్కువ పేదరికం ఉన్న జిల్లాల్లో చిత్తూరుకు ఐదో స్థానం
☞ చిత్తూరు జిల్లాలోని హోటళ్లలో తనిఖీలు
☞ చిత్తూరు నగరంలో వ్యభిచార గృహంపై దాడి
☞ పుంగనూరులో 12 మంది బైండోవర్
☞ చిత్తూరు: జైలులో వైసీపీ నాయకులకు రోజా పరామర్శ
☞ మల్లప్ప కొండ వద్ద రేపు మినీ కల్చరల్ ఈవెంట్
☞ పలమనేరు: తల్లిపై క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన కుమారుడు
Sorry, no posts matched your criteria.