Chittoor

News June 30, 2024

TPT : పరీక్ష ఫీజు చెల్లించండి

image

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో జూలై 31వ తేదీ నుంచి పీజీ ఫస్ట్ స్పెల్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News June 30, 2024

జులైలో తిరుమలలో జరిగే ఉత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 2న మతత్రయ ఏకాదశి. 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం. 15న పెరియాళ్వార్ శాత్తుమొర. 16న శ్రీవారి ఆణివార ఆస్థానం. 17న తొలి ఏకాదశి. 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ. 22న శ్రీ విఖానస మహాముని శాత్తుమొర. జూలై 31న సర్వ ఏకాదశి నిర్వహించనున్నారు.

News June 30, 2024

చిత్తూరు జిల్లాలో పెన్షన్ల ద్వారా 2,71,696 మందికి లబ్ధి

image

చిత్తూరు జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181కోట్లు పెన్షన్ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు, నేతన్న పెన్షన్ 2,572 మందికి రూ.1.80 కోట్లు, వితంతు పెన్షన్ 59,993 మందికి రూ.42 కోట్లు, వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు ఇవ్వనునట్లు తెలిపారు.

News June 30, 2024

చిత్తూరు: అందుబాటులో లేని పూర్వ సీఈవో

image

చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ఇటీవల ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డర్స్‌ను అందజేసేందుకు జడ్పీ ఉద్యోగులు చిత్తూరు నగరంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఆయన వాట్సాప్, బైరెడ్డిపల్లె ఎంపీడీవో కార్యాలయానికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు.

News June 30, 2024

పిరికి తండ్రి.. పిరికి పుత్రుడు: BCY

image

తమకు భద్రత పెంచాలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత చైతన్య యువజన పార్టీ(BCY) స్పందించింది. ‘పిరికి తండ్రి.. పిరికి పుత్రుడు. పుంగనూరులో ఇక అడుగుపెట్టలేరు’ అని ట్వీట్ చేసింది. కాగా పెద్దిరెడ్డికి మంత్రి హోదాలో గతంలో 5+5 భద్రత ఉండగా.. ప్రస్తుతం 1+1 సెక్యూరిటీ కల్పిస్తున్నారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.

News June 30, 2024

టీటీడీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

image

టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాల, పద్మావతి జూనియర్ కళాశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు జూలై 1, 2వ తేదీల్లో ఆయా కాలేజీల వద్దకు రావాలని ఆయా కాలేజీల ప్రిన్సిపల్స్ కోరారు. మెరిట్ ప్రాతిపదికన స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.

News June 30, 2024

2న చిత్తూరులో కందిపప్పు కౌంటర్ ప్రారంభం

image

చిత్తూరు రైతు బజారులో నాణ్యమైన కందిపప్పు కేజీ రూ.165కే విక్రయించే కౌంటర్ జులై 2న ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ శ్రీనివాసులు వెల్లడించారు. ఈ మేరకు ధరల నియంత్రణ కమిటీతో చర్చించారు. పెనుమూరు, కార్వేటినగరం, జీడీ నెల్లూరు, నగరి మండలాల్లో ప్రత్యేక మొబైల్ వాహనాల ద్వారా తక్కువ ధరకు టమాటా విక్రయించడానికి చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శంకర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News June 29, 2024

పేర్లు తొలగింపుపై చెవిరెడ్డి ఆగ్రహం

image

జగన్ ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు దిగడం హేయమని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి రూరల్ పరిధిలోని సచివాలయాలను ఆయన శనివారం సందర్శించారు. క్షక సాధింపు చర్యలో భాగంగానే సచివాలయాలపై ఉన్న జగన్ ఫొటోలు, పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులను టీడీపీ నాయకులు ధ్వంసం చేస్తున్నారని చెప్పారు.

News June 29, 2024

పుంగనూరుకు పోవడం కూడా కష్టమే: లాయర్

image

తన భద్రత విషయమై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డికి 5+5 భద్రత ఉండేది. ఇప్పుడు 2+2 కూడా ఇవ్వడం లేదు. భద్రత ఉపసంహరణపై పోలీసులు కారణాలు చెప్పడం లేదు. ఆయన MLAగా పుంగనూరుకు కూడా వెళ్లలేకున్నారు’ అని కోర్టులో వాదించారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.

News June 29, 2024

టీటీడీ సేవలకు ఆధార్ అనుసంధానం..?

image

టీటీడీ ఆన్‌లైన్ సేవలకు ఆధార్‌ లింక్ చేసేలా అడుగులు పడుతున్నాయి. ఇదే విషయమై ఈవో శ్యామలరావు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో UIDAI అధికారులతో సమావేశమయ్యారు. ‘టీటీడీ దర్శనం, వసతి, ఆర్జిత సేవలను ఆన్‌లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ దళారుల బెడద తప్పడం లేదు. ఆధార్ లింక్ ద్వారా మోసాలను అరికట్టేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి’ అని టీటీడీ ఐటీ అధికారులకు ఈవో సూచించారు.