India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU)లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యా వారధి హెచ్డీ(Ph.D)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 01.
➤తంబళ్లపల్లె ➤గుర్రంకొండ ➤బి.కొత్తకోట
➤కలకడ ➤పీలేరు ➤కలికిరి
➤వాయల్పాడు ➤కురబలకోట ➤పీటీఎం
➤మదనపల్లె ➤నిమ్మనపల్లె ➤పెనుమూరు
➤యాదమరి ➤గుడిపాల
☞శ్రీరంగరాజపురం ☞చిత్తూరు ☞సోమల
☞శాంతిపురం ☞రొంపిచెర్ల ☞పూతలపట్టు
☞పుంగనూరు ☞పలమనేరు
☞బైరెడ్డిపల్లె ☞వి.కోట ☞గుడుపల్లె
☞కుప్పం ☞రామకుప్పం
➤(తీవ్రమైన కరవు) ☞(మధ్యస్త కరవు) అని ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నెల 31న దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈవో జే.శ్యామలరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కలియుగ ప్రత్యక్ష దైవమని శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) కు దీపావళి పండుగ సందర్భంగా 31వ తేదిన (గురువారం)న ఓ.పీ, ఓటీలకు సెలవు దినంగా ప్రకటించారు. కాగా స్విమ్స్ అత్యవసర విభాగం (క్యాజువాలిటీ) సేవలు యథాతథంగా కొనసాగుతాయని స్విమ్స్ డైరెక్టర్, ఉపకులపతి డా. ఆర్.వి. కుమార్ ఒక ప్రకటనలో తెలియచేశారు.
అక్రమంగా టపాకాయలు విక్రయించిన, నిల్వ చేసిన డయల్ 112 కు లేదా 9440900005 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. దీపావళి రోజు ప్రభుత్వ నిబంధనలకు లోబడి టపాకాయలు విక్రయించాలన్నారు. ‘గ్రీన్ క్రాకర్స్’ పేరుతో నిషేధిత టపాకాయలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ దీపావళి సుఖ సంతోషాలతో జరుపుకోవాలని దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు వెలువడనుంది. పుంగనూరు అల్లర్ల కేసులో నమోదైన 2 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు.
బీపీఎల్ రేషన్ కార్డు కలిగి ఆధార్ అనుసంధానం చేసుకున్న వారికి మూడు ఉచిత సిలిండర్లు అందించనున్నట్లు JC విద్యాధరి తెలిపారు. ఈనెల 31 నుంచి 2025 మార్చి 31 వరకు గ్యాస్ రీఫిల్లింగ్ నిమిత్తం నమోదు చేసుకున్న వారికి ఉచితంగా అందజేస్తామన్నారు. 2025-26 సంవత్సరానికి ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబరు, డిసెంబరు-మార్చి 2026 వరకు 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు.
సోమల మండలం కందూరు ఉన్నత పాఠశాల విద్యార్థిని కే.మౌనిక జాతీయ స్థాయి అథ్లెటిక్స్కు ఎంపికైంది. ఈ నెల 25, 26, 27 తేదీలలో కర్నూలులో జరిగిన SGFI, రాష్ట్ర స్థాయి U-19 అథ్లెటిక్స్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని హెచ్ఎం వెంకటరమణరెడ్డి తెలిపాడు. నవంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. పీడీ చిన్నప్ప, MEO, హెచ్ఎం వెంకటరమణ రెడ్డి, టీచర్లు అభినందించారు.
కాణిపాకం ప్రధాన అర్చకులను సోమవారం దేవస్థానం ఈవో గురుప్రసాద్ సస్పెండ్ చేశారు. ఇన్ఛార్జ్ ప్రధాన అర్చకులుగా గణేశ్ గురుకుల్ను ఈవో గురుప్రసాద్ నియమించారు. ఉద్యోగంలో చేరేందుకు, ప్రధాన అర్చకుడిగా పదోన్నతి పొందేందుకు తప్పుడు పత్రాలు దేవస్థానానికి సమర్పించడంతో సస్పెండ్ అయినట్లు తెలిపారు.
కాణిపాకం వరసిద్ద వినాయక స్వామిని సోమవారం కంచి కామకోటి పీఠాధిపతి వవిజయేంద్ర సరస్వతి మహాస్వామి దర్శించుకున్నారు. ఆలయ ఈఓ గురు ప్రసాద్, అధికార సిబ్బంది మహా స్వామికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి శేషవస్త్రంతో సన్మానించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే పీఠాధిపతి కలికిరి కొండ వద్ద వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత మహా విష్ణు మూర్తి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.