Chittoor

News June 21, 2024

తిరుపతి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా ధ్యానచంద్ర

image

తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమోషన్‌పై మైనింగ్ శాఖ కమిషనర్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా జేసీ ధ్యానచంద్రను నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసే శాలువాతో సత్కరించారు.

News June 21, 2024

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

image

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం అమరావతిలో కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్దిరెడ్డితో పాటు ఇతరులకు జగన్ దిశానిర్దేశం చేశారు.

News June 21, 2024

24న వాచీలు, ఫోన్ల ఈ-వేలం

image

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలు, మొబైల్ ఫోన్లను జూన్ 24న ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయ‌నున్నారు. ఇందులో టైటాన్‌, క్యాషియో, టైమెక్స్‌, ఆల్విన్‌, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్, తదితర కంపెనీల వాచీలున్నాయి. ఆదేవిధంగా వివో, నోకియా, కార్బన్, శామ్సంగ్, మోటోరోలా, ఒప్పో, తదితర కంపెనీల మొబైల్ ఫోన్లు ఉన్నాయి.

News June 21, 2024

ఇంగ్లిషులో ప్రమాణ స్వీకారం చేసిన పెద్దిరెడ్డి

image

పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా.. అందుకు భిన్నంగా పెద్దిరెడ్డి ఇంగ్లిషులో ప్రమాణం చేశారు. అనంతరం ఆయన ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అభివాదం చేశారు.

News June 21, 2024

మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ: ఎస్పీ

image

తిరుపతి పోలీస్ పెరేడ్ మైదానంలో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనువు, మనస్సు, ఆత్మను ఏకం చేసేదే యోగ అన్నారు. పోలీసులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు 15 నిమిషాలు యోగ చేసి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు.

News June 21, 2024

చిత్తూరు: సీఐకు ఏడాది జైలు శిక్ష

image

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు సీఐ మారుతీ శంకర్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. గతంలో ఆయన కర్నూలు జిల్లా పగిడ్యాల ఎస్ఐగా పని చేశారు. అక్కడ ఘనపురం అనే గ్రామానికి చెందిన నరేంద్ర రెడ్డిని 2015లో విచారణ నిమిత్తం స్టేషన్‌కు రావాలని పిలిచారు. వారెంట్ ఉంటేనే వస్తానని నరేంద్ర చెప్పగా.. మారుతి కోపంతో దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కాగా సీఐకు కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.

News June 21, 2024

రేణిగుంట : IIDTలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

రేణిగుంట ఎయిర్పోర్ట్ సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (IIDT) నందు 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. AI/ML సైబర్ సెక్యూరిటీ/ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సులు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు https://iidt.ap.gov.in/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31.

News June 21, 2024

ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు క్యూ కట్టిన తల్లిదండ్రులు

image

చిత్తూరు: పుంగనూరులోని కొత్త ఇండ్లు మున్సిపల్ పాఠశాలలో తమ పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు క్యూ కడుతున్నారు. పాఠశాలలో 750 మంది విద్యార్థులకు చదువుకోవడానికి మౌళిక వసతులు ఉన్నప్పటికీ ఇప్పటికే దాదాపు 1000 మందికిపైగా విద్యార్థులు ఉన్నట్లు హెచ్ఎం సుబ్రహ్మణ్యం తెలిపారు. 6వ తరగతిలో ఇప్పటికి 150 మంది చేరారని అన్నారు.

News June 20, 2024

తిరుపతి: ఆహారంలో జెర్రి ప్రత్యక్షం!

image

ఆహారంలో విషపూరిత జెర్రి ప్రత్యక్షమైన ఘటన తిరుపతిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఓ సినిమా హాలు సమీపంలోని ఓ హోటల్‌లో తినే ఆహారంలో జెర్రి ప్రత్యక్షం కావడంతో కస్టమర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 20, 2024

టీటీడీ ఛైర్మన్‌గా ఏలూరి సాంబశివరావు.?

image

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా ఏలూరిని నియమించాలని చంద్రబాబు సర్కార్ చూస్తోందని సమాచారం. రాష్ట్ర మంత్రిమండలిలో ఏలూరికి స్థానం దక్కకపోవడంతో ఆయనకు సముచిత స్థానం కల్పించాలని అధిష్ఠానం చూస్తోందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అలాగే బాపట్ల జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయానికి కారకులైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి టీటీడీ ఛైర్మన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు ధీమాగా ఉన్నారు.