India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై గవర్నర్ కార్యదర్శి, ముఖ్యమంత్రిని ప్రతివాదులుగా చేర్చుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తొక్కిసలాటకు గవర్నర్ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారని.. వెంటనే పిటిషన్లో సీఎం, గవర్నర్ కార్యదర్శి పేర్లను తొలగించాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారం(22వ తేదీ)కి వాయిదా పడింది.

డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో పీఎంఎఫ్ఎంఈ ద్వారా తిరుపతి జిల్లాలో రిసోర్స్ పర్సన్ ఎంపిక చేయనున్నట్లు పీడీ శోభన్ బాబు తెలిపారు. ఏపీ పుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా మండల స్థాయిలో పని చేసే అవకాశం ఉంటుంది. మైక్రో పుడ్ ప్రోసెసింగ్ ఏర్పాటుతో పాటు మొబిలైజేషన్ చేపట్టాల్సి ఉంటుంది. జీతం ఉండదు. కేవలం ఇన్సెంటివ్పై పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 20వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

చిత్తూరు గంగాసాగరం రోడ్డు ప్రమాదంలో అనేక విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తిరుపతిలోని సప్తగిరి నగర్కు చెందిన పొన్ను చంద్ర(38) తల్లితో కలిసి మధురైలోని ఆసుపత్రికి బయల్దేరారు. తల్లి కింద సీటులో కూర్చోగా.. చంద్ర పైన సీటులో నిద్రించారు. బస్ బోల్తా పడినప్పుడు ఓ కరెంట్ స్తంభం బస్లోకి దూసుకొచ్చింది. దీంతో చంద్ర చనిపోగా.. తల్లి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ కళ్లెదుటే కొడుకు చనిపోవడంతో నిర్ఘాంతపోయారు.

చిత్తూరు జిల్లా సదుం మండలం చింతలవారిపల్లెకు చెందిన వైసీపీ ఉపసర్పంచి దేవందర్ రెడ్డి(54) నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన మృతి ఆత్మహత్య అని తేలింది. గురువారం రాత్రి బైకుపై పూతలపట్టుకు వెళ్లారు. విల్లుపురం-తిరుపతి రైలుకు ఎదురెళ్లడంతో చనిపోయారు. లోకో పైలెట్ గుర్తించి సమాచారం ఇవ్వడంతో రైల్వే ఎస్ఐ ప్రవీణ్ మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను జనవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల ఏప్రిల్ నెల కోటాను జనవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.

చిన్నారులతో పాటు ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి.. వారి మృతికి కారకురాలైన తల్లిని అరెస్టు చేసినట్లు సీఐ రాంభూపాల్ మంగళవారం తెలిపారు. సదుం మండల కేంద్రానికి చెందిన కరిష్మా ఈనెల 12న తన ఇద్దరు చిన్నారులతోపాటు కరెంటు వైర్తో ఉరేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటనలో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడగా ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 10 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీ నుంచి టీటీడీ సర్వదర్శనం భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామల రావు తెలిపారు. అధికారులతో సమీక్ష అనంతరం 20వ తేదీ నుంచి చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. అదేవిధంగా ప్రోటోకాల్ మినహా 20న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా పొట్టేలును బలిచ్చిన ఐదుగురు బాలకృష్ణ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. SI బాలకృష్ణ వివరాల ప్రకారం.. డాకు మహారాజ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఐదుగురు బాలకృష్ణ అభిమానులు తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ ఎదుట ఈనెల 12న పొట్టేలును బలిచ్చి ఆ రక్తం సినిమా పోస్టర్కు అంటించారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పారదర్శకంగా, పూర్తిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు దళారులను మధ్యవర్తులను నమ్మకుండా, మోసపోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా తాము భర్తీకి సహకరిస్తాము అని చెబితే డయల్ 112కు గాని చిత్తూరు పోలీసు వాట్సప్ నం. 9440900005కు గాని ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.