Chittoor

News October 19, 2024

తిరుపతి కోర్టుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని

image

జూన్, జూలై – 2024 మాసాల్లో ఓ ప్రముఖ దినపత్రికలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ప్రచురించిన కథనాలపై తిరుపతి కోర్టుకు శనివారం హాజరయ్యారు. అవాస్తవ కథనాలు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మాట్లాడారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన న్యూస్ పేపర్ ప్రతినిధులపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేసు ఫైల్ చేశారు. విచారణలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే కోర్టుకు హాజరయ్యారు.

News October 19, 2024

మదనపల్లె: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన యువతి

image

అన్నమయ్య జిల్లాలో అమానుష ఘటన జరిగింది. పెళ్లికాని యువతి శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మదనపల్లె సర్వజన బోధనాస్పత్రిలో వెలుగు చూసిన ఘటనపై వివరాలు.. గుర్రంకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ప్రియుడి చేతిలో మోసపోయింది. గర్భం దాల్చడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడు. చేసేదిలేక ఆ యువతి నెలలు నిండి ప్రసవ నొప్పులతో మదనపల్లె సర్వజన బోధన ఆసుపత్రిలో చేరి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

News October 19, 2024

చిత్తూరు: కడపలో అగ్నివీర్ ర్యాలీ

image

కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు గుంటూరు ఆర్మీ కార్యాలయం డైరెక్టర్ కల్నల్ పునిత్ కుమార్ తెలిపారు. అడ్మిట్ కార్డులు పొందిన చిత్తూరు జిల్లా అభ్యర్థులు ర్యాలీలో పాల్గొనాలని సూచించారు. రిక్రూట్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని వెల్లడించారు.

News October 19, 2024

కురబలకోటలో యువకుడు దారుణ హత్య.. Update

image

కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని డంపింగ్ యార్డ్‌ వద్ద శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి ఆచూకీ తెలిసింది. కురబలకోటలో చింతపండు వ్యాపారంచేసే వేంపల్లి బాబ్జి కొడుకు ఖాధర్ బాషా(25)గా గుర్తించినట్లు శనివారం ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. హత్య వెనుక వివాహేతర సంబంధం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

News October 19, 2024

శ్రీకాళహస్తి: ప్రేమోన్మాది ఘాతుకం.. లవర్‌పై బ్లేడ్‌తో దాడి

image

శ్రీకాళహస్తి మండలం చోడవరానికి చెందిన ముధుసూదన్‌రెడ్డి(22), అదే గ్రామానికి చెందిన యువతి(21) నెల్లూరు జిల్లాలోని ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చదివారు. ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు. IT కోర్సు నేర్చుకోవడానికి హైదరాబాద్‌‌కు వెళ్లారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసవడంతో మధుసూదన్‌రెడ్డిని యువతి దూరం పెట్టింది. కోపం పెంచుకున్న యువకుడు గురువారం సాయంత్రం SR నగర్‌లో యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు.

News October 19, 2024

చిత్తూరు జిల్లా వైసీపీ కోఆర్డినేటర్‌గా సుబ్బారెడ్డి

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్‌గా వైవి సుబ్బారెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలకు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది.

News October 19, 2024

కురబల కోటలో యువకుడు దారుణ హత్య

image

కురబలకోటలో గుర్తు తెలియని యువకుడు శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. సుమారు 25 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని యువకుడ్ని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద డంపింగ్ యార్డ్‌లో ప్రత్యర్థులు పథకం ప్రకారం గొంతు కోసి హత మార్చారు. అటుగా వెళ్తున్న గ్రామస్థులు గుర్తించి ముదివేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు విచారిస్తున్నారు.

News October 19, 2024

తిరుపతి: 28 నుంచి దూరవిద్య పరీక్షలు ప్రారంభం

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి డిగ్రీ (UG) మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. హాల్ టికెట్లను https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 18, 2024

తిరుపతి: మీరనుకున్న ‘బడి’ కాదు ఇది..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు చోట్ల కొత్త ప్రైవేట్ వైన్ షాపులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తిరుపతిలో ఓ చోట ఓపెన్ చేసిన మద్యం దుకాణం వైరల్ అవుతోంది. ‘బడి వైన్స్’ అని దానికి పేరు పెట్టడమే ఇందుకు కారణం. ఇదే పేరుతో నగరంలో ఓ చోట బార్ అండ్ రెస్టారెండ్ కూడా ఉంది. ఇదేదో వెరైటీ కోసం పెట్టిన పేరు కాదు ఇది. సదరు వైన్ షాప్ యజమాని ఇంటి పేరు కావడంతో ఇలా పెట్టారని తెలుస్తోంది.

News October 18, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి తంబళ్లపల్లె వెళుతున్న ఇద్దరు యువకులు కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని దాదం వట్టిపల్లి వద్ద ముందు వెళుతున్న RTC బస్సును బైకుతో ఢీకొట్టారు. దీంతో వారు అక్కడికక్కడే చనిపోయినట్లు ముదివేడి ఎస్ఐ దిలీప్ కుమార్ తెలిపారు. మృతులు తంబళ్లపల్లె మండలం చెట్లవారిపల్లెకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి(19), అజయ్ కుమార్ రెడ్డిగా గుర్తించారు.