India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

చిత్తూరు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ DPRO కార్యాలయంలో రేపు నిర్వహించాల్సిన PGRS రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం భోగి పండుగ సందర్భంగా కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.

నిమ్మనపల్లెలో పిల్లలపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు వివరాల మేరకు.. నిమ్మనపల్లెకు చెందిన బోయకొండ (28)కు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుమారు 9ఏళ్ల ఇద్దరు కుమార్తెలతో బోయకొండ అమానుష ఘటనకు పాల్పడడం భార్య చూసింది. ఆమె ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేయగా శనివారం నిమ్మనపల్లెలో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ చక్రవర్తి కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సూపరింటెండెంట్ వాసు పాల్గొన్నారు.

సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు,ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి జూదాలు నిర్వహించడం పూర్తిగా నిషిద్ధమని SP మణికంఠ చందోలు స్పష్టం చేశారు. ఎవరైనా ఈ కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, సంప్రదాయ క్రీడల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాడ్పడినా, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

న్యాయం తనవైపు ఉందని, తాను ఎక్కడికి పారిపోనని YCP నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. ఈ కేసులో పోలీసులు చెప్పిదంతా అబద్ధం అన్న చెవిరెడ్డి.. తనకు సుప్రీంకోర్టులో అయినా న్యాయం దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు తాను ఎక్కడికి వెళ్లనని, తన ఫోను కూడా ఆఫ్ చేయనని స్పష్టం చేశారు.

13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో తమ తప్పులేకపోయినా భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ..క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. క్షమాపణ చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్లు తిరిగిరారు.ఎవరో ఏదో మాట్లాడారని స్పందించాల్సిన అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.