Chittoor

News June 17, 2024

పెద్దిరెడ్డి ఊరిలో టీడీపీకి పడింది 9 ఓట్లే..!

image

కూటమి జోరులోనూ పుంగనూరులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన సొంత ఊరైన సదుం మండలం ఎర్రాతివారిపాలెంలో ఆయనకు పడిన ఓట్లపై పలువురు ఆరా తీస్తున్నారు. స్థానిక గ్రామంలో మొత్తం 862 ఓట్లు ఉన్నాయి. ఇందులో 846 మంది వైసీపీకి ఓటు వేశారు. కేవలం 9 మందే టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి ఓటు వేశారు. ఐదుగురు కాంగ్రెస్‌కు, ఇద్దరు బీసీవై పార్టీకి మద్దతు తెలిపారు.

News June 17, 2024

దేవుడు దగ్గర తప్పు చేయను: చెవిరెడ్డి

image

ఒకే లెటర్‌పై 56 మందిని శ్రీవారి దర్శనానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిఫర్ చేయడంపై విమర్శలు వచ్చాయి. దానిపై ఆయన స్పందించారు. ‘TTD నిబంధనల మేరకు సోమవారం నుంచి గురువారం వరకు స్థానిక MLAగా 10 మందికి, ప్రభుత్వ విప్‌గా మరో 10 మందికి లెటర్ ఇచ్చా. తుడా ఛైర్మన్‌, TTD పాలకమండలి సభ్యుడిగా నా బిడ్డ మోహిత్ 20 మందిని సిఫార్సు చేశాడు. దేవుడు దగ్గర తప్పు చేయను. ఆ మనస్తత్వం నాది కాదు’ అని ఆయన అన్నారు.

News June 17, 2024

పెద్దిరెడ్డికి హైకోర్టు నోటీసులు..!

image

YCP హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టిన తనకు రక్షణ కల్పించాలంటూ B.కొత్తకోటకు చెందిన మాజీ జడ్జి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరులు తనను వేధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన ఇంటిపై కూడా దాడి చేశారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. తన పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు పెద్దిరెడ్డి సోదరులకు నోటీసులు ఇచ్చిందని మాజీ జడ్జి వెల్లడించారు.

News June 17, 2024

ముస్లిం సోదరులకు తిరుపతి కలెక్టర్ సూచనలు

image

తిరుపతి జిల్లాలోని ముస్లిం సోదరులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనల మేరకు బక్రీద్ చేసుకోవాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News June 16, 2024

అందరికీ దోచిపెట్టారు: మంత్రి సత్యకుమార్

image

వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చారని వైద్యారోరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆయన ఆదివారం విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. స్థానిక మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఆదాయ వనరులుగా మార్చేశారని మండిపడ్డారు. YCP సానుభూతిపరులు, వాళ్లకు కావాల్సిన ఆసుపత్రులకు ప్రజాధనం దోచిపెట్టారని ఆరోపించారు.

News June 16, 2024

సంచలన ఉత్తర్వులు ఇచ్చిన తిరుపతి కోర్టు

image

తిరుపతిలో 2023 సెప్టెంబర్‌లో జరిగిన చోరీ కేసులో ఈస్ట్ CIని A2గా చేర్చి కేసు ఫైల్ చేయాలని తిరుపతి 2వ మున్సిఫ్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో TDP అధినేత చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఉన్న 36 గ్రాముల బంగారు ఉంగరాన్ని టి.జయరామిరెడ్డి ఓ రెస్టారెంట్‌లో పోగొట్టుకున్నారు. దీనిపై కేసు ఫైల్ చేయకపోగా నిందితుడ్ని వదిలేశారు. బాధితుడు కోర్టులో ప్రైవేట్ కేసు వేయడంతో.. జడ్జీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

News June 16, 2024

తిరుమలలో చేయాల్సిన మార్పులేంటి..?

image

తన పాలనలో తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని CM చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ధర్మారెడ్డిని తొలగించి TTD ఈవోగా శ్యామలరావును నియమించారు. సర్వ, దివ్య, బ్రేక్ దర్శన విధానాలపై భక్తులు పెదవి విరుస్తున్నారు. అన్నప్రసాదం, లడ్డూల నాణ్యతపైనా విమర్శలు ఉన్నాయి. నిరంతరం అన్నప్రసాదం అందించాలనీ కోరుతున్నారు. తిరుమలలో ఇంకా ఏమేమీ మార్పులు చేయాలో కామెంట్ చేయండి.

News June 16, 2024

చిత్తూరు: రేపు జంతు బలి నిషేధం: కలెక్టర్

image

సోమవారం చిత్తూరు జిల్లాలో జంతుబలులు నిషేధం ఉందని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. ఆయన అధికారులతో, ముస్లిం మత పెద్దలతో సమీక్ష నిర్వహించారు. కాగా నగరంలోని రెడ్డిగుంట, మురకంబట్టు ప్రాంతాలలో మేకపోతు, పొట్టేళ్ల వ్యాపారం అధికంగా జరిగింది.

News June 16, 2024

చిత్తూరు: ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న దాడి

image

ఆస్తిలో వాటా అడిగిన చెల్లెలుపై అన్న కర్రతో దాడిచేసిన ఘటన నిమ్మనపల్లెలో జరిగింది. SI లోకేష్ రెడ్డి కథనం.. మండలంలోని పారేసువారిపల్లెకు చెందిన రామకృష్ణ, అతని చెల్లి మనోహర్ భార్య రమాదేవి(40) అదే గ్రామంలో ఉంటుంది. తల్లిదండ్రులు పసుపు కుంకుమకు ఇచ్చిన 2 ఎకరాలను తనకు ఇవ్వాలని శనివారం రాత్రి రమాదేవి నిలదీసింది. దీంతో ఆగ్రహించిన రామకృష్ణ తన చెల్లెలుపై కర్రతో దాడిచేసి తీవ్రంగా గాయపరచగా ఆస్పత్రికి తరలించారు

News June 16, 2024

తిరుపతి: 578 కేసులు.. రూ.12.93 లక్షల జరిమానా

image

విద్యుత్తు అక్రమ వినియోగంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. ఎనిమిది డివిజన్ల పరిధిలో 3,095 సర్వీసులు తనిఖీ చేసి.. అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 578 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేశారు. రూ.12.93 లక్షల జరిమానా విధించామని ఉన్నతాధికారులు తెలిపారు.