Chittoor

News June 16, 2024

చిత్తూరు: తగ్గుతున్న తోతాపురి మామిడి ధరలు

image

చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. గత నాలుగురోజుల్లో టన్ను రూ. 27 వేల నుంచి శనివారానికి రూ.22 వేలకు పడిపోయింది. సీజన్ ప్రారంభంలో టన్ను కాయలు రూ.27 వేలకు అమ్ముడుపోయాయి. వ్యాపారస్తులు సిండికేట్ గా మారి ధరలు తగ్గింపుకు కారణం అవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

News June 16, 2024

రామకుప్పం: ఏనుగు దాడిలో రైతు మృతి

image

రామకుప్పం మండల పరిధిలో ఆదివారం వేకువజామున ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. మండల పరిధిలోని పీఎంకే తాండ వద్ద రైతు కన్నా నాయక్ (50) పై ఒంటరి ఏనుగు దాడి చేసి తొక్కి చంపేసింది. దిగువ తాండ నుంచి పీఎంకే తండాకు వెళ్తున్న రైతు కన్నా నాయక్‌పై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఏనుగుల దాడుల నియంత్రణలో ఫారెస్ట్ అధికారులకు పూర్తిగా విఫలమయ్యారంటూ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

News June 16, 2024

చిత్తూరు: చుడా ఛైర్మన్ రాజీనామా

image

చుడా చైర్మన్ పదవికి కట్టమంచి పురుషోత్తంరెడ్డి రాజీనామా చేశారు. గతంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా పనిచేసిన ఆయనకు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చుడా ఛైర్మన్‌గా నియమించారు. పదవీకాలం ముగియడంతో మరో రెండేళ్లు పొడిగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.

News June 16, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

News June 15, 2024

చిత్తూరు: 18 మందికి జరిమానా

image

చిత్తూరు పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి పదివేలు రూ.1,80,000 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు పరిధిలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో శుక్రవారం 18 మంది పట్టుబడినట్లు చెప్పారు. వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ప్రవేశ పెట్టగా జడ్జి ఉమాదేవి ఫైన్ విధించినట్లు తెలిపారు.

News June 15, 2024

శ్రీవారి భక్తులకు ముఖ్య సమాచారం

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 21న ఆర్జిత సేవా, 22న‌ అంగప్రదక్షిణం టోకెన్లు, 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తారు.

News June 15, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

జూన్ 17 వరకు వారాంతపు సెలవులు ఉండడంతో శనివారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు, కల్యాణ వేదిక వరకు బయట క్యూ లైన్లు యాత్రికులతో నిండిపోయాయి. గురువారం నుంచి యాత్రికుల తాకిడి తగ్గలేదు, సోమవారం కూడా సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ కొనసాగనుంది. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా అందిస్తున్నారు.

News June 15, 2024

నిండ్ర: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

నిండ్ర మండలం నిండ్ర ఉన్నత పాఠశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న గణిత ఉపాధ్యాయుడు సురేష్ బాబు గుండెపోటుతో పాఠశాలలోనే కుప్పకూలాడు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు సురేష్ బాబు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

News June 15, 2024

SVU డిగ్రీ సెమిస్టర్ పరీక్ష వాయిదా

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 12వ తేదీ నుంచి డిగ్రీ 2, 4 సెమిస్టర్ రెగ్యులర్/ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 18వ తేదీ జరగాల్సిన పరీక్షను జలై 9వ తేదీకి పోస్ట్ పోన్ చేసినట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. 18వ తేదీ UGC NET ఎగ్జామ్ జరుగుతున్న కారణంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News June 15, 2024

చిత్తూరు:18న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

image

ఈ నెల 18న చిత్తూరు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్‌లోని నూతన సమావేశం మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ శనివారం తెలిపారు. ఉదయం 10 గంటలకు ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లాకు చెందిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.