India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలోని ఘాట్ రోడ్లలో కూడా మహిళలు ఇక ఉచితంగా ప్రయాణించవచ్చని తూ.గో ఆర్టీసీ డీపీటీఓ వై.సత్యనారాయణ మూర్తి తెలిపారు. భద్రతా కారణాల వల్ల మొదట నిలిపివేసినప్పటికీ, తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలంటూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాజమండ్రి-భద్రాచలం, శ్రీశైలం వంటి మార్గాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మొత్తం 12 శకటాలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో, విద్యుత్ సంస్థ శకటం మొదటి స్థానం దక్కించుకుంది. వ్యవసాయం, ఉద్యానవన శాఖల శకటాలు రెండవ స్థానం, సాంఘిక సంక్షేమ శాఖ శకటం మూడవ స్థానం పొందాయి. అలాగే, పశు సంవర్థక శాఖ శకటం నాలుగవ స్థానం, పర్యాటక శాఖ శకటం ఐదవ స్థానం సాధించాయి.
రామభద్రపురం వద్ద చెట్టు పడి <<17400517>>గురువారం<<>> మృతి చెందిన శ్రీనివాస్ స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా దుల్ల గ్రామంలో విషాదఛాయలు నెలకున్నాయి. శ్రీనివాస్కు వివాహం అయి రెండేళ్లయింది. డెక్కన్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రావడంతో భార్యతో కలిసి తునిలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఇద్దరు ఆడపిల్లలు, ఇతను ఒక్కడే కుమారుడు. ఉద్యోగానికి వెళ్లి విగతజీవిగా మారిన కుమారుడ్ని చూసి వారు కన్నీరు మున్నీరువుతున్నారు.
ఎందరో దేశభక్తులు త్యాగాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన “విభజన్ క విభీషక్ దివస్” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సమరయోధుల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో ఆగస్టు 15న జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ పరిశీలించారు. పరేడ్ రిహార్సల్స్, భద్రత, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శనను పరిశీలించారు.
పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లలకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెరుగైన ఫలితాలు సాధించిన 57 మంది విద్యార్థులను ఎస్పీ అభినందించారు. అడిషనల్ ఎస్పీలు మురళీ కృష్ణ, చెంచిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ర్యాగింగ్ తన జీవితంలో కూడా భయపెట్టిన సందర్భాలు ఉన్నాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. ఇది విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన యాంటీ ర్యాగింగ్ వీక్ మూడో రోజు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
నిడదవోలు క్యాంపు కార్యాలయంలో ‘మత్తురా’ సినిమా టీజర్ను మంత్రి కందుల దుర్గేశ్ బుధవారం విడుదల చేశారు. మంత్రి మాట్లాడుతూ.. మత్తురా సినిమా టీజర్ ఎంతో ఆకట్టుకునేలా, ఆసక్తికరంగా ఉందన్నారు. మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎద్దుల రాజారెడ్డి, దర్శకుడు పువ్వల చలపతి, సంగీత దర్శకుడు బోసం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాగింగ్ పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయని, భవిష్యత్తు నాశనం అవుతుందని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ అన్నారు.
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ వీక్ ప్రోగ్రామ్లో ఆయన మాట్లాడుతూ.. ర్యాగింగ్కి దూరంగా ఉంటూ ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. వీసీ ఆచార్య ఎస్ ప్రసన్న శ్రీ ర్యాగింగ్కి దూరంగా ఉంటామంటూ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Sorry, no posts matched your criteria.