EastGodavari

News August 31, 2024

కాకినాడ: ‘క్వీన్‌ ఆఫ్‌ ది ఫిష్‌’ ఇక రాదా..?

image

గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యమవడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్‌ ఆఫ్‌ ది ఫిష్‌’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రెష్‌ వాటర్‌ రీఛార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది. ఇక పులస చేపలు రావా అని పలువురు చర్చించుకుంటున్నారు.

News August 31, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో వర్షాలు

image

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని, మత్స్యకారుల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

News August 31, 2024

కాకినాడ GGHలో ఎంపాక్స్ ఐసోలేషన్ వార్డ్

image

కాకినాడ GGH ఆసుపత్రిలోని ENT విభాగంలో 24 పడకలతో ఎంపాక్స్ ఐసోలేషన్ ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో వైద్యారోగ్య అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. GGHలోని హెచ్‌వోడీలతో ప్రత్యేక నోడల్ బృందాన్ని సైతం ఏర్పాటుచేసినట్లు సూపరింటెండెంట్ డా.లావణ్య కుమారి తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతానికి అనుమానిత కేసులేమీ లేవన్నారు.

News August 30, 2024

కోనసీమ: అప్పుల బాధతో జూనియర్ లాయర్ సూసైడ్

image

మామిడికుదురు మండలం అప్పనపల్లికి చెందిన జూనియర్ లాయర్ మేడేపల్లి సురేష్ (30) అప్పుల బాధతో గడ్డి మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడని నగరం SI చైతన్య కుమార్ తెలిపారు. కుటుంబ సభ్యులు అతణ్ని అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని తెలిపారు. మృతుడికి మూడేళ్ల క్రితం భవాని అనే యువతితో వివాహం జరిగిందని చెప్పారు.

News August 30, 2024

కాకినాడ GGHలో ఒక పడకపై ఇద్దరు రోగులు

image

కాకినాడ జిల్లాలో జ్వరాలు ప్రబలుతున్నాయి. దీంతో 1,155 పడకలున్న కాకినాడ ప్రభుత్వాసుపత్రికి 2వేల మందికి పైగా వచ్చి చేరారు. దీంతో కొన్ని వార్డుల్లో ఒక్కో మంచం మీద ఇద్దరిని పడుకోబెట్టగా, చివరకు నేలమీద కూడా పడుకోబెట్టి చికిత్స చేయాల్సి వస్తోంది. జ్వరాలతో ఎక్కువ కేసులు రావడమే ఈ పరిస్థితికి కారణమని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా.లావణ్య కుమారి చెప్పారు.

News August 30, 2024

తూ.గో: మొక్కల పెంపకానికి రూ.కోటి నిధులు

image

తూ.గో జిల్లాలో అటవీ శాఖ నర్సరీలు మళ్లీ పునరుజ్జీవం పొందుతున్నాయి. నర్సరీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మొక్కల పెంపకానికి తొలుత రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. జిల్లాలోని అయిదు చోట్ల అటవీ శాఖ పర్యవేక్షణలో వివిధ మొక్కలను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాదిలో 10.55 లక్షలకు పైగా మొక్కలను పెంచి పంపిణీకి సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

News August 30, 2024

ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు

image

ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువకుడిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మేడిచర్లపాలానికి చెందిన రవికుమార్‌ తనను మోసం చేశాడని ప.గో జిల్లా నరసాపురం మండలం రుస్తుంబాద్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసినట్లు నరసాపురం రూరల్ SI సురేశ్ తెలిపారు. దీంతో రవికుమార్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News August 29, 2024

మాజీ MLA ఫొటోపై నల్లరంగు.. పోలీసులకు ఫిర్యాదు

image

తాళ్లరేవు మండలం జార్జిపేట ఎంఎల్‌కె నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద శిలాఫలకంపై ఉన్న ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఫొటోకి నల్ల రంగు పూసి కొందరు వ్యక్తులు అవమానించారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్యే ఫొటో మీద బ్లాక్ స్ప్రేతో రంగు పూసి ముఖం కనిపించకుండా చేశారు. దీనిపై వైసీపీ శ్రేణులు గురువారం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News August 29, 2024

జగన్‌తోనే నా ప్రయాణం: ఎంపీ పిల్లి సుభాష్

image

జగన్ తనను ఎంతో ప్రోత్సహించారని.. అలాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడవనని రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ అన్నారు. ‘వైసీపీ ప్రారంభించక ముందు నుంచే నేను జగన్ వెంట ఉన్నా. పార్టీని విడిచి వెళ్లేది లేదు. రాజకీయాల్లో ఉన్నంత కాలం YCPలోనే ఉంటా. చివరి వరకు జగన్‌తోనే ఉంటా. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను’ అని ఎంపీ స్పష్టం చేశారు. కాగా.. వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

News August 29, 2024

కాకినాడ: ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం

image

ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం కార్యక్రమాన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి బుధవారం తెలిపారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న వనమహోత్సవం కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తు కాకినాడ జేఎన్టీయూలో వివిధ ప్రాంతాలతో కలిసి 3,000 మొక్కలు నాటుతున్నామని డీఎఫ్ఓ తెలిపారు.