EastGodavari

News March 2, 2025

రాజమండ్రి: చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గోరంట్ల

image

రాజమండ్రి రూరల్ రాజవోలు గ్రామానికి చెందిన సోడదాసి రమణ, కీర్తన దంపతుల కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంది. పేద దంపతులు అయిన వీరు అప్పులు బారిన పడి సతమవుతున్న స్థితిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి దృష్టికి తీసుకువెళ్లారు. ఎంతో ఎమ్మెల్యే స్పందించి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.10 లక్షలు మంజూరు చేసి నేడు చెక్కును అందజేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, నర్సిపల్లి హారిక తదితరులు ఉన్నారు.

News March 1, 2025

తూ. గో : ఆర్టీసీకి శివరాత్రి ఆదాయం ఇలా..!

image

శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ. 13.78 లక్షలు అదనపు ఆదాయం సమకూరినట్లు రాజమండ్రి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కె. షర్మిల అశోక ప్రకటించారు. తూ. గో జిల్లా ఆర్టీసీ రీజినల్ పరిధిలో రాజమండ్రి, గోకవరం, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి మొత్తం 64 బస్సులు నడిపినట్లు చెప్పారు. 

News March 1, 2025

తూ.గో జిల్లాలో నేటి నుంచి కొత్త రూల్స్

image

నేటి నుంచి న్యూ సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ అమల్లోకి రానుందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ. 1000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5 వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధిస్తామన్నారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి సహకరించాలని కోరారు.

News March 1, 2025

తూ.గో : ఒక్క నిమిషం వారి కోసం..!

image

తూ.గో జిల్లాలో 51 కేంద్రాలలో 43,754 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులను ఉదయం గం.8.30 ని.ల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.

News March 1, 2025

గోపాలపురం : వైసీపీ నుంచి టీడీపీలోకి

image

టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో ద్వారకా తిరుమలకు చెందిన వైసీపీ నేత, జెడ్పీటీసీ శామ్యూల్ టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ లంకా సత్యనారాయణ, శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మాజీ సొసైటీ అధ్యక్షులు తూమపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. టీడీపీ విధానాలు నచ్చి పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు.

News February 28, 2025

రాజమండ్రి: ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు- ఎస్పీ

image

రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ వెల్లడించారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.

News February 28, 2025

మార్చి 1,2, 3 తేదీల్లో జిల్లా మీద నడిచే రైళ్లు రద్దు

image

విజయవాడ డివిజన్‌లోని కడియం ద్వారపూడి అనపర్తి రైల్వే స్టేషన్ మధ్య నాన్ ఎంటర్ లాకింగ్ పనులు నిమిత్తం మార్చి 1,2,3 తేదీల్లో గుంటూరు- విశాఖ- గుంటూరు (17239/17240 ) విశాఖ-లింగంపల్లి-విశాఖపట్నం నడిచే (12805/12806) రైళ్లను రద్దు చేసినట్లు విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ రైళ్లల్లో రిజర్వేషన్ పొందిన ప్రయాణికులకు డబ్బు వాపస్ ఇస్తామని అధికారులు తెలిపారు.

News February 28, 2025

రాజమండ్రి: ఉరి వేసుకొని యువకుడి ఆత్మహత్య

image

రాజమండ్రిలో పోలిశెట్టి సతీష్ అనే యువకుడు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీటీ కాలేజ్ రోడ్డు ముత్యాలమ్మ గుడి సమీపంలోని ఒక షాప్‌లో ఆ యువకుడు పనిచేస్తున్నాడు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో తల్లిదండ్రులు పోలిశెట్టి రాణి, నాగేశ్వరరావులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టూ టౌన్ ఇన్స్‌స్పెక్టర్ మంగాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 28, 2025

భీమవరంలో కరిచర్లగూడెం యువకుడి మృతి

image

భీమవరం పట్టణంలోని ఓ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న యువకుడు మృతి చెందాడు. మృతుడు గోపాలపురం మండలం కరిచర్లగూడెంకి చెందిన ఖండవల్లి శ్రీనివాస్ (28)గా తెలుస్తోంది. మూడు సంవత్సరాలుగా అదే హాస్పిటల్లో పనిచేస్తుండగా.. గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు అన్న శివకు ఫోన్ ద్వారా తెలిపారు. బంధువులు అనుమానంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

News February 28, 2025

తూ.గో: వచ్చేనెల 1 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు

image

తూ.గో జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఐఓ ఎన్ఎస్ వీఎల్ నరసింహం గురువారం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 20,591 మంది, ఒకేషనల్‌లో 2,226 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు చెప్పారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్‌లో 19,062 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు ఆయన వివరించారు.

error: Content is protected !!