EastGodavari

News March 22, 2026

ప్రజా సమస్యలకు చెక్.. సోమవారం మిస్ కావద్దు!

image

జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలని ఆమె కోరారు.

News March 22, 2026

10,897 సిలిండర్లు సిద్ధం.. ఆందోళన వద్దు: JC

image

గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ హెచ్చరించారు. ఇప్పటివరకు 42 కేసులు నమోదు చేసి, 114 సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎల్పీజీ కొరత లేదని, పంపిణీదారుల వద్ద 10,897 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సరఫరా సజావుగా సాగుతున్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 22, 2026

ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: తూ.గో కలెక్టర్

image

తూ.గో జిల్లా రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 23న PGRS & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.

News March 21, 2026

రాజనగరం: రోడ్డు ప్రమాదంలో గాయపడింది వీరే..!

image

రాజానగరం ఏడీపీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. విశాఖకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ, మనోహర్, కె. కృష్ణమూర్తి, లక్ష్మి, అఖిల కారులో వాడపల్లి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్తుండగా, మలుపు తిరుగుతున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. క్షతగాత్రుల వివరాలను సీఐ వీరయ్యగౌడ్ మీడియాకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 20, 2026

20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

image

కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది కానుకగా యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేశామని, నిరుద్యోగులంతా పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

News March 19, 2026

పెరవలిలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

image

పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, యువకుడు నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.