India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లి – (07031) కాకినాడ టౌన్కు, మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి ( 07032) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆగుతాయని అధికారులు వివరించారు.
కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా కొర్రపాటి నాగ మురళి శివప్రసాద్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతి చెందాడు. దీంతో ఆయన నివాస ప్రాంతo అన్నపూర్ణమ్మ పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్గా ఉన్న శివప్రసాద్ గత వారం కుంభమేళాకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో బీహార్లోని గయలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నేడు రాజమండ్రికి ఆయన భౌతికకాయం రానుంది.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నదీ జలాలను సంరక్షించే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. ప్రజలందరూ దీనిలో పాల్గొనాలని కమిషనర్ కేతన్ గార్గ్ కోరారు. ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు డ్రాయింగ్ పోటీలు, బోట్ రేస్, మ్యూరల్ పెయింటింగ్, ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు నోడల్ అధికారిగా ఇంజినీర్ షేక్ మదర్షా అలీని కమిషనర్ నియమించారు.
ఏపీలో రేపు ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మండలాల వారీగా నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00గంటల వరకు పోలింగ్ జరగనుంది. గతంలో 2019 మార్చి ఎమ్మెల్సీ ఎన్నికలలో 11 మంది బరిలో దిగగా, ఈసారి 35 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. గోపాలపురం పరిధిలో ఓటర్లు 6443, గోపాలపురం 1777, దేవరపల్లి 2166, నల్లజర్ల 2500గా ఓటర్లు ఉన్నారు.
తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం అంతా మహా శివరాత్రి పర్వదినాన ఆ గ్రామం అంతా విషాదంతో నిండిపోయింది. నది స్థానానికి దిగిన 11 మందిలో ఐదుగురు గల్లంతయి మృత్యువాత పడ్డారు. దీంతో కలెక్టర్ ప్రశాంతి ఉదయం నుంచి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయంతో వెలికితీసిన మృతదేహాలను పంచనామా నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వారిద్దరిది ఒకే ఊరు.. ఒకే ప్రాంతం. పక్క పక్కనే ఇళ్లు, ఒకరిని వదిలి ఒకరు ఉండలేని స్నేహబంధం వారిది. అయితే మృత్యువు రూపంలో ఆ బంధం చెదిరిపోయింది. వివరాలు ఇలా.. ధవళేశ్వరం జాలరి పేటకు చెందిన ప్రాణ స్నేహితులు నాగమళ్ల ముత్యాలు(19), బొడ్డు వెంకటేష్ (16) మంగళవారం బైక్పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొన్న ప్రమాదంలో స్పాట్లోనే మరణించారు. ఈ దుర్ఘటన చూసిన వారు స్నేహబంధం ఇలా విడిపోయిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.
ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూ.గో జిల్లాలో 62,970 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మంగళవారం ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 27న జరగనున్న ఎన్నికలకు 92 పోలింగ్ కేంద్రాలను 15 రూట్లలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 36,366 మంది, స్త్రీలు 27,601 మంది ఇతరులు ముగ్గురు ఉన్నారన్నారు.
ధవళేశ్వరం కాటన్పేట వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొని జాలరిపేటకు చెందిన నాగమల్లి ముత్యాలరావు(18), బొడ్డు వెంకటేశ్(16) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మంగళవారం ఆర్టీసీ బస్సు రాజోలు నుంచి రాజమండ్రి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్పై ఓవర్టేక్ చేయబోయి వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు ధవళేశ్వరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పీఎం ఆదర్శ యోజన కార్యక్రమంలో భాగంగా ప్రతిపాదిత పనులు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో మార్చి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఎం ఆదర్శ యోజన పనుల పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆదర్శ యోజన నిధులను సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.