EastGodavari

News August 29, 2024

కాకినాడ: ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం

image

ఈ నెల 30న జిల్లా స్థాయి వన మహోత్సవం కార్యక్రమాన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించనున్నట్లు జిల్లా అటవీ అధికారి ఎస్.భరణి బుధవారం తెలిపారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 30న వనమహోత్సవం కార్యక్రమంలో పాఠశాల, కళాశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తు కాకినాడ జేఎన్టీయూలో వివిధ ప్రాంతాలతో కలిసి 3,000 మొక్కలు నాటుతున్నామని డీఎఫ్ఓ తెలిపారు.

News August 28, 2024

కోనసీమ చిన్నారులే ‘కమిటీ కుర్రోళ్లు’

image

ఇటీవల విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో అమలాపురానికి చెందిన 8 మంది చిన్నారులు నటించారు. హీరో శివ చిన్ననాటి పాత్రను వంకాయల హంసిక్ చేయగా కార్తిక్ చిన్నోడుగా యర్రంశెట్టి నిశాంత్ నటించాడు. చిన్నప్పటి సుబ్బు పాత్రలో కె.అశ్విన్ వర్మ, కిషోర్ పాత్రలో జశ్వంత్ నటించారు. జ్యోతి చిన్ననాటి క్యారెక్టర్లో ప్రియాలావణ్య, కేశనకుర్రు పాలెం వాసి సంతోష్ రాంబాబు చిన్ననాటి పాత్రలో డైలాగ్స్‌లు చెప్పాడు.

News August 28, 2024

రాజవొమ్మంగి: గుండె పోటుతో టీచర్ మృతి

image

రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు చోడి గీతార్థ (58) గుండె పోటుతో బుధవారం మృతి చెందినట్లు స్నేహితులు తెలిపారు. ఆయన అడ్డతీగల మండలం ధాన్యంపాలెంలో పాఠశాలలో పనిచేస్తూ గత కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో నివాసం ఉంటున్నారని అక్కడే ఆయన మృతి చెందారని తెలిపారు. దీంతో ఆయన మరణవార్తను పాఠశాల సిబ్బంది, విద్యార్థులు జీర్ణీంచుకోలేక పోతున్నామని తెలిపారు.

News August 28, 2024

సామర్లకోట: వినాయకుడు రూపంలో రావిచెట్టు

image

కాకినాడ జిల్లా సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న రావిచెట్టు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా రావి చెట్టును ఎక్కడ ఉన్నా పూజిస్తారు. వినాయకుడు ఆకారంలో రావిచెట్టు మొదలు దానికదే సహజంగా ఏర్పడి పూజాలు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో పలువురు పరిసర ప్రాంత ప్రజలు చెట్టును సందర్శించి వెళ్తున్నారని చెబుతున్నారు.

News August 28, 2024

డ్రోన్లతో విప్లవాత్మక మార్పులు: కోనసీమ కలెక్టర్

image

డ్రోన్ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ తెలిపారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్‌లో డ్రోన్ సాంకేతికతపై జిల్లాలోని సర్వేయర్స్‌కి శిక్షణా తరగతులు నిర్వహించారు. డ్రోన్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని పేర్కొన్నారు. పంట పొలాల్లో పురుగులు, ఎరువులు పిచికారి చేయవచ్చునని తెలిపారు.

News August 27, 2024

కాకినాడ: కొండ చిలువలు స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

image

జాతర్లలో కొండ చిలువలను ప్రదర్శిస్తూ, వాటితో నృత్యాలు చేయించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి నుంచి మూడు కొండ చిలువలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి భరణి సోమవారం తెలిపారు. కాకినాడ జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కోబ్రా డాన్స్ గ్రూప్ పేరుతో కొందరు జాతర్లలో వీటిని ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ముగ్గురు నిందితులను కాకినాడ కోర్టులో హాజరు పరుస్తామన్నారు.

News August 27, 2024

తూ.గో: అర్హత లేని వారికి రూ.15 వేల పింఛన్

image

మంచానికే పరిమితమైన వారికి ప్రభుత్వం రూ.15 వేలు పింఛన్ అందిస్తోంది. కొంత మంది అనర్హులు ఈ పెన్షన్ అందుకుంటున్నారు. దీనిపై ఉమ్మడి జిల్లాలో గ్రామాల వారీగా సర్వే చేపట్టారు. కాకినాడ జిల్లాలో 323 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 1203 మంది, కోనసీమ జిల్లాలో 668 మంది ఈ పెన్షన్ అందుకుంటున్నారు. వారిలో అనర్హులున్నారని దివ్యాంగులు చేసిన ఫిర్యాదుపై సర్వే చేపట్టారు. నిపుణులైన వైద్యులచే ఈ సర్వే చేయిస్తున్నారు.

News August 27, 2024

తూ.గో: నేటి నుంచి సెప్టెంబరు 4 వరకు పరీక్షలు

image

విద్యార్థులకు నిర్వహించే ఫార్మాటివ్ పరీక్షలను ఇక నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలుగా మార్చుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయని డీఐ బి.దిలీప్ కుమార్ తెలియజేశారు. ఇందులో భాగంగా తూ.గో జిల్లాలో మంగళవారం సంస్కృతం పరీక్ష జరగనుంది.

News August 27, 2024

ఉమ్మడి తూ.గో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక

image

ఉమ్మడి తూ.గో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ బాలబాలికల సబ్ జూనియర్స్ జట్ల ఎంపిక సెప్టెంబరు 1న అన్నవరం సత్యదేవ జూనియర్ కళాశాలలో జరుగుతాయని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఛైర్మన్ ముప్పన వీర్రాజు తెలిపారు. శంఖవరం మండలం అన్నవరంలో ఈ జట్ల ఎంపిక జరుగుతుందన్నారు. 2009 జనవరి 2వ తేదీ తర్వాత జన్మించిన ఆసక్తిగల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనవచ్చని వివరించారు.

News August 27, 2024

రౌతులపూడి: పెళ్లి పేరుతో బాలికను మోసం

image

పెళ్లి పేరుతో నమ్మించి బాలికను గర్భవతిని చేసిన ఘటన చోటుచేసుకుంది. లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చందక కాశి(22) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను పెళ్లి పేరుతో నమ్మించి గర్భం చేశాడని ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. దీనిపై రౌతులపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి గ్రామంలో విచారణ చేపట్టారు. ఆ యువకుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.