EastGodavari

News December 19, 2025

రాజమండ్రికి చేరుకున్న మంత్రి నారా లోకేశ్

image

మంత్రి నారా లోకేశ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు.

News December 19, 2025

రాజమండ్రి: 21న జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక

image

తూర్పుగోదావరి జిల్లా పురుషుల కబడ్డీ జట్టు ఎంపిక ఈనెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి బురిడి త్రిమూర్తులు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎస్.కే.వి.టి డిగ్రీ కళాశాల మైదానంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని కబడ్డీ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తప్పనిసరిగా 85 కేజీల లోపు బరువు ఉండాలని స్పష్టం చేశారు.

News December 19, 2025

RJY: మంత్రి నారా లోకేష్ షెడ్యూల్ ఇదే..!

image

నారా లోకేశ్ శుక్రవారం రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8:45కు విమానాశ్రయం చేరుకుని, తొలుత ఆర్ట్స్ కళాశాలలో నూతన భవనాలను ప్రారంభించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం నన్నయ వర్సిటీలో భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం చెరుకూరి కళ్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రి పర్యటన నిమిత్తం అధికారులు, పార్టీ శ్రేణులు నగరంలో భారీ ఏర్పాట్లు చేశాయి.

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.

News December 19, 2025

తూ.గో: కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో గురువారం రెండో రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి.నరసింహ కిషోర్ పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అభివృద్ధి కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో శాఖల మధ్య సమన్వయంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేస్తూ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరవేయాలని సీఎం అన్నారు.

News December 18, 2025

రాజానగరం: రేపు నన్నయకు రానున్న నారా లోకేశ్

image

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాలను శుక్రవారం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారని వీసీ ప్రొఫెసర్ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. గురువారం జేసీ వై. మేఘా స్వరూప్‌తో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఇంజినీరింగ్, ఎగ్జామినేషన్స్, స్కూల్ ఆఫ్ కామర్స్ భవనాలను మంత్రి ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇదే వేదికపై రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు వీసీ తెలిపారు.

News December 18, 2025

తూ.గో జిల్లాకు నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..!

image

మంత్రి నారా లోకేశ్ ఈ నెల 19వ తేదీన తూ.గో జిల్లాలో పర్యటించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 8.45 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని 5.45కి విజయవాడకు బయలుదేరుతారన్నారు. ఆయన పర్యటనకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు.