India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తూ.గో జిల్లాలో కూరగాయలు సాగు చేస్తున్న రైతులు స్థానిక మార్కెట్లలో లేదా దళారులకు తక్కువ ధరలకు వాటిని అమ్మి నష్టపోవద్దని జేసీ చిన్న రాముడు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రైతుల కష్టాన్ని దళారీల వ్యవస్థ దగా చేస్తుందోని రాజమండ్రి నగరంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైతు బజార్లలో తమ పంటలను విక్రయించుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మార్కెటింగ్ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 17న పీజీఆర్ఎస్ రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి మధ్య PGRS సెషన్లకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరగదన్నారు. ప్రజలు తమ సమస్యలను మీ కోసం పోర్టల్ ద్వారా సమీపంలో ఉన్న సచివాలయాల్లో అర్జీలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని తెలిపారు. అర్జీదారులు గమనించాలన్నారు.
నల్లజర్ల మండలం పోతవరంకు చెందిన గాడి వెంకటేశ్వరరావు (77) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై పరమహంస తెలిపారు. నిడదవోలు మండలం శెట్టిపేట పవర్ ప్లాంట్ ఎదురుగా కాలవ పక్కన అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడన్నారు. బంధువులు ఫిర్యాదు మేరకు నిడదవోలు పోలీస్ స్టేషన్లో అనుమానస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బర్డ్ ప్లూ దెబ్బకు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. రూ.4.90 గుడ్డు ధర రూ.4.55కు పడిపోయిందని వ్యాపారులు తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గుడ్ల ఉత్పత్తి 1.30 కోట్ల మేర ఉండగా స్థానికంగా వినియోగం 30 శాతం ఉంటుంది. మిగిలిన 70 శాతం గుడ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, అస్సాం, మేఘాలయ తదితర రాష్ట్రాలకు ఎగుమతవుతాయి.ట్రేడర్లు బర్డ్ ఫ్లూ పేరుతో కొంత మేర ధర తగ్గించినట్లు చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఒక యువకుడి ప్రాణాలు పోయాయని మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ధ్వజమెత్తారు. స్థానిక గోరక్షణ పేట దగ్గర వాటర్ వర్క్స్ మరమ్మతుల నిమిత్తం రోడ్డుకు అడ్డంగా భారీ పైపు వేసి, రోడ్డు డైవర్షన్ కూడా పెట్టలేదన్నారు. దీంతో బైక్పై వెళ్తున్న విజయ్ అనే యువకుడు అర్ధరాత్రి పైపును ఢీ కొట్టి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
దొంగతనం చేసి పారిపోతూ కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి గాయపర్చిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు ఎస్సై కె.జగన్మోహనరావు తెలిపారు. స్కార్పియోను దొంగతనం చేసి విజయవాడ పారిపోతున్నారనే సమాచారంతో కొవ్వూరు దగ్గర మన్ బ్రిడ్జి టోల్ప్లాజా సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాంబాబు, హెచ్సీ లక్ష్మీనారాయణలకు చెప్పారు. వారు అడ్డుకునే క్రమంలో రాంబాబును ఢీకొట్టి పారిపోయారు.
తూర్పుగోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్స్ భాగంగా శనివారం నిర్వహించిన జనరల్, ఒకేషనల్ విభాగాలలో 2,439 మందికి 2,378మంది హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. అలాగే మధ్యాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ లో 1940 మందికి 1908 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆర్ ఐ ఓ పేర్కొన్నారు.
బర్డ్ ఫ్లూ వచ్చిందనే కారణంగా చికెన్ దుకాణాలు చాలా వరకు మూసివేశారు. దీంతో వాటి ధరలు అమాంతం పడిపోయాయి. మొన్నటి వరకు లైవ్ కిలో రూ.120 ఉండగా అది ప్రస్తుతం రూ.80 నుంచి 90 వరకు ఉంది. ఫారం కోడి ధర లైవ్ రూ.90 పలుకగా ఇప్పుడు రూ.70 అమ్ముతున్నారు. వైద్యులు ఉడకబెట్టిన చికెన్ తినవచ్చు అని చెప్పినా ప్రజలు మొగ్గుచూపడం లేదు.
విద్యుదాఘాతానికి గురై ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన వేములపల్లిలో శనివారం చోటు చేసుకుంది. రూరల్ సీఐ పీ.దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం..తూ.గో జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడికి చెందిన చిటికెన రామకృష్ణ (55) వేములపల్లి ఆయిల్ ఫ్యాక్టరీలో లోడ్ చేసి ట్యాంకు పైకి ఎక్కి శుభ్రం చేసే సమయంలో 33కేవీ విద్యుత్ వైరు తగిలి షాక్కు గురై మృతిచెందాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి విజయం కోసం జనసేన సన్నాహక సమావేశం ఆదివారం 03.00 గంటలకు రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్లో జరుగుతుంది. ఈ సమావేశానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్లు పాల్గొని దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు వై.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.