EastGodavari

News August 20, 2024

పోలవరం ఫైల్స్ దహనం వెనుక హస్తం ఎవరిదో..?

image

ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్ట్ కార్యాలయంలో ఫైల్స్ కాల్చివేత ఘటనతో అధికారులు అలర్ట్ అయ్యారు. దాని వెనుక ఎవరున్నారు..? కీలక విభాగాల్లో పత్రాలన్నీ ఉన్నాయా..? ఏవైనా మాయమయ్యాయా..? అనే దానిపై ఫోకస్ చేశారు. కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ ఆదేశాలతో సోమవారం ఉదయం నుంచే కార్యాలయంలో ఫైల్స్ పరిశీలన చేపట్టారు. ఇతరులెవరూ లోనికి వెళ్లకుండా బందోబస్త్ ఏర్పాటు చేశారు. కాలిన కాగితాల్లో ఏముందో తేలాల్సి ఉంది.

News August 20, 2024

కోనసీమ కలెక్టర్ ఫొటో డీపీగా పెట్టుకొని మెసేజ్‌లు

image

కొందరు తన పేరిట సందేశాలు పంపిస్తున్నారని అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం తెలిపారు. తన ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులతో పాటు ఇతరులకు సందేశాలు పంపిస్తున్నారని వివరించారు. ఆ ఫోన్ నంబర్ (94785566071) తనది కాదని, వారు పంపే సందేశాలకు రెస్పాండ్ కావద్దని సూచించారు. కాల్స్‌ కూడా స్వీకరించొద్దంటూ కలెక్టరే‌ట్ నుంచి మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

News August 20, 2024

కోనసీమ: దారుణం.. కత్తితో భార్యపై దాడి

image

అల్లవరం మండలం రెల్లుగడ్డ శివారులోని ఎలువుల్లంకకు చెందిన నాగేశ్వరరావు తన భార్య లక్ష్మిపై సోమవారం కత్తితో దాడి చేశాడు. ఎస్సై హరీష్ తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల కింద వీరికి నాగేశ్వరరావుతో లక్ష్మికి వివాహమైంది. 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా కొడుకు, కూతురుతో అమలాపురంలో ఉంటుంది. ఇటీవలే కొడుకు పెళ్లి జరిగింది. ఆదివారం స్వగ్రామంలో రిసెప్షన్ జరిగింది. అక్కడి నుంచి వెళ్తుండగా దాడి చేశాడు.

News August 20, 2024

కాకినాడ: మాజీ MLA ద్వారంపూడి బహిరంగ లేఖ

image

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై మాజీ MLA ద్వారంపూడిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కాకినాడ MLA కొండబాబుకు బహిరంగ లేఖ రాశారు. కక్షసాధింపు చర్యలు, నిరాధార ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ప్రశాంతంగా ఉండే కాకినాడలో రాజకీయ కక్షలు ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో ప్రస్తావించారు. తనను లక్ష్యంగా చేసుకొని పెడుతున్న కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.

News August 20, 2024

కాకినాడ: వివాహిత, యువకుడి ఆత్మహత్య.. UPDATE

image

జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు<<13894976>> ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. SI రఘునాథరావు వివరాల ప్రకారం.. జగ్గంపేటకు చెందిన నానాజీ (25), సాయిప్రసన్న(22) ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. నానాజీ తల్లిదండ్రులతో కలిసి స్థానిక టవర్ కాలనీలో ఉంటూనే, జగనన్న కాలనీలో సాయిప్రసన్నతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉరేసుకొని చనిపోయారు. కేసు నమోదుచేసి, విచారణ చేస్తున్నామని SI తెలిపారు.

News August 20, 2024

తూ.గో.: సీబీఎస్ఈ సామర్థ్య పరీక్షలు మళ్లీ వాయిదా

image

సీబీఎస్ఈ విధానంలో విద్యార్థులు సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ట్యాబుల్లో అప్లోడ్ చేసిన యాప్ సరిగా పనిచేయకపోవడంతో పరీక్షలను రెండోసారి వాయిదా వేశారు. మొదట ఈ నెల 12 నుంచి 17 వరకు, రెండవ సారి సోమవారం నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాయిదా వేయక తప్పలేదు. సాంకేతిక కారణాలతో వాయిదా వేశామని DCEB కార్యదర్శి వెంకట్రావు తెలిపారు.

News August 20, 2024

తూ.గో.: సముద్రంలోకి 2,75,642 క్యూసెక్కుల జలాలు

image

రాజమండ్రి రూరల్ మండల పరిధిలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి సోమవారం సాయంత్రం 2,75,642 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.50 అడుగులుగా ఉందన్నారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి డెల్టా కాలువలకు 13,800 క్యూసెక్కులు వదిలినట్లు వివరించారు.

News August 20, 2024

కాకినాడ: జనసేన జనవాణికి 40 దరఖాస్తులు

image

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో సోమవారం నిర్వహించిన జనసేన జనవాణి కార్యక్రమానికి 40 దరఖాస్తులు అందాయని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలు, జిల్లాకు చెందిన పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ దరఖాస్తులు అందజేశారన్నారు. దరఖాస్తులను మంగళగిరి జనసేన కార్యాలయానికి పంపిస్తున్నామన్నారు.

News August 19, 2024

కాకినాడ: అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి దుర్మరణం

image

కాకినాడ జిల్లాలో రాఖీ పండగ వేళ తీవ్ర విషాదం నెలకొంది. కాకినాడలోని దుమ్ములపేటలో అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ చెల్లి మృత్యువాత పడింది. యు.కొత్తపల్లి మండలం కోనపాపపేట సమీపంలోని కొత్తమూలపేట వద్ద ప్యాసింజర్ ఆటోను మరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉప్పరపల్లి దేవి(11) అక్కడికక్కడే మృతి చెందింది. ఆటోలోని మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు

News August 19, 2024

కాకినాడ: వివాహిత, యువకుడి ఆత్మహత్య

image

కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జగ్గంపేటలోని జగనన్న కాలనీలో ఓ ఇంట్లో వివాహిత, యువకుడు ఉరివేసుకుని అనుమానాదస్పద స్థితిలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జగ్గంపేట ఎస్సై రఘునాథరావు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. వివరాలు ఆరా తీశారు. మృతులు కె.ప్రసన్న, పి.నానాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.