EastGodavari

News February 4, 2025

తూ.గో: ‘మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవాలి’

image

జిల్లాలో ప్రభుత్వం గీత కులాలకు కేటాయించిన 13 మద్యం షాపులకు ఈనెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ అధికారి చింతాడ లావణ్య సోమవారం ఓ ప్రకటనలో కోరారు. జిల్లా వ్యాప్తంగా 13 షాపులలో జిల్లాకలెక్టర్, బీసీవెల్ఫేర్‌ ఆఫీసర్, బీసీ కులసంఘాల ప్రతినిధుల సమక్షంలో తీసిన లాటరీలో 11 శెట్టిబలిజ కులానికి, 01 గౌడ కులానికి, 01 గౌడ్‌ కులానికి కేటాయించడం జరిగిందన్నారు.

News February 3, 2025

తూ.గో: సోలార్ విద్యుత్ యూనిట్స్ స్థాపనకు కృషి చేయాలి- కలెక్టర్ 

image

సోలార్ విద్యుత్ ఉత్పత్తి తద్వారా వినియోగదారులకు చేకూరే ప్రయోజనం వివరించి యూనిట్స్ స్థాపన కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఏపీ ట్రాన్స్కో క్షేత్ర స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించే లక్ష్యంతో సోలార్ విద్యుత్ యూనిట్స్ ఏర్పాటు చేయడం పై దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

News February 3, 2025

రాజమండ్రి: మార్చి 8 వరకు పీజీఆర్ఎస్ రద్దు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందన్న PGRS సెషన్‌లు నిర్వహించమని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా మండల కేంద్రల్లో ప్రజల నుంచి అర్జీలను అధికారులు స్వీకరించడం జరగదని, ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న జిల్లాల కోసం ఎన్నికల కమిషన్ సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు గమనించి అధికారులకు సహకరించాలన్నారు. ఎన్నికల అనంతరం యధవిధిగా కొనసాగుతుందన్నారు.

News February 2, 2025

రాజమండ్రి: ఇంటిపై దాడిని ఖండించిన ముద్రగడ కుమార్తె

image

తన తండ్రి మాజీ మంత్రి ముద్రగడ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె జనసేన నాయకురాలు బార్లంపూడి క్రాంతి తెలిపారు. రాజమండ్రిలో ఆమె పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. నాన్న ఇంటిపై దాడి జరగడం చాలా బాధాకరమన్నారు. డిప్యూటీ సీఎం ఇటువంటి దాడులకు పూర్తి వ్యతిరేకమని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి జనసేన నాయకులు చేయించారని వచ్చిన ఆరోపణలను ఆమె ఖండించారు.

News February 2, 2025

రాజమండ్రి: ఎమ్మెల్సీగా అఖండ మెజార్టీతో గెలిపించండి

image

ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మెజారిటీతో తనను గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కోరారు. శనివారం రాజమండ్రిలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

News February 1, 2025

రాజమండ్రిలో వ్యక్తి మృతి

image

రాజమండ్రి రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన తీపర్తి బుల్లిబాబు(45) కాకినాడ GGHలో శుక్రవారం మృతి చెందాడు. బొమ్మూరు ఎస్సై అంకారావు వివరాల మేరకు.. ఈనెల 26న బుల్లిబాబు భార్యను మద్యం తాగేందుకు డబ్బులు అడిగాడు. ఆమె డబ్బులు లేవనిచెప్పడంతో గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం మెరుగైన వైద్యానికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను మ‌ృతి చెందాడు.

News February 1, 2025

పా.గో : సర్పంచ్ పేరుతో అపరిచిత వ్యక్తుల దరఖాస్తులు

image

పా.గో జిల్లాలోని మండల కేంద్రమైన తాళ్లపూడి సర్పంచ్ లాగిన్‌లో అపరిచిత వ్యక్తులు ప్రధాని మంత్రి విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఈ విషయమై సర్పంచ్ నక్కా అనురాధ కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. సర్పంచ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి దరఖాస్తులు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయాలని సర్పంచ్ కోరారు.

News January 31, 2025

స్నేహం ఎంతో విలువైనది – నటుడు సుమన్

image

స్నేహం ఎంతో విలువైనదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. పలు కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం రాజమండ్రి ఏవీ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్‌లో తన మిత్రులను కలిశారు. సుమన్‌కు 20 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న షేక్ మీరా బాబ్జి, షేక్ సుభాన్ తదితరులు ఆయనను సత్కరించారు. తన జీవితంలో సంపాదించిన ఆస్తి స్నేహం, అభిమానమేనని సుమన్ పేర్కొన్నారు.

News January 31, 2025

తూ.గో : ఫిబ్రవరి 1న పెన్షన్ పంపిణీ ఏర్పాట్లు పూర్తి- కలెక్టర్

image

ఫిబ్రవరి 1న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో క్షేత్ర స్థాయి అధికారులకు తగిన సూచనలు చేసినట్లు శుక్రవారం రాజమండ్రిలో ఆమె వివరించారు. తూ.గో జిల్లాలోని 9,041 క్లస్టర్ ఏరియాలో 5,158 మంది పీడీఓల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News January 31, 2025

రాజమండ్రి పార్కులో వ్యక్తి అనుమానాస్పద మృతి

image

రాజమండ్రిలోని పివీ నరసింహరావు పార్కులో గురువారం బేస్త వీధికి చెందిన అద్దంకి రమణ (52)అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రమణ బంగారం షాపులో పనిచేస్తుంటారని తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా బుధవారం షాపు నుంచి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని కుటుంబీకులు అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!