India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మొంథా తుఫాను ధాటికి జిల్లాలోని 33,262 మంది రైతులకు చెందిన 41,350 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈ తుఫాను ప్రభావంతో సుమారు రూ. 40.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. అయితే తుఫాను సంభవించి నెల రోజులు గడిచినా, ఇంతవరకు పంట నష్టపరిహారం అందకపోవడం పట్ల అన్నదాతలు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.

తూ.గో. జిల్లాలో రైతులు రబీ సాగుకు సన్నద్ధమవుతున్నారు. మొత్తం 61,318 హెక్టార్లలో రబీ సాగు లక్ష్యం కాగా, దీనికి 3,066 హెక్టార్లలో నారుమళ్లు పోయాల్సి ఉంది. ఇప్పటికే 215 హెక్టార్లలో నారుమళ్లు పోశారు. జిల్లాలో 60 శాతం బోర్ల కింద, 18 శాతం గోదావరి డెల్టాలో, 11 శాతం చెరువుల కింద సాగు చేస్తున్నారు. మిగిలిన 22,543 ఎకరాలు వర్షాధారంగా సాగవుతున్నాయి. బోర్ల కింద రైతులు మురుగు దమ్ము చేసి నారుమళ్లను పోశారు.

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. శనివారం సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 76.42 శాతం కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయాధికారి (డీఏఓ) ఎస్. మాధవరావు తెలిపారు. మొత్తం 81,406 హెక్టార్లకు గాను, ఇప్పటివరకు 62,217 హెక్టార్లలో పంట కోతలు పూర్తయ్యాయి. మరో వారం, పది రోజుల్లో వరి కోతలు వంద శాతం పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నన్నయ విశ్వవిద్యాలయం రాజమండ్రి, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలోని పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్స్ ఈ నెల 8 నుండి 12వ తేదీ వరకు రాజమండ్రి క్యాంపస్లో నిర్వహిస్తున్నామని వీసీ ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శనివారం వర్సిటీలో ఈ వివరాలు వెల్లడించారు. ఎం.ఏ., ఎం.కామ్, ఎం.పీ.ఈడీ, ఎంఎస్సీ ప్రోగ్రామ్స్కు ఈ అడ్మిషన్స్ ఉంటాయని వీసీ పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేసి ఈ నెల 10వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఆదేశించారు. అనంతరం 13వ తేదీన వాటిని కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మూరు పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి అధ్యక్షతన శనివారం నిర్వహించిన గూగుల్ మీట్ సమావేశంలో ఆయన ఈ విషయం చెప్పారు.

డిసెంబర్ 8న రాజమండ్రి కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల, గ్రామ సచివాలయ స్థాయిల్లో PGRS కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యమన్నారు. అర్జీదారులు తమ వినతిపత్రాలను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చని ఆమె చెప్పారు.

63వ హోంగార్డ్స్ ఆవిర్భావ వేడుకలను శనివారం రాజమండ్రిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హోంగార్డులు నిస్వార్థ సేవలు అందిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ కొనియాడారు. పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తూ.గో. జిల్లాలో ఖరీఫ్ 2025-26 ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా జరుగుతోందని జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 35,391 మంది రైతుల నుంచి 2,63,423.160 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మొత్తం విలువ రూ. 601.79 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 540.08 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.