EastGodavari

News August 14, 2024

నేడు కాకినాడకు పవన్ కళ్యాణ్ రాక

image

కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారైంది. హెలికాప్టర్‌లో నేటి సాయంత్రం కాకినాడకు చేరుకుంటారు. JNTU గెస్ట్ హౌస్‌లో రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఎగరవేస్తారు. తర్వాత చేబ్రోలులోని తన నివాసానికి చేరుకుంటారు. రేపు రాత్రికి గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో ఆయన విజయవాడకు వెళ్తారా? పిఠాపురంలోనే ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.

News August 14, 2024

ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలి: కలెక్టర్

image

ఓటర్ల సంక్షిప్త సవరణ జాబితా తయారీలో భాగంగా ఇంటింటా ఓటర్ల సర్వే నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్‌మోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యదర్శి వివేక్ యాదవ్ అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు కాకినాడ కలెక్టరేట్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. అనంతరం అధికారులకు సూచనలు చేశారు.

News August 13, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూ.గో. జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరిక హెచ్చరించింది. రాజమండ్రి రూరల్, జగ్గంపేట, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతంలో పిడుగులు పడవచ్చని అధికారులు ప్రకటించారు. సెల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. ఆరు బయట, చెట్ల కింద ఉండవద్దని సూచించింది.

News August 13, 2024

రాజమండ్రి: రైల్వే ట్రాక్‌పై యువతి డెడ్‌బాడీ

image

రాజమండ్రి రైల్వే స్టేషన్ సమీపంలోని 576/16-18 పోల్ వద్ద సుమారు 20 ఏళ్ల వయసు గల గుర్తు తెలియని యువతి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు రైల్వే పోలీసులు తెలిపారు. నీలం దుస్తులు ధరించి ఉన్నట్లు వివరించారు. ఈ మేరకు రాజమండ్రి జీఆర్‌ పీఎస్‌లో కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలిసినవారు 94406 27551, 94914 44022 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

News August 13, 2024

తూ.గో జిల్లాలో ఘోరం.. భార్యను హత్య చేసిన భర్త

image

తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. కట్టుకున్న భర్తే భార్యను హతమార్చాడు. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీతానగరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్రామస్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 13, 2024

కోనసీమ: గల్ఫ్‌లో పేరెంట్స్.. బీచ్‌కి వెళ్లి బాలుడి మృతి

image

21న విశాఖలో బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరాల్సిన విద్యార్థి స్నేహితులతో కలిసి సరదాగా బీచ్‌కి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం వద్ద సోమవారం కాలువలో గల్లంతై సందీప్(17) మృతి చెందిన విషయం తెలిసిందే. పి.గన్నవరం మండలం పెదకందాలపాలానికి చెందిన సందీప్ పేరెంట్స్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. దీంతో అన్నదమ్ములు అమలాపురం మండలం వన్నెచింతలపూడిలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నారు.

News August 13, 2024

కాకినాడ: వివాహితపై అత్యాచారం

image

కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన వివాహితపై దగ్గరి బంధువైన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు యువకుడు అఖిల్‌పై కేసు నమోదు చేశామని CI గీతా రామకృష్ణ తెలిపారు. కొన్నేళ్లుగా అసభ్యకరంగా ఫొటోలు తీసి, డబ్బుల కోసం వేధిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. జులై 25న ఏలూరులో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పడంతో అఖిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 13, 2024

నేడు కాకినాడలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన

image

కాకినాడలో మంగళవారం (నేడు) రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నట్లు కాకినాడ కలెక్టరేట్ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి ఆయన జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సమావేశానికి అధికారులంతా తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

News August 12, 2024

రాజమండ్రి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

అన్నవరం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సోంబాబు (35) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు యువకులు రాజమండ్రిలో ఓ వివాహానికి వచ్చారు. వివాహం అనంతరం బైకుపై అరకు వెళ్లారు. తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా అన్నవరం వై జంక్షన్ వద్ద బస్సును తప్పించబోయి అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 12, 2024

తూ.గో.: సినిమాచెట్టు పునరుద్ధరణకు పనులు ముమ్మరం

image

దేవరపల్లి మండలం కుమారదేవం సినిమాచెట్టు పునరుద్ధరణ పనులను ముమ్మరం చేశామని రోటరీ క్లబ్‌ఆఫ్ రాజమండ్రి ఐకాన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. చెట్టు పునరుద్ధరణ కార్యక్రమ ఇన్‌ఛార్జి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. చెట్టు కొమ్మలను కత్తిరించే ప్రక్రియ మొదలుపెట్టామన్నారు. మానుకి ఏ విధమైన నష్టం జరగకుండా ప్రత్యేకంగా తయారుచేసిన లేపనాలు పూసి కవర్ చేస్తామన్నారు.