India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నవంబరు నెలాఖరులోగా లబ్ధిదారులు తమ స్మార్ట్ రేషన్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ బుధవారం తెలిపారు. జిల్లాకు మొత్తం 5,59,348 స్మార్ట్ రైస్ కార్డులను ముద్రించి పంపిణీకి పంపినట్లు ఆయన వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సచివాలయ సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా ఈ పంపిణీ ప్రారంభమైందని ఆయన వివరించారు.

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.

గోదావరి పుష్కరాల దృష్ట్యా ఎన్హెచ్–365బీబీ అప్గ్రేడేషన్ పనులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి ఆదేశించారు. బుధవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్లో సమీక్షా సమావేశం జరిగింది. ప్రాజెక్ట్ పురోగతి, భూ సేకరణ, క్లియరెన్సులు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని కలెక్టరేట్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, భారత స్వాతంత్ర్య పోరాట స్పూర్తిని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శనలు సాగాయి. సంప్రదాయ భారతీయ కళ, సాహిత్య సోయగాలు ప్రతిఫలించిన ఈ కార్యక్రమాలు దేశభక్తి భావాలను మరింత బలోపేతం చేశాయి.

విద్యాశాఖ నిర్వహించిన మాక్ అసెంబ్లీ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బుధవారం కలెక్టర్ కీర్తి చేకూరి జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, వారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి మాక్ అసెంబ్లీలో 8 మంది విద్యార్థులు, జిల్లా స్థాయిలో 13 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆమె తెలిపారు.

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రి కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి డా. బి.ఆర్. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతలను ప్రతి ఒక్కరూ నిజాయితీ, కర్తవ్య నిబద్ధతతో నిర్వర్తించాలని కోరారు. ప్రతి ఒక్కరూ నీతి, నిజాయితీతో రాజ్యాంగ స్ఫూర్తితో మెలగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.

జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం మండలాలను రాజమహేంద్రవరం డివిజన్లో విలీనం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మూడు మండలాల చేరికతో రాజమహేంద్రవరం డివిజన్లోని మండలాల సంఖ్య 9 నుంచి 12కు పెరిగింది.
Sorry, no posts matched your criteria.