EastGodavari

News August 12, 2024

కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

image

కాకినాడ జిల్లాకేంద్రంలోని పెద్దమార్కెట్‌కు చెందిన టి.కృష్ణమోహన్‌ను పెళ్లిసంబంధం పేరిట ఆరుగురు మహిళలు కలిసి కొద్దిరోజుల క్రితం <<13794340>>మోసం <<>>చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై గతంలోనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదుచేయగా ఆరుగురిపై కేసు నమోదుచేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ రోజు బాధితుడు కలెక్టరేట్‌లో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలోనూ ఫిర్యాదుచేశాడు.

News August 12, 2024

బంక్ ప్రారంభించి పెట్రోల్ కొట్టిన హోంమంత్రి అనిత

image

రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా జైళ్ల శాఖ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురి వాహనాలలో మంత్రి అనిత సరదాగా పెట్రోల్ కొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2024

బంక్ ప్రారంభించి పెట్రోల్ కొట్టిన హోంమంత్రి అనిత

image

రాజమండ్రిలోని తూర్పు గోదావరి జిల్లా జైళ్ల శాఖ అధికారి కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పెట్రోల్ బంక్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పలువురి వాహనాలలో మంత్రి అనిత సరదాగా పెట్రోల్ కొట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News August 12, 2024

తూ.గో: ఆ ఇద్దరు బాలికలు సేఫ్..!

image

తూ.గో జిల్లా ధవళేశ్వరానికి చెందిన ఇద్దరు బాలికల అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. నెల్లూరులో బాలికలు దొరికారని, నిందితుడిని పట్టుకున్నారని సమాచారం. విజయనగరానికి చెందిన వెంకటేశ్ ధవళేశ్వరానికి చెందిన బాలికలను 15 రోజుల కింద అపహరించాడు. బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు పిఠాపురం మాజీ MLA వర్మ, ‘X’ వేదికగా మంత్రి లోకేశ్‌కు <<13823784>>విన్నవించడంతో<<>> బాలికల ఆచూకీ కనుగొన్నారు.

News August 12, 2024

ప్రేమిస్తున్నానని వేధింపులు.. యువకుడిపై కేసు

image

ప్రేమిస్తున్నానని వెంటపడుతూ.. ఒప్పుకోకపోతే చనిపోతా, ఫొటోలు నెట్‌లో పెడతానంటూ యువతిని వేధిస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. చేబ్రోలుకు చెందిన యువకుడిపై గొల్లప్రోలు యువతి ఆదివారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామని SI జాన్ బాషా తెలిపారు. కాలేజీకి వచ్చి యువకుడు బెదిరించడంతో పాటు గతంలో అతడితో తీసుకున్న ఫొటోలను నెట్‌లో పెడతానని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News August 12, 2024

కాకినాడ: తల్లిదండ్రుల చెంతకు యువకుడు

image

అన్నవరం రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించిన 17 ఏళ్ల యువకుడు గాజుల స్వామిని GRP పోలీసులు ఆదివారం తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. యువకుడి ప్రవర్తన తేడాగా ఉండటంతో హెడ్‌కానిస్టేబుల్ శ్యామ్ తుని GRP ఎస్ఐ అబ్దుల్ మారూఫ్‌కి సమాచారం అందించారు. రెస్టారెంట్‌లో పనిచేయమని తల్లిదండ్రులు కోరగా అది ఇష్టం లేక ఇంటి నుంచి పారిపోయి వచ్చినట్లు విచారణలో గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించి అప్పగించారు.

News August 11, 2024

కోనసీమ: RWS ఏఈ సేఫ్

image

డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (ఏఈ) కె.సురేశ్ <<13827346>>అదృశ్యమైన<<>> విషయం తెలిసిందే. కాగా అతను రాజమండ్రి బస్టాండ్‌లో ఉన్నట్లు ఆదివారం బంధువులకు సమాచారం అందింది. దీంతో అతణ్ని ఇంటికి తీసుకు వచ్చేందుకు కుటుంబీకులు అక్కడికి వెళ్లారు. కుటుంబ సమస్యల కారణంగా శనివారం విధులకు వెళ్లిన సురేశ్ అదృశ్యమైనట్లు చెబుతున్నారు.

News August 11, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో రూ.191.84 కోట్ల బకాయిలు

image

ఉమ్మడి తూ.గో జిల్లాలోని రైతులకు రూ.191.84 కోట్ల ధాన్యం బకాయిలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. తూ.గో జిల్లాలో 498.70 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశారు. రూ.470.99 కోట్లు చెల్లించగా.. రూ.27.71 కోట్లు చెల్లించాల్సి ఉంది. కాకినాడ జిల్లాలో రూ.56.75 కోట్లలో రూ.47.25 కోట్లు చెల్లించగా.. రూ.9.50 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.355.88 కోట్లకు, రూ.201.25 కోట్లు చెల్లించారు. రూ.154.63 కోట్లు చెల్లించాల్సి ఉంది.

News August 11, 2024

కోనసీమ జిల్లాలో RWS ఏఈ మిస్సింగ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.

News August 11, 2024

FLASH: కోనసీమ జిల్లాలో RWS ఏఈ మిస్సింగ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.