EastGodavari

News August 11, 2024

FLASH: కోనసీమ జిల్లాలో RWS ఏఈ మిస్సింగ్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం RWS ఇంజినీర్ (AE) కె.సురేశ్ అదృశ్యంపై అతడి తండ్రి దన రామప్రసాద్ ఆదివారం అమలాపురం టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం 10:45 గంటలకు ఇంటి నుంచి విధులకు వెళ్లాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు ఆయన ఫోన్ అందుబాటులోనే ఉందని, తర్వాత నుంచి పనిచేయటం లేదన్నారు. సురేశ్ అమలాపురంలో ఉంటున్నారు.

News August 11, 2024

మనవరాలిగా దగ్గరై.. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి చోరీ

image

కాకినాడలోని రామారావుపేటలో శ్రీపాద అపార్ట్‌మెంట్ 4వ అంతస్తులో 79ఏళ్ల వంగ మణికి జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి గుర్తుతెలియని మహిళ చోరీకి పాల్పడింది. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా నివసిస్తున్న ఆమె వద్దకు గత నెల 24న ఓ మహిళ వెళ్లి మాయమాటలు చెప్పి మనవరాలిగా పరిచయం చేసుకుంది. జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి రూ.2.16 లక్షల విలువైన 8 కాసులు బంగారం చోరీ చేసింది.

News August 11, 2024

ముమ్మిడివరం MLA బుచ్చిబాబు సోదరుడు మృతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం MLA దాట్ల బుచ్చిబాబు సోదరుడు వెంకట సీతారామరాజు(43) శనివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో స్వగ్రామం ఐ.పోలవరం మండలం మురమళ్లలో విషాదం నెలకొంది. సీతారామరాజుకు భార్య, కుమార్తె ఉన్నారు. సోదర వియోగంతో బాధపడుతున్న MLA బుచ్చిబాబును పలువురు పరామర్శించి ఓదార్చారు. నియోజకవర్గంలోని నాయకులు, MLA అభిమానులు సీతారామరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు.

News August 10, 2024

కాకినాడ: కొత్త అల్లుడికి 100 రకాల పిండి వంటలు

image

ఇటీవల వివాహమై.. ఆషాఢ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లుళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తుంది.

News August 10, 2024

కోనసీమ: కూలీల ఆటోను ఢీకొట్టిన RTC బస్సు

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కూడలి వద్ద శనివారం ఓ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అల్లవరం మండలం కొమరగిరిపట్నం నుంచి పి.గన్నవరం మండలం ముంగండ రొయ్యల పరిశ్రమలో పని కోసం 11 మంది ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

News August 10, 2024

ఇసుక పాలసీపై రాజమండ్రి కలెక్టరేట్‌లో సమీక్ష

image

పేదల సొంత ఇంటి కల నెరవేరాలనే ఉద్దేశ్యంతో సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీని ప్రవేశ పెట్టారని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద ఇసుక పాలసీపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఇసుక పాలసీ విధానంపై ఆరా తీశారు. ఈ సమావేశంలో కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

News August 10, 2024

ఉమ్మడి తూ.గో.లో పిడుగులు పడే అవకాశం

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో శనివారం పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, అనపర్తి, సామర్లకోట, రాజమండ్రి రూరల్, రంపచోడవరం, ఏజెన్సీ ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ మేరకు ప్రజల ఫోన్లకు పిడుగుపాటు హెచ్చరికల సందేశాలు పంపించారు.

News August 10, 2024

గుండెపోటుతో ప్రత్తిపాడు ASI మృతి

image

ప్రత్తిపాడు ASIగా పని చేస్తున్న పి.పెద్దబ్బాయి (60) గుండెపోటుతో మృతిచెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం రాజవొమ్మంగి మండలం లాగరాయి. కాగా ఆయన ఏలేశ్వరంలో నివాసం ఉంటున్నారు. శనివారం ఇంట్లో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కాకినాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 10, 2024

ధవళేశ్వరం బ్యారేజీ UPDATE

image

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 6.81 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.40 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

News August 10, 2024

పిఠాపురం: మట్టి గణపతిని ఏర్పాటుచేసిన పవన్ కళ్యాణ్

image

పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన నివాసంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మామిడాకులు, పూలతో పందిరిని అందంగా అలంకరించారు. వినాయకచవితికి నెలరోజుల ముందే ఈ ఏర్పాట్లు చేయడం విశేషం. కాగా చేతి సంచితో బజారుకు వెళదాం అనే సందేశంతో ఓ సంచిని వినాయకుని వద్ద ఉంచారు.