EastGodavari

News August 10, 2024

ఉమ్మడి తూ.గో. జిల్లాలో ఇద్దరు సీఐలకు పోస్టింగులు

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు సీఐలకు పోస్టింగ్ ఇస్తూ ఏలూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీవీజీ అశోక్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్లో పనిచేస్తున్న టీవీ.నరేష్ కుమార్‌ను డా.బీఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు సీఐగా నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న అల్లు వెంకటేశ్వరరావును తూర్పుగోదావరి జిల్లా కడియం సీఐగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

News August 10, 2024

తూ.గో.: పేరెంట్స్ ప్రశ్నించినందుకు.. యువతి సూసైడ్

image

ఫోన్ మాట్లాడుతున్నావని పేరెంట్స్ ప్రశ్నించగా ఓ యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. నల్లజర్ల మండలం ఘంటావారిగూడేనికి చెందిన లక్ష్మి(18) ఓపెన్ ఇంటర్ చేస్తూ ఓ మెడికల్ షాప్‌లో పనిచేస్తోంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో కలతచెందిన ఆమె శుక్రవారం మధ్యాహ్నం అమ్మానాన్నకు ఫోన్ చేసి మిమ్మల్ని చూడాలని ఉందని కట్ చేసింది. వారు వచ్చేసరికి ఉరేసుకొని చనిపోయింది. కేసు నమోదైంది.

News August 9, 2024

పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సెలబ్రేషన్స్.. నిహారిక ఏమన్నారో తెలుసా?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యాక ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ చూపిస్తానని నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో గురువారమే ప్రీమియర్స్ అయ్యాయని అన్నారు. చిత్ర యూనిట్ అక్కడి వారితో కలిసి మూవీని చూడాలనుకుంటున్నారని వెల్లడించారు. మూవీ సెలబ్రేషన్స్ ప్రస్తుతానికి తమ ఆఫీస్‌లో ప్లాన్ చేశామని, పిఠాపురంలో ప్లాన్ చేస్తే తప్పకుండా చెబుతామని అన్నారు.

News August 9, 2024

‘సినిమా చెట్టు’కు ట్రీట్‌మెంట్.. 45 రోజుల్లో చిగుర్లు..!

image

కొవ్వూరు మండలం కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ పునరుజ్జీవ ప్రక్రియ చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి ఐకాన్స్ ఆధ్వర్యంలో నిపుణులు కెమికల్ ట్రీట్‌మెంట్ చేశారు. 45 రోజుల తర్వాత చిగుర్లు వస్తాయని పేర్కొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇలా 10 చెట్లకుపైగా చిగురింపజేశామన్నారు. ఈ చెట్టు అంటే తనకు ప్రాణమని, దాన్ని బతికిస్తే ఎక్కువ నిడివితో మళ్లీ ఓ పెద్ద సినిమా తీస్తానని డైరెక్టర్ వంశీ తెలిపారు.

News August 9, 2024

కోనసీమ: అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరిన జ్యోతి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వీధివారిలంకకు చెందిన జ్యోతి అబుదాబి నుంచి స్వగ్రామానికి చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జ్యోతి పి.గన్నవరానికి చెందిన ఓ ఏజెంట్ ద్వారా 4 నెలల కింద అబుదాబి వెళ్లి అరబ్ షేక్ ఇంట్లో పనిలో చేరారు. అక్కడ ఇబ్బంది పడుతున్నానని <<13781183>>ఓ వీడియో<<>> విడుదల చేయగా.. మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి జ్యోతిని శుక్రవారం స్వదేశానికి రప్పించారు.

News August 9, 2024

అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభం

image

కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని ఆలయంలో బంగారు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. నెల్లూరుకు చెందిన దాత సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో స్తంభానికి బంగారు తాపడాన్ని తయారు చేయించారు. ఇక గుంటూరు జిల్లా నిడుబ్రోలు నుంచి తీసుకొచ్చిన 60 అడుగుల నారేప కర్రతో ఈ స్తంభాన్ని తయారుచేశారు. దాదాపు 300 కేజీల రాగిపై సుమారు 1800 గ్రాముల బంగారు తాపడాన్ని ఏర్పాటు చేశారు.

News August 9, 2024

ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీటివిడుదల

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గురువారం 6,88,962 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేసినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. కాటన్ బ్యారేజీ వద్ద గురువారం సాయంత్రానికి 9.50 అడుగులకు నీటిమట్టం కొనసాగుతుందని అన్నారు. డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు నీరు విడుదల చేసినట్లు వెల్లడించారు.

News August 9, 2024

కోనసీమ జిల్లాలో 12న మంత్రి నాదెండ్ల పర్యటన

image

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈనెల 12 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ డీవీఎస్ ఏల్లారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటిస్తారన్నారు. రైతులకు చెల్లించే ధాన్యం సొమ్ముల బకాయిలను విడుదల చేస్తారన్నారు.

News August 8, 2024

తూ.గో: 17 మంది తహశీల్దార్లకు పోస్టింగ్స్

image

17 మంది తహశీల్దార్లకు పోస్టింగ్స్ ఇస్తూ తూ.గో కలెక్టర్ ప్రశాంతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రమణి (బిక్కవోలు), సుస్వాగతం (కోరుకొండ), సుజాత (రాజమండ్రి రూరల్), సరస్వతి (గోకవరం), పోసిబాబు (కడియం), రమేష్ (రాజమండ్రి అర్బన్), మేరీకమ్మ (చాగల్లు), నాగరాజు నాయక్ (నిడదవోలు), అచ్యుత కుమారి (పెరవలి), రవీంద్రనాథ్ (తాళ్లపూడి), కనకరాజు (కొవ్వూరు), ప్రసాద్ (ఉండ్రాజవరం), ఐదుగురికి ప్లేసులు కేటాయించారు.

News August 8, 2024

సమాచారం ఇస్తే రూ.5 వేల రివార్డ్: మంత్రి సుభాశ్

image

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ ప్రజలను కోరారు. పరిశ్రమలు, స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ గంజాయి బ్యాచ్‌లు కనిపించినా తమకు సమాచారం చేరవేయాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, రూ.5 వేల రివార్డు అందజేస్తామని అన్నారు.