EastGodavari

News August 6, 2024

తూర్పుగోదావరి: దరఖాస్తుల ఆహ్వానం

image

రెండు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు, ఐదు సహాయ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని బీఎల్ఎఫ్ ఛైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం తెలిపారు. దరఖాస్తులను తూర్పు గోదావరి జిల్లా న్యాయస్థాన అధికారిక వెబ్సైట్ నందు గానీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నోటీస్ బోర్డు నందు గానీ అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ఈనెల 9లోగా దరఖాస్తు చేయాలన్నారు.

News August 6, 2024

ధవళేశ్వరం వద్ద నిలకడగా గోదావరి ప్రవాహం

image

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం గత 3 రోజుల నుంచి నిలకడగా ఉంది. మంగళవారం ఉదయం 7 గంటలకు 8.90 అడుగులకు చేరి నీటిమట్టం సాధారణ స్థాయిలో ఉంది. 6.21 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.

News August 6, 2024

’రాజమండ్రి విమానాశ్రయం లీజుకు’

image

దేశవ్యాప్తంగా 2022- 2025 మధ్యకాలంలో లీజుకు ఇవ్వాలని గుర్తించిన విమానాశ్రయాల్లో రాజమండ్రి విమానాశ్రయం ఒకటని కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మొహోల్ తెలిపారు. ఉత్తమ యాజమాన్య విధానాలు, ప్రైవేటు రంగానికి ఉన్న సామర్థ్యాలు, పెట్టుబడి శక్తిని ఉపయోగించుకునేందుకే ఈ విమానాశ్రయాలను లీజుకు ఇస్తున్నట్లు చెప్పారు. లీజు ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇతర విమానాశ్రయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు తెలిపారు.

News August 6, 2024

కోనసీమ: మద్యం మత్తులో ASIపై దౌర్జన్యం

image

అంబాజీపేట మండలం గంగలకుర్రుకు చెందిన విజయ్ అదే గ్రామంలోని అమ్మాయితో ఈ నెల 3న రాత్రి ఆమె ఇంటి వద్ద మాట్లాడుతున్నాడని అంబాజీపేట SI చిరంజీవి సోమవారం తెలిపారు. అమ్మాయి తల్లిదండ్రులు అతణ్ని ప్రశ్నించడంతో వివాదం జరిగిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఏఎస్ఐ సూర్యనారాయణ అక్కడికి చేరుకొని విచారించారు. దీంతో విజయ్ ఏఎస్ఐపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు.

News August 6, 2024

ధవళేశ్వరం: సముద్రంలోకి నీటి విడుదల

image

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 7 గంటలకు 6,33,226 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టినట్లు జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టాకు 3,800, మధ్య డెల్టాకు 2000, పశ్చిమ డెల్టాకు 5000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

News August 6, 2024

కాకినాడ: మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ మిస్సింగ్

image

తొండంగి మండలంలో ఓ మహిళా ఇంజినీరింగ్ అసిస్టెంట్ అదృశ్యమైంది. పోలీసుల వివరాలు.. ఉప్పాడ మండలం అమరవిల్లికి చెందిన లలిత ఐదేళ్లుగా GMపేట సచివాలయంలో ఇంజినీర్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. శనివారం విధులకు హాజరై సాయంత్రం ఆటోలో ఇంటికి బయలుదేరింది. రాత్రి 7:40 గంటలకు కాకినాడ పోర్ట్ ప్రాంతంలో ఆమె సిగ్నల్ కట్ అయింది. అంతకుముందు ఆమె అన్నయ్యకు చనిపోతున్నానని మెసేజ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదైంది.

News August 6, 2024

ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతి: SVSN వర్మ

image

పిఠాపురంలో గత ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన సెంటు భూమి స్థలాలను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునిగిపోయే స్థలాలను రూ.కోట్లల్లో కొని ప్రజలకు కేటాయించారని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇళ్ల స్థలాల పంపిణీలో భారీ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు.

News August 5, 2024

తూ.గో: ‘సినిమా చెట్టు’ను నాటిందెవరో తెలుసా..?

image

కుమారదేవంలోని ‘సినిమా చెట్టు’ ఇకనుంచి ఓ చరిత్ర. కొవ్వూరు మండలం కుమారదేవం గ్రామంలో ఈ నిద్ర గన్నేరు చెట్టును గోదావరి ఒడ్డున సింగలూరి తాతబ్బాయి నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. 150 ఏళ్లుగా ఎన్నో వరదలు, తుఫాన్‌లను తట్టుకుంటూ.. తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహా వృక్షమైంది. షూటింగ్స్ ఎక్కువగా జరగడం వల్ల ‘నిద్ర గన్నేరు’ అనే అసలు పేరును కూడా మర్చిపోయి ‘సినిమా చెట్టు’ అని పిలుస్తారు అక్కడి జనాలు.

News August 5, 2024

పిఠాపురంలో ‘ఆయ్’ మూవీ ట్రైలర్ లాంచ్

image

ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించిన ‘ఆయ్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సోమవారం పిఠాపురంలో జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ MLA, టీడీపీ ఇన్‌ఛార్జి SVSN వర్మ హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం వర్మ మాట్లాడుతూ.. సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు. నటీనటులు, టెక్నీషియన్లకు శుభాకాంక్షలు తెలిపారు. MAD సినిమాతో హిట్ కొట్టిన Jr.NTR బావమరిది నార్నే నితిన్ హీరోగా చేస్తున్న ‘ఆయ్’.. ఈనెల 15న రిలీజ్ కానుంది.

News August 5, 2024

సీఎం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు

image

అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు కలెక్టర్లు పాల్గొన్నారు. తూర్పు గోదావరి కలెక్టర్ ప్రశాంతి, కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు విజన్-2047పై దిశా నిర్దేశం చేశారు.