EastGodavari

News July 31, 2024

రాజమండ్రి వాసిని అభినందించిన డిప్యూటీ సీఎం

image

అంతర్జాతీయ టైగర్స్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పులుల ఫొటోలతో ఎగ్జిబిషన్‌ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్‌‌కు ముఖ్య అతిథిగా మంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ద్రోణంరాజు భగవాన్ దాస్ తీసిన పులుల ఫొటోలను పవన్ చూశారు. అవి చాలా అద్భుతంగా ఉన్నాయని పవన్ దాస్‌ను అభినందించారు.

News July 31, 2024

ఉమ్మడి తూ.గో జిల్లాలో పిడుగులకు ఛాన్స్!

image

వాతావరణ ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫోన్లకు మెసేజ్‌లు పంపి అలర్ట్ చేసింది. ఉమ్మడి జిల్లాలోని రాజమండ్రి రూరల్, అనపర్తి,
అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ రూరల్, తుని, పెద్దాపురం, సామర్లకోట తదితర ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉందని సూచించింది.
☞ SHARE IT..

News July 31, 2024

కోరింగ ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

image

ఫిర్యాదుదారుడిని లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై కోరింగ ఎస్సై రవికుమార్, కానిస్టేబుల్ సురేశ్‌ను సస్పెండ్ చేసినట్లు డీఎస్పీ హనుమంతరావు మంగళవారం తెలిపారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఐజీ ఉత్తర్వులు జారీ చేశారని చెప్పారు. 2019లో ప్రత్తిపాడు పీఎస్‌లో గంజాయి కేసులో పట్టుకున్న కారులో ఇంజిన్ మాయం చేశారని చినశంకర్లపూడికి చెందిన సూర్యారావు ఈనెల 23న డీజీపీకి ఫిర్యాదు చేశారు.

News July 30, 2024

మంత్రి దుర్గేష్‌ను కలిసిన చిన్ననాటి మిత్రుడు

image

మంత్రి కందుల దుర్గేష్‌ను తూ.గో. జిల్లా గోకవరం గ్రామానికి చెందిన ఆయన చిన్ననాటి స్నేహితుడు బత్తుల సత్తిబాబు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ.. రాజమండ్రి SKVT జూనియర్ కళాశాలలో ఇద్దరం చదువుకున్నామని తెలిపారు. తన మిత్రుడు పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.

News July 30, 2024

అమలాపురం: ఆన్‌లైన్‌లో బెట్టింగ్.. ఐదుగురు అరెస్ట్

image

ఆన్‌లైన్‌లో బెట్టింగ్ గేమ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అమలాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. సీఐ క్రిస్టోఫర్ మాట్లాడుతూ.. పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ వద్ద అంబికా లాడ్జిలో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసి ఐదు లాప్టాప్‌లు, 75 మొబైల్ ఫోన్లు, చెక్ బుక్కులు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

News July 30, 2024

రంపచోడవరం MLA సొంత డబ్బులతో అంబులెన్స్ సిద్ధం

image

ఆపదలో ఉన్న వారికి వైద్యసహాయం అందించేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషా దేవి సొంత సొమ్ముతో అంబులెన్స్ అందుబాటులోకి తీసుకొస్తానని వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే సిద్ధం చేశారు. ప్రస్తుతం అంబులెన్సు వాహనాన్ని అన్నీ రకాలుగా తీర్చిదిద్దుతున్నట్లు టీడీపీ నేత భాస్కర్ తెలిపారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినం సందర్భంగా ఈ అంబులెన్స్‌ను MLA శిరీషా దేవి ప్రారంభిస్తారని తెలిపారు.

News July 30, 2024

రాజమండ్రి: నాటు తుపాకీతో కాల్పులు

image

తూ.గో జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు చోరీకి వచ్చారు. స్థానికులు వారిని ప్రతిఘటించడంతో వాళ్ల వద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్పులు జరిపారు. స్థానికులు అప్రమత్తమై ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. దొంగలు వచ్చిన బైక్, నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News July 30, 2024

రాజమండ్రిలో లెక్చరర్ ఉద్యోగాలు

image

రాజమండ్రి SKR మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా ఫిజికల్ డైరెక్టర్, బోటనీ బోధించడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవ కుమారి తెలిపారు. సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి పీజీలో 55% మార్కులు ఉండాలని చెప్పారు. ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తులను కళాశాలలో అందజేయాలన్నారు. ఆగస్టు 1న ఉదయం 10 గంటల నుంచి కాలేజీలోనే ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.

News July 30, 2024

పిఠాపురంలో రోడ్లపై వర్మ కీలక వ్యాఖ్యలు

image

పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. యర్నగూడెం-త్యాజంపూడి రహదారి విషయమై కాంట్రాక్టర్‌తో మాట్లాడానని చెప్పారు. రెండు రోజుల్లో గుంతలు పూడ్చే పనులు ప్రారంభిస్తామన్నారు. రాబోయే రోజుల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే వెళ్లాలని ఆకాంక్షించారు. జనసేన కోసం సీటును త్యాగం చేశారని వర్మకు నిన్న చేసిన సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News July 30, 2024

కోనసీమ: అప్రెంటిస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

కోనసీమ జిల్లా పరిధిలోని డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్లలో ఐటీఐ పాసైన అభ్యర్థులు APSRTCలో అప్రెంటిస్ కొరకు ఆగస్టు 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో www.apprenticeshipindia.gov.in వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు కోరారు. దరఖాస్తు చేసిన వారు ఆగస్టు 23వ తేదీ ఉదయం 10 గంటలకు విజయనగరం ఆఫీసులో హాజరు కావాలన్నారు.