EastGodavari

News January 4, 2025

రాజమండ్రికి మెగాస్టార్ చిరంజీవి..?

image

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ అభిమానుల్లో నెలకొంది. సా.6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్‌లో ఈవెంట్ ప్రారంభం కానుంది.

News January 4, 2025

కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

తూ.గో: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

జిల్లాలో 15 జూనియర్ కళాశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా మంత్రి దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.

News January 4, 2025

ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News January 3, 2025

రాజానగరం హైవేపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

రాజానగరం గైట్ కళాశాల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొర్రేడుకు చెందిన భరత్ చంద్ర (20) మృతి చెందాడు. స్నేహితుడి నాగేంద్రతో కలసి బైక్‌పై రాజానగరం నుంచి రాజమండ్రి వెళుతూ ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ హేండిల్ లారీకి తగిలి రోడ్డుపై పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో లారీ భరత్‌పై నుంచి వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. 

News January 3, 2025

రాజమండ్రి : ‘గేమ్ ఛేంజర్’ పాసుల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు

image

రాజమండ్రిలో జరగబోయే గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందడి చేసేందుకు మెగా ఫ్యాన్ రెడీ అవుతున్నారు. ఈవెంట్ పాసులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం లోకల్ లీడర్ల చుట్టూ మెగాభిమానులు, జనసైనికులు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అందరికీ పాస్‌లు అందించలేక నాయకులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.

News January 3, 2025

తూ.గో: నేడు మంత్రి అచ్చెనాయుడు జిల్లా పర్యటన 

image

రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి అచ్చం నాయుడు సామర్లకోట పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను సమాచార శాఖ విడుదల చేశారు. జనవరి మూడో తేదీన మంత్రి అచ్చం నాయుడు రావులపాలెం మీదుగా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి రానున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోటలో సహకార భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4:30కి కాకినాడ బయలుదేరి వెళ్తారు

News January 2, 2025

గండేపల్లి : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

గండేపల్లి మండలం మురారి వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో రాజమండ్రిలోని మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జగ్గంపేట వైపు నుంచి బైకుపై రాజమండ్రికి వెళ్తున్న వారు మురారి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో నవీన్ చంద్ అక్కడిక్కడే మృతి చెందగా, సంతోశ్ జీఎస్ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News January 2, 2025

నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత

image

నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.

News January 1, 2025

కడియం: 4న గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్

image

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మంగళవారం సాయంత్రం మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.