EastGodavari

News December 15, 2024

పది నిమిషాల్లో గమ్యం చేరుకుంటారనగా ప్రమాదం.. మృతి

image

చింతూరు మండలం వీరాపురం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తూ.గో జిల్లా రాజానగరం మండలానికి చెందిన చంద్రరావు(75) మృతి చెందిన సంగతి తెలిసిందే. పండ్ల వ్యాపారం చేసే చంద్రరావు తన భార్య, మనుమడితో కలిసి పండ్ల లోడ్ వ్యాన్‌తో చింతూరు మీదుగా కుంట బయలు దేరారు. మరో పది నిమిషాల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా వ్యాన్ బోల్తా పడి వృద్ధుడు మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య గుండెలవిసేలా విలపించారు.

News December 15, 2024

సంక్రాంతి సంబరం.. సరిగ్గా మరో నెల

image

సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ ఎట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లి వారి తిరిగి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.

News December 15, 2024

టెన్షన్.. టెన్షన్.. పులి ఎక్కడ?

image

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం బురదకోట రిజర్వ్‌ఫారెస్ట్‌లో కనిపించిన పులి జాడ ఇంకా లభ్యం కాలేదు. అధికారులు వారం రోజులుగా ట్రాప్ కెమెరాల ద్వారా గాలింపు చేస్తున్నా ఎక్కడా చిక్కలేదు. దీంతో పులి వేరే ప్రాంతానికి తరలి వెళ్లిందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీప ఏజెన్సీ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పులి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని అటవీశాఖ సిబ్బంది ప్రజలకు కోరారు.

News December 15, 2024

రాజమండ్రి: 16న యధావిధిగా పీజీఆర్ఎస్

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఈనెల 16న యధావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. జిల్లా ప్రజలందరూ గమనించాలని కలెక్టర్ సూచించారు.

News December 14, 2024

అమలాపురం: విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు: జేసీ 

image

విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు అని విద్యుత్ పొదుపుగా వాడి ఆధా చేస్తూ భావితరాలకు ఇంధన వనరులపై భరోసాను కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిషాంతి ప్రజలకు పిలుపు నిచ్చారు. శనివారం అమలాపురం కలెక్టరేట్ నుంచి గడియారపు స్తంభం వరకు నిర్వహించిన ఇంధన పొదుపు వారోత్సవాల ర్యాలీని జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్‌లో జండా ఊపి ప్రారంభించగా ట్రాన్స్‌కో సిబ్బంది ఇంధనాన్ని ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలని సూచించారు.

News December 14, 2024

కాకినాడ సిపోర్టు వద్ద మరో చెక్పోస్ట్ ఏర్పాటు

image

పేదల ఆహార భద్రత కోసం నిర్దేశించిన పీడీఎఫ్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యలలో భాగంగా కాకినాడ జిల్లాలో మరో చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ వద్ద మరో చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాకినాడ సిపోర్టు వద్ద లారీల రద్దీ ఎక్కువ ఉండకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.

News December 13, 2024

తూ.గో: ఆకట్టుకుంటున్న పసుపు రంగు సీతాఫలాలు

image

కడియం నర్సరీలలో పసుపు రంగు సీతాఫలాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. కడియంకు చెందిన నర్సరీ రైతు దుర్గారావు మూడేళ్ల క్రిందట థాయిలాండ్ నుంచి మొక్కను తెచ్చి ఇక్కడి వాతావరణానికి అనుగుణంగా పెంచి పోషించారు. రైతు దుర్గారావు మాట్లాడుతూ..ప్రస్తుతం మొక్క ఇప్పటికి పెద్దదై పూత పూసిందని సంవత్సరానికి రెండుసార్లు దిగుబడిని ఇస్తుందని, లోపల గుజ్జు ఎంతో రుచిగా ఉంటుందన్నారు. దీనితో పండ్ల ప్రేమికులు సందర్శిస్తున్నారు.

News December 13, 2024

రాజమండ్రి: హోంగార్డుతో అసభ్య ప్రవర్తన.. హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్

image

బొమ్మూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా హోంగార్డుతో హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్‌ మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిని గురువారం సస్పెండ్ చేశారు. SP నరసింహ కిషోర్ ఈ మేరకు అతనిపై చర్యలు తీసుకున్నారు. మద్యం మత్తులో హెచ్‌సీ విధి నిర్వహణలో ఉన్న మహిళా హోంగార్డుతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె భర్త ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

News December 13, 2024

రాజమండ్రి: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

image

రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని 2020లో జరిగిన ఓ హత్య కేసులో కోర్టు ముద్దాయికి జీవిత ఖైదు విధించింది. రాజమండ్రి రూరల్ కొంతమూరుకు చెందిన కనకదుర్గను హత్య చేసిన కేసులో నరసింహరాజును ముద్దాయిగా కోర్టు నిర్ధారించింది. సాక్షుల విచారణ అనంతరం జడ్జి విజయ్ గౌతమ్ ముద్దాయిపై నేరం రుజువు కావటంతో జీవిత ఖైదుతోపాటు, రూ.2 వేలు జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెల్లడించిందని పోలీసులు తెలిపారు.

News December 13, 2024

రైతులకు అండగా వైసీపీ పోరాటం: కన్నబాబు

image

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వారి తరఫున అండగా ఉండి వైసీపీ పోరాడుతుందని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు శుక్రవారం కాకినాడలో రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపడుతున్నామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.