EastGodavari

News July 3, 2024

మంత్రి కందుల దుర్గేశ్ నేటి పర్యటన షెడ్యూల్

image

రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్ తూ.గో జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రాజమండ్రిలో గోదావరి గట్టుపై ఉన్న ఎస్వీ రంగారావు విగ్రహం వద్ద, ధవళేశ్వరంలో జరిగే ఎస్వీ రంగారావు జయంతి వేడుకలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు విజ్జేశ్వరం, ఒంటి గంటకు కొండ గుంటూరులలో జరిగే ప్రైవేట్ కార్యక్రమంలో మంత్రి దుర్గేశ్ పాల్గొంటారు.

News July 3, 2024

నేడు అప్పనపల్లిలో చాగంటి ప్రవచనం

image

మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలోని శ్రీ బాలా బాలాజీ స్వామి వారి ఆలయంలో బుధవారం బ్రహ్మశ్రీ డా.చాగంటి కోటేశ్వరరావు గారితో వేంకటేశ్వర వైభవం ప్రవచనం ఏర్పాటు చేసినట్లు గ్రంధి మాధవి మంగళవారం తెలిపారు. సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ప్రవచనం జరుగుతుందన్నారు. వెంకటేశ్వర వైభవ్ అనే అంశంపై ప్రవచనం చేస్తారని తెలిపారు.

News July 2, 2024

డిప్యూటీ CM పవన్ ఆదేశాలు.. యువతి ఆచూకీ లభ్యం

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విజయవాడ పోలీసులు యువతి మిస్సింగ్ కేసును ఛేదించారు. దాదాపు 9నెలల తరువాత యువతి ఆచూకీ లభ్యమైంది. భీమవరానికి చెందిన శివకుమారి తమ కుమార్తె కనిపించడం లేదని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదు చేయడంతో విజయవాడ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఓ యువకుడితో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువస్తున్నారు.

News July 2, 2024

కలెక్టర్‌గా ‘హిమాన్షు శుక్లా’ మార్క్.. 2 వంతెనలకు ఆయన పేరు

image

అంబేడ్కర్ కోనసీమ కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా తనముద్ర వేసుకున్నారు. ఎంతలా అంటే.. జిల్లాలోని 2 వంతెనలకు ఆయన పేరు పెట్టుకునేంత. మామిడికుదురు-అప్పనపల్లిని కలిపే వంతెనకు ‘శుక్లా వారధి’ అని.. లుటుకుర్రు-పాశర్లపూడిని కలిపే వంతెనకు ‘హిమాన్షు శుక్లా రామసేతు’ అని ఆయా గ్రామ పంచాయతీలలో తీర్మానం చేసి నామకరణం చేసుకున్నారు. ఈ వంతెన నిర్మాణంలో హిమాన్షు శుక్లా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు.

News July 2, 2024

అంబేడ్కర్ కోనసీమ కొత్త కలెక్టర్‌గా మహేశ్ కుమార్

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రావిరాల మహేశ్ కుమార్ రానున్నారు. మహేశ్ కుమార్ ప్రస్తుతం APSWREIS సెక్రటరీగా పని చేస్తున్నారు. కాగా.. ఇక్కడి నుంచి బదిలీ అయిన హిమాన్షు శుక్లా పోస్టింగ్ గురించి మెన్షన్ చేయలేదు.

News July 2, 2024

తూ.గో: ఒక్క రోజు HM.. ఆపై రిటైర్

image

ఉమ్మడి తూ.గో జిల్లా రాజవొమ్మంగి మండలం బోర్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎంగా ఇమ్మానియేలు ఒక్క రోజు మాత్రమే పనిచేసి రిటైర్ అయ్యారు. స్కూల్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆయన పదోన్నతిపై హెచ్‌ఎంగా జూన్ 29న బోర్నగూడెం ఆశ్రమ పాఠశాలలో జాయిన్ అయ్యారు. జూన్ 30తో ఆయనకు 62 ఏళ్ల వయసు నిండటంతో పదవీ విరమణ చేశారు. తోటి ఉపాధ్యాయులు ఆయనను మంగళవారం ఘనంగా సన్మానించారు.

News July 2, 2024

కాకినాడలో 2వ రోజు డిప్యూటీ CM పవన్ షెడ్యూల్ ఇదే

image

కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ CM పవన్ షెడ్యూల్‌ని అధికారులు ప్రకటించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. 11 నుంచి 11:30 వరకు RWS అధికారులతో, 11:30 నుంచి 12గంటల వరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులతో, మధ్యాహ్నం 12 నుంచి 1వరకు అటవీ, 2గంటల వరకు రీజినల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులతో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు.

News July 2, 2024

రూ.10 లక్షల చెక్కు అందించిన డిప్యూటీ సీఎం పవన్

image

గొల్లప్రోలులో సోమవారం పెన్షన్ల పంపిణీ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూ.10 లక్షల బీమా చెక్కును లబ్ధిదారు చెక్క చిట్టితల్లికి అందించారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గ్రూప్ యాక్సిడెంట్ కార్డు పాలసీ ద్వారా బీమా పరిహారాన్ని అందజేశారు. పాలసీ తీసుకున్న వ్యక్తి కరెంటు స్తంభంపై పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా.. అతని భార్యకు బీమా చెక్కు అందించారు. తపాలా శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

News July 2, 2024

కాకినాడ: కరెంట్ షాక్.. డిగ్రీ స్టూడెంట్ మృతి

image

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఓ యువకుడు కరెంట్ షాక్‌తో చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. చొల్లంగి ఇందిరమ్మ కాలనీకి చెందిన పిల్లి వినయ్ (20) చిన్నాన్న నిర్మిస్తున్న ఇంటి వద్ద మోటార్ ఆన్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో తెగిపడిన విద్యుత్ తీగను చేత్తో పట్టుకోగా షాక్‌కు గురయ్యాడు. కాకినాడ GGHకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. వినయ్ డిగ్రీ ఫైనల్ ఈయర్ చదువుతున్నాడు. కేసు నమోదైంది.

News July 2, 2024

తూ.గో జిల్లాలో 95.87% పెన్షన్ పంపిణీ పూర్తి: కలెక్టర్

image

తూ.గో జిల్లాలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉ. 5 గంటల నుంచి ప్రారంభమైంది. 4,092 మంది ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ నగదు పంపిణీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. సాయంత్రం 7.30 గంటల వరకు 95.87 శాతం పెన్షన్ పంపిణీ పూర్తయ్యిందన్నారు.