India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తానని మాజీ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఆయన పర్యటన ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నాయకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ ఉభయ గోదావరి జిల్లా ప్రజలను కలుస్తారని చెప్పారు.
పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారు ఎగిరి పడ్డారు. ఇందులో నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు అదే రోజు లభ్యమయ్యాయైన విషయం తెలిసిందే. పోలీసులు మనోజ్ మృతదేహన్ని పోస్టుమార్టానికి తరలించారు.
పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతా వారి పేట వద్ద పంట కాలువలో గల్లంతైన బాలుడు మృతదేహం బుధవారం లభ్యమైంది. మంగళవారం ఉదయం గల్లంతైన మనోజ్ (5) మృతదేహం లభ్యం కావడంతో ముగ్గురు మృతదేహలు లభ్యమయ్యాయి. నేలపూడి ఉమ (31), పెద్ద కుమారుడు రోహిత్ (9) మృతదేహాలు మంగళవారం లభ్యమైన సంగతి విధితమే. విహారయాత్ర ముగించుకుని కారులో వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టనికి తరలించారు.
రాజానగరం మండలం చక్రద్వారబంధంలో బుధవారం సాయంత్రం ఎలక్ట్రికల్ బైక్ దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతు చిక్కాల రాఘవ ఏడాది క్రితం రాజమండ్రిలోని ఓ షోరూంలో ఎలక్ట్రికల్ బైక్ కొనుగోలు చేశారు. ఈక్రమంలో పొలం నుంచి ఇంటికి వస్తుండగా సీటు కింద ఉన్న బ్యాటరీ నుంచి శబ్దం వచ్చింది. ఆగి చూసేసరికి ఒక్కసారిగా మంటలు ఎగసి క్షణాల్లోనే కాలిబూడిదైందని బాధితుడు వాపోయారు.
రాజమండ్రి-ఢిల్లీ విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు ఎంపి పురందేశ్వరి గురువారం రాజమండ్రి విచ్చేస్తున్నారని రాజనగరం నియోజక వర్గ భాజపా కన్వినర్ నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు. వారి పర్యటనను విజయవంతం చేయాలని కూటమి నేతలను కోరారు. రాజమండ్రి నుంచి తిరుపతి, వారణాసి, షిర్డీకి కూడా విమాన సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పుష్ప పార్ట్-1, 2లతో పాన్ ఇండియా హిట్ అందుకున్న డైరెక్టర్ సుకుమార్ది మన జిల్లానే. ఆయన ఉమ్మడి తూ.గో.జిల్లా మలికిపురం మండలం మట్టపర్రు గ్రామంలో 1970లో జన్మించారు. చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి కనబరిచే వారు. ఉన్నత చదువులు చదివిన ఆయన మ్యాథ్స్ లెక్చరర్గా పనిచేశారు. 2004లో ఆర్య మూవీతో డైరెక్టర్గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హిట్లు అందుకున్నారు. ఇప్పటివరకు ఆయన 8 సినిమాలకు దర్శకత్వం వహించారు.
ప్రత్తిపాడు మండలం బురదకోట అటవీ ప్రాంతంలో పెద్ద పులి ఆచూకీ కోసం ఏలేశ్వరం ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ముమ్మరంగా గాలించారు. ఎంత వెతికినా పులి జాడ మాత్రం కనిపించలేదు. దాని కోసం 6 ట్రాప్ కెమెరాలను బురదకోట పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అనంతరం పులి ఆచూకీ తెలుసుకునేందుకు చేపట్టాల్సిన అంశాలపై రేంజర్ సమావేశం నిర్వహించి సిబ్బందికి సూచనలిచ్చారు.
మరో 5 కిలో మీటర్లు ప్రయాణించి ఉంటే ఇంటికి చేరుకునే వారు. అంతలో వారిని మృత్యువు కబళించింది. పి.గన్నవరం మండలం ఊడిమూడి వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో పోతవరానికి చెందిన విజయ్ కుమార్ భార్య, కుమారుడు మృతి చెందగా.. మరొక కుమారుడు గల్లంతయ్యారు. దీంతో విజయ్ కుమార్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాపిల్లలను కోల్పోయానని అతడు మృతదేహాల వద్ద రోధించిన తీరు అందరినీ కలచివేసింది.
టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీలతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను మంగళవారం కలిశామని అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ తెలిపారు. రైల్వే అభివృద్ధికి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. కోనసీమ జిల్లాలో రైల్వే ప్రాజెక్టు కోసం లేఖ అందజేశామని, దివంగత నేత బాలయోగి హయాంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
టీడీపీలో బీసీలకు నిజంగా అన్యాయం జరుగుతుందని, బీసీ కులాల గొంతు నొక్కిన చంద్రబాబు చరిత్రలో బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తిగా మిగిలిపోతారని జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభ సీట్ల కేటాయింపులో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు. ఈనెల 13న రైతులకు అండగా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.