India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెనాలి మండలంలోని పెదరావూరులో గంజాయి విక్రయిస్తున్న 9మంది ని రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు తెనాలి డీఎస్పీ బి. జనార్దనరావు తెలిపారు. బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వల్లంగి విజయ్, తెనాలికి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సమాచారంతో పోలీసులు మాటు వేసి వారి వద్ద ఉన్న 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అని సూచనలు చేశారు.

గుంటూరు మండలం వెంగలయపాలెంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన యువకుడు ఆంజనేయులుపై జరిగిన దాడి ఘటనపై బాధితుడు గుంటూరు SPకి ఫిర్యాదు చేశాడు. అదే కాలనీకి చెందిన యర్రంశెట్టి రవితేజ, గణేష్, ఈపూరి రామకృష్ణ, మణికంఠ, నరేంద్రలు కత్తులు, ఇనుప రాడ్లతో ఇంటిపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశాడు. నిందితులపై చర్యలు తీసుకుని, రక్షణ కల్పించాలని కోరాడు.

రూ.7.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.25 వేల నగదు చోరీ జరిగిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు అరండల్ పేట పోలీసులు తెలిపారు. కాకుమానువారితోటకు చెందిన స్వీట్ షాపు నిర్వాహకుడు సాయిపవన్ కుమార్ ఇంట్లో ఈ నెల 29న రాత్రి నిద్రిస్తున్న సమయంలో చోరీ జరిగిందన్నారు. ఉదయం చూసే సరికి ఇల్లంతా చెల్లాచెదురుగా ఉంది. అనుమానంతో ఇంట్లో పరిశీలించగా నగలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడన్నారు.

తుళ్లూరు మండలం రాయపూడి CRDA కేంద్ర కార్యాలయంలో శుక్రవారం AP CRDAతో బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిట్స్ సంస్థకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో భూమి కేటాయించింది. అమరావతిలో 70.011 ఎకరాలలో బిట్స్ పిలానీ యూనివర్సిటీ తన క్యాంపస్ ఏర్పాటు చేయనుందన్నారు.

గుంటూరు పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు జిల్లా యంత్రాంగం స్వాగతం పలికింది. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్ ద్వారా గుంటూరు చేరుకున్న సీఎంకు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో కలెక్టర్ అన్సారియా పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానం పలికారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల గురించి సీఎం ఆరా తీశారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అధికార యంత్రాంగం సమష్టిగా పనిచేయాలని కలెక్టర్కు సీఎం సూచించారు.

టీడీపీ క్యాడర్ సమన్వయంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శుక్రవారం, టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన టౌన్, వార్డు, మండల స్థాయి టీడీపీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం నిర్వహించిన 11వ శిక్షణ తరగతుల్లో మంత్రి పాల్గొన్నారు. కూటమి నాయకుల మధ్య సఖ్యత ముఖ్యమని, కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం ప్రారంభించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో క్రాఫ్ రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు.

జీజీహెచ్లో మాతా–శిశు సంరక్షణ ఏళ్ల తరబడి సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ పరిస్థితిని గమనించిన కానూరి జింకానా సభ్యులు ముందుకొచ్చి రూ.100 కోట్లతో సెల్లార్, జీ+5 అంతస్తుల్లో 597 పడకలతో ఆధునాతన భవనం నిర్మించారు. డా. గవిని ఉమాదేవి రూ.22 కోట్లు విరాళంగా అందించగా, ప్రభుత్వం రూ.27 కోట్ల పరికరాలు సమకూర్చింది. మొత్తం రూ.132 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.

గుంటూరు జిల్లా సాయుధ దళ (AR) సిబ్బందికి వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. పోలీసుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆయుధ వినియోగంలో నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ జిందాల్ పేర్కొన్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వీవీఐపీ భద్రత, బందోబస్తు నిర్వహణ ప్రజలతో నడుచుకోవాల్సిన తీరుపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.

దేశంకోసం సాయుధ దళాలు చేస్తున్న సేవలు, త్యాగాలు ఎనలేనివని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. NGO కల్యాణ మండపంలో జరిగిన 10వ సాయుధ దళాల వెటరన్స్ డే కార్యక్రమంలో మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులను కలెక్టర్ సత్కరించారు. సాయుధదళాలు సరిహద్దుల్లో కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నందు వలనే దేశ ప్రజలంతా ప్రశాంతంగా ఉంటున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.