India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రైల్ వన్ యాప్ వినియోగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రోత్సాహకం ప్రకటించింది. యాప్ ద్వారా కొనుగోలు చేసే జనరల్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు ఇస్తామని సీపీఆర్వో ఏ.శ్రీధర్ గుంటూరులో మంగళవారం వెల్లడించారు. ఆన్లైన్ చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్నారు.

సంక్రాంతి సెలవుల అనంతరం స్వగ్రామాల నుంచి తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. 18న విశాఖపట్టణం నుంచి చర్లపల్లి వరకు ప్రత్యేక రైలు(08513) రాత్రి బయలుదేరి గుంటూరు మీదుగా గమ్యానికి చేరుతుంది. అలాగే 19న చర్లపల్లి నుంచి విశాఖపట్టణానికి మరో ప్రత్యేక రైలు(08514) నడుస్తుంది. పండగ రద్దీని తగ్గించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిని గుర్తించి, వారి ఫోన్లకు వాట్సాప్ హెచ్చరికలు పంపిస్తోంది. రహదారి భద్రత సూచనగా పంపిన ఈ సందేశాల్లో నో హెల్మెట్ ఉల్లంఘనను చివరి హెచ్చరికగా పేర్కొంటూ, మళ్లీ కొనసాగితే జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది.

దొడ్డపనేని ఇందిర మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె 1937 జనవరి 7న తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నై బీఎస్సీ (హోం సైన్స్)లో డిగ్రీ తీసుకున్నారు. తెనాలి నుంచి మూడు సార్లు (1967, 1972, 1978) ఎమ్మెల్యేగా గెలిచారు. 1987లో గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె పేరుతో తెనాలిలో పాఠశాల ఏర్పాటు చేశారు.

గుంటూరులో అగ్నివీర్ సైనిక నియామక ప్రక్రియను వచ్చే ఫిబ్రవరి 17-27 మధ్య నిర్వహించనున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కేంద్రంగా చేసుకుని పదిరోజులకు పైగా ర్యాలీ కొనసాగనుంది. ఏపీ, తెలంగాణకు చెందిన అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చు. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీ జరగనుండగా, దశలవారీగా శారీరక, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ముందస్తుగా ఆన్లైన్ నమోదు పూర్తి చేయాలి.

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GBడేటా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అమరావతిలో తొలిసారి భూసేకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి పూలింగ్కు ఇవ్వని సుమారు 4.5 ఎకరాల భూమిని భూ సేకరణ ద్వారా తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బుధవారం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఫిబ్రవరి చివరి నుంచి స్టీల్ బ్రిడ్జీ అందుబాటులోకి రానుండటంతో ప్రజలకు కనెక్టివిటీ అందించేందుకు భూ సేకరణ చేపడుతున్నామని మంత్రి నారాయణ ఇప్పటికే తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్స్, అధికారులతో మంత్రి సమావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజన్లో మిర్చి యార్డ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మిర్చి ధరలు పతనమవ్వకుండా అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రి చర్చించనున్నారు.

ఈ నెల 8 నుంచి గుంటూరు వేదికగా జరగనున్న సరస్ (సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన, అమ్మకంతో గుంటూరు మిర్చి ఘాటు మరింత బలంగా తాకనుంది. గుంటూరులో మొదటిసారిగా ఈ ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మిర్చికి ప్రసిద్ది కావడంతో సరస్ కార్యక్రమానికి ‘మిర్చి మస్కట్’ రూపొందించారు. ఈ మస్కట్ కి ‘సరస్ అక్క’ అని నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రదర్శన ప్రారంభించనున్నారు.
Sorry, no posts matched your criteria.