Guntur

News May 7, 2025

ఏఈపీఎస్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ఏఈపీఎస్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలతో నగదు దోచుకునే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. మోసాల నుంచి రక్షణ కోసం ఎంఆధార్ యాప్‌ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేయాలన్నారు. అవసరమైనప్పుడు మాత్రమే అన్లాక్ చేసి, వెంటనే మళ్లీ లాక్ చేయాలని, ఇటీవలి కాలంలో వేలిముద్రలు వినియోగించిన చోట్ల డీలింక్ చేయాలన్నారు. మోసానికి గురైతే 1930కు సమాచారం ఇవ్వాలన్నారు.

News May 7, 2025

పాకిస్థాన్ వీసాలతో ఉన్నవారు వెంటనే వెళ్లిపోవాలి: ఎస్పీ 

image

గుంటూరు జిల్లాలో పాకిస్థాన్ వీసాలతో ఉన్న పౌరులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోవాలని ఎస్పీ సతీశ్ కుమార్ అన్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఎవరైనా అక్రమంగా నివసిస్తుంటే అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. అటువంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన వారిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.  

News May 7, 2025

GNT: నేడు ఎస్పీ కార్యాలయంలో వాహనాల వేలం 

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పాత వాహనాల పరికరాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాడిన పరికరాలు వేలంలో ఉంచుతున్నామన్నారు.

News May 7, 2025

రాజధానిలో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచండి

image

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

News May 7, 2025

రాజధానిలో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచండి

image

అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

News May 7, 2025

నేడు రాజధాని ప్రాంతంలో సీపీఎం పర్యటన 

image

రాజధాని ప్రాంతంలో శనివారం CPM సీనియర్ నేత బాబురావు ఆయన బృందంతో పర్యటించనున్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించి ఎంత మేరకు నిర్మాణాలు జరిగాయని మీడియాతో మాట్లాడనున్నట్లు CPM నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో CPM ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

News May 7, 2025

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ 

image

ఈనెల 28వ తేదీన రాజధాని ప్రాంతంలోని వృత్తి యూనివర్సిటీకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు VIT విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేయనున్న మహాత్మా గాంధీ బ్లాక్‌ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తేజ, తదితరులు పాల్గొన్నారు.  

News May 7, 2025

GNT: ప్రధాని పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు

image

ప్రధాని మే 2న రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు అధికారులు పరిశీలించారు. పార్కింగ్, వీఐపీ పార్కింగ్ వద్ద బారీకేట్స్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి.సతీశ్ కుమార్, సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ మల్లిఖార్జున, ఎండీ మెప్మా తేజ్ భరత్, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్, తదితరులు ఉన్నారు.

News May 7, 2025

గుంటూరు: నిరాశపరిచిన CSK ఓపెనర్ రషీద్ 

image

చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్, గుంటూరు మిర్చి షేక్.రషీద్ (0) నేటి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా శుక్రవారం CSK-SRH జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఓపెనర్ బరిలో దిగిన రషీద్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు. 

News May 7, 2025

గుంటూరు: ప్రధాని మోదీ పర్యటనకు సుందర శోభ 

image

మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీ మార్గాలపై ఆకర్షణీయంగా తబలా ఆకారంలో పూల కుండీలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడీసీ ఛైర్‌పర్సన్ డి. లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో గ్రీనరీ విభాగం అధికారుల నేతృత్వంలో ఈ పనులు పూర్తయ్యాయి. పూల కుండీలు మార్గాన్ని మరింత అందంగా మార్చుతూ, మోదీ పర్యటనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.