India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు బుధవారం గుంటూరులో పర్యటించనున్నారు. చుట్టుగుంటలోని వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మిర్చి వ్యాపారులు, కమీషన్ ఏజెంట్స్, అధికారులతో మంత్రి సమావేశం అవుతారు. రాబోవు మిర్చి సీజన్లో మిర్చి యార్డ్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, మిర్చి ధరలు పతనమవ్వకుండా అనుసరించాల్సిన విధివిధానాలపై మంత్రి చర్చించనున్నారు.

ఈ నెల 8 నుంచి గుంటూరు వేదికగా జరగనున్న సరస్ (సేల్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన, అమ్మకంతో గుంటూరు మిర్చి ఘాటు మరింత బలంగా తాకనుంది. గుంటూరులో మొదటిసారిగా ఈ ప్రదర్శన, అమ్మకాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లా మిర్చికి ప్రసిద్ది కావడంతో సరస్ కార్యక్రమానికి ‘మిర్చి మస్కట్’ రూపొందించారు. ఈ మస్కట్ కి ‘సరస్ అక్క’ అని నామకరణం చేశారు. సీఎం చంద్రబాబు ఈ ప్రదర్శన ప్రారంభించనున్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్న బీపీఈడీ, డీపీఈడీ, ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 20 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 21వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరగనున్న బీ ఫార్మసీ నాలుగో సంవత్సరం 7వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు షెడ్యూల్ వర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి శివ ప్రసాదరావు విడుదల చేశారు. సంబంధిత పరీక్ష ఫీజు ఈనెల 22 తేదీలోగా, అపరాధ రుసుం రూ.100తో ఈనెల 23వ తేదీన చెల్లించాలన్నారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్ www.Nagarjuna University.ac.in పొందవచ్చన్నారు.

తెనాలి వహాబ్ చౌక్లో ఉద్రిక్తత నెలకొంది. డివైడర్ మధ్యలో ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ప్రయత్నించడంతో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీగా వహాబ్ చేరుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కుట్రపూరితంగా ఫ్లెక్సీలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు.

జిల్లాలో SC, ST, BC, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ‘స్వీకారం’ పేరుతో కలెక్టర్ తమీమ్ అన్సారియా శ్రీకారం చుట్టారు. ప్రతీ వసతి గృహం ‘సంపూర్ణ ప్రగతికి చిహ్నంగా, చిన్నారుల మానసిక వికాసానికి ప్రేరణగా’ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ వర్గాల సంస్థలతో తమీమ్ అన్సారియా మంగళవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణ పనులు ఇతర విషయాలపై CRDA అథారిటీతో CM చంద్రబాబు మంగళవారం సమావేశం కానున్నారు. ముందుగా మంత్రి నారాయణ CRDA అధికారులతో సమీక్ష నిర్వహించి, మధ్యాహ్నం 2:30 నిమిషాలకు సచివాలయంలో జరిగే అథారిటీ సమావేశంలో చర్చించనున్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు అమరావతి రైతుల సమస్యల త్రిసభ్య కమిటీతో CM భేటి కానున్నారు. సాయంత్రం 4 గంటలకు తీసుకున్న నిర్ణయాలు మంత్రి నారాయణ వెల్లడిస్తారు.

తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 7 ఫిర్యాదులు వచ్చాయి. సబ్ కలెక్టర్ సంజనా సింహ వేరే అధికారిక కార్యక్రమానికి వెళ్లడంతో కార్యాలయ అధికారులే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 1, మున్సిపాలిటీ 2, దేవాదాయ శాఖ 1, పంచాయతీ రాజ్ విభాగానికి 3 అర్జీలు చొప్పున మొత్తం 7 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని ఆయా విభాగాలకు పంపి పరిష్కరిస్తామని తెలియజేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10:35 గంటలకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచ్యువల్ సిటీకి చేరుకుంటారు. అక్కడ 10:45 గంటలకు జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు సచివాలయానికి వస్తారు. సాయంత్రం 4:30 గంటలకు ఆర్టీజీఎస్పై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గుంటూరు రానున్నారు. ఉదయం 10:25 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకుంటారు. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 ని.లకు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు బందోబస్త్ ఏర్పాట్లు చేశారు.
Sorry, no posts matched your criteria.