Guntur

News November 17, 2024

విద్యార్థిని ఆత్మహత్యపై నివేదిక కోరిన బాలల హక్కుల కమిషన్

image

నరసరావుపేట భావన కళాశాల ఇంటర్ విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఆదివారం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి నివేదికను కోరారు. పోలీస్ శాఖ, విద్యాశాఖ సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను తక్షణమే పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దురదృష్టకరమైన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసి తల్లిదండ్రులకు సానుభూతి తెలిపారు.

News November 17, 2024

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు.. శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి శ్రీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి జ్యోతి శ్రీరెడ్డిపై నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు శ్రీరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వీరనాయక్ చెప్పారు. 

News November 17, 2024

ప్రభుత్వంలోని మంచి, చెడులను వెలికి తీయాలి: మంత్రి

image

మంగళగిరి: జర్నలిస్టులు ప్రభుత్వంలో జరుగుతున్న మంచి, చెడులను విచక్షణారహితంగా వెలుగులోకి తీసుకురావాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. సీనియర్ జర్నలిస్ట్ రచయిత ఈపురి రాజారత్నం రచించిన ‘జర్నలిజం జర్నలిస్టుల బేసిక్స్’ పుస్తకాన్ని ఆయన శనివారం సచివాలయంలో ఆవిష్కరించారు. పలువురు జర్నలిస్టులు మస్తాన్ రావు, బత్తుల సాంబశివరావు, ఎస్‌కె రఫీ పాల్గొన్నారు.

News November 16, 2024

గుంటూరు: జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

image

గుంటూరు నగర శివారు నల్లపాడు స్టేషన్ పరిధిలోని బుడంపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మరమ్మతులకు గురైన కార్ల కంటైనర్‌ను ప్లేవుడ్ లోడ్‌తో వెళ్తున్న లారీ, ప్లేవుడ్ లోడ్ లారీని ఐచర్ లారీ ఢీకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 16, 2024

రెంటచింతల: కృష్ణా నదిలో దంపతులు గల్లంతు

image

కృష్ణానదిలో కార్తీక స్నానం చేయడానికి వెళ్లిన దంపతులు గల్లంతైన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన నీలా సత్యనారాయణ, పద్మావతిలు శనివారం కార్తీక స్నానమాచరించడానికి సత్రశాల వెళ్లినట్లు వారి బంధువులు తెలిపారు. భార్య పద్మావతి నీటిలోకి జారిపోవడంతో ఆమెను కాపాడేందుకు భర్త వెళ్లాడన్నారు. జాలర్లు పద్మావతి మృతదేహాన్ని వెలికి తీశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

News November 16, 2024

మరోసారి పోలీస్ కస్టడీలోకి బోరుగడ్డ అనిల్

image

గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. ఏలూరు జిల్లా, వెలూరుపాలెం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి రెండు రోజులు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. ఇప్పటికే గుంటూరులోని ఓ చర్చి కోశాధికారిని డబ్బులు డిమాండ్ చేసి బెదిరించిన కేసులో అనిల్ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా ఏలూరు పోలీసులు జైలుకు చేరుకొని అక్కడి నుంచి ఆయనను కస్టడీకి తీసుకున్నారు. 

News November 15, 2024

సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాం: లావు

image

వ్యవసాయంపై ఆధారపడిన వానిలో గోదావరి, పెన్నా ముఖ్యమైన ప్రాజెక్టులని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ప్రాజెక్టుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై మాట్లాడామని చెప్పారు. ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై విదేశాంగశాఖ మంత్రితో సీఎం చర్చించారని, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామన్నారు.

News November 15, 2024

రేపు ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభం: మంత్రి

image

బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా శనివారం నుంచి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 2 నెలలపాటు జరిగే శిక్షణలో నెలకు రూ.1500ల చొప్పున స్టైఫండ్, పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. 

News November 15, 2024

మంత్రి నారా లోకే‌శ్‌కు అంబటి కౌంటర్

image

గత ప్రభుత్వ హయాంలో శాసనసభలో తన తల్లిని అవమానించారని, అందుకే చంద్రబాబు శాసనసభను బహిష్కరించారని అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు మాజీమంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. నిన్న శాసనసభలో లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ‘X’లో స్పందించారు. శాసనసభలో లోకేశ్ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే తాను బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తానని పేర్కొన్నారు.

News November 15, 2024

రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై సబ్ కమిటీ

image

రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై ప్రభుత్వం సబ్ కమిటీ నియమించింది. గతంలో పలు సంస్థలకు చేసిన భూకేటాయింపులు పరిశీలన, కొత్తగా సంస్థలకు కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం కమిటీ చర్చించనుంది. సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యా రాణి, కందుల దుర్గేశ్, టీజీ భరత్ ఉన్నారు. ఈ కమిటీని నేడు వెలగపూడి సచివాలయంలో భేటీ కానుంది.