India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 13వ తేదీన తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. దీంతో అక్కడ పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఎస్పీ తుషార్, సబ్ కలెక్టర్ ప్రకార్ జైన్లతో కలిసి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. గట్టి భద్రత ఏర్పాట్లతోపాటు వాహనాల పార్కింగ్, బారికేట్లు ఏర్పాటు చేయాలన్నారు.
మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
మంగళగిరిలోని కొలనుకొండకు సీఎం చంద్రబాబు శనివారం రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో సీఎం సమీక్ష నిర్వహిస్తారని వివరించారు. శనివారం ఉదయం 9.30 గంటలకు మంగళగిరి చేరుకోనున్నారు. దీంతో పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.
ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్ హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లనున్నట్లు మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ పెళ్లి వేడుకకు పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
పిడుగురాళ్లలోని లెనిన్నగర్, మారుతీనగర్ ప్రజలు అతిసార లక్షణాలతో 10రోజులుగా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. తొలిరోజు 25మంది ఆస్పత్రుల్లో చేరగా..బాధితుల సంఖ్య పెరుగుతోంది. కాగా, దీనికి మూలకారణమేంటో తెలియరాలేదు. గురువారం పట్టణంలో పర్యటించిన మంత్రి నారాయణకూ అధికారులు కారణాలు చెప్పలేకపోయారని తెలుస్తోంది. కుళాయి నీరు కలుషితం అయిందని, నీటిని పరీక్ష కోసం విజయవాడకు పంపినట్లు అధికారులు చెబుతున్నారు.
గడిచిన 5రోజుల్లో నల్లపాడు పీఎస్కు నలుగురు CIలు మారారు. నల్లపాడు CIగా పనిచేస్తున్న నరేశ్ కుమార్ తొలుత సెలవుపై వెళ్లడంతో CI వెంకన్నచౌదరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. మరుసటి రోజు నరేశ్ సెలవుల నుంచి వచ్చి విధుల్లో చేరగా, సాయంత్రానికి ఆయన్ను VRకి పంపారు. ఎస్సై సత్యనారాయణకు గురువారం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. సాయంత్రానికి ఒంగోలు SEBలో చేస్తున్న వంశీధర్కు CIగా పూర్తి బాధ్యతలు అప్పజెప్పారు.
గుంటూరు మార్కెట్ యార్డుకు గురువారం 26,349 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 27,246 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334. సూపర్ 5, 273, 341, 4884, ఆర్-10 రకాల మిర్చి సగటు ధర రూ.8,000 నుంచి రూ.17,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ.18,500 వరకు లభించింది.
గుంటూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనపై గురువారం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 10వ తేదీ రాత్రి నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్లో నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తి తలకు, కంటికి తీవ్ర గాయాలై మృతి చెందారని పోలీసులు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి, తాడేపల్లిలోని పంచాయితీ రాజ్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పవన్ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తొలిసారి ఈ సమావేశం జరగనుంది.
*గుంటూరులో సందడి చేసిన సినీనటి
*అమరావతి శివాలయ పూజారికి నోటీసులు
*జగన్నాథ రథయాత్రలో చీపురు పట్టిన నారా లోకేశ్
*ANU: 4 సెమిస్టర్ ఫలితాలు విడుదల
*కొల్లూరు: గ్యాస్ స్టవ్ పేలి వృద్ధురాలికి గాయాలు
*మంగళగిరి TDP ఆఫీసుపై దాడి కేసు.. YCP నేతలకు బిగ్ రిలీఫ్
*డయేరియాపై పిడుగురాళ్లలో మంత్రి క్షేత్రస్థాయి పర్యటన
Sorry, no posts matched your criteria.