India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నగరం మండలం చిన్నమట్లపూడి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యకు అక్రమ సంబంధమే కారణమని తెలుస్తుంది. గ్రామానికి చెందిన ఒక మహిళతో నాగరాజు అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని ఆ కారణంంతోనే మహిళ భర్త నాగరాజును హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తన భర్త నాగరాజు హత్యకు సాంబయ్య కారణమంటూ నాగరాజు భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపల్లె రూరల్ సీఐ సురేశ్ బాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

బాపట్ల జిల్లా నగరం మండలం చిన్నమట్లపూడిలో బుధవారం అర్ధరాత్రి నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన లుక్క నాగరాజు (43)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నాగరాజు భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రేపల్లె గ్రామీణ సీఐ సురేశ్ బాబు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లిక హత్య కేసులో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మల్లిక ఓ వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెహమాన్తో వివాహేతర సంబంధం, మరొకరితో సహజీవనం చేసేది. దీంతో మల్లికను దక్కించుకోవాలనే ఉద్దేశంతో రెహమాన్ వశీకరణ చేయాలనుకున్నాడు. ఈ మేరకు డిల్లీకి చెందిన వ్యక్తితో రూ.3 లక్షలకు మాట్లాడుకొని దుస్తులు, జుట్టు, ఇతర వస్తువులు తెచ్చిచేశాడు. ఫలితం లేకపోవడంతో హత్య చేయించాడు.

నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారని తెలిపాయి.

నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారని తెలిపాయి.

భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూతన సంవత్సరం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

వివాహిత షేక్ మల్లిక(29) హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వివరాల ప్రకారం.. పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లికకు అక్బర్తో 15ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను, పిల్లలను వదిలేసి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెహమాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మరో యువకుడితో కూడా సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో రెహమాన్ ఆమెను చంపించాడు.

వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Sorry, no posts matched your criteria.