India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫిర్యాదు దారుని సమస్యలపట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ మలికా గార్గ్ ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం ప్రజలు వినతి పత్రాలను అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.
మాచర్ల మండలం ఏకనాంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్యాటక శాఖ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న రామారావు(45) బైక్ మీద వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో ఆయన మృతిచెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. కొల్లిపర, మున్నంగి, గుండిమెడ, తాళ్లాయపాలెం, లింగాయపాలెంలో ఇసుక నిల్వలు ఉండగా.. టన్ను ధర రూ.250గా నిర్ణయించారు. వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేసి ఇసుక పొందవచ్చని జిల్లా అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 0863-2234301కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
మాచర్ల YCP మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సోమవారం నుంచి పోలీసులు విచారించనున్నారు. పోలింగ్ రోజు పాల్వాయిగేట్లో ఈవీఎం ధ్వంసం, TDP ఏజెంట్ శేషగిరిరావుపై దాడి, కారంపూడిలో అల్లర్లు, సీఐ నారాయణస్వామిపై దాడికి సంబంధించి ఆయన్ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు (8, 9 తేదీల్లో) నెల్లూరు జైలులోనే ఆయన విచారణ జరగనుంది. విచారించేటప్పుడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
ఖరీఫ్ సీజన్ రావడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇదే తరుణంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా షాపుల నిర్వాహకులు మోసాలకు పాల్పడకుండా వ్యవసాయశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఎరువులు విత్తనాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, విత్తన ఎరువుల దుకాణాలపై నిరంతరం నిఘా ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి తెలిపారు.
గుంటూరు జిల్లాలో ఒక టన్ను ఇసుక రూ.250లకు లభిస్తుందని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 5 స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అందుబాటులో ఉందని ఆమె వెల్లడించారు. వినియోగదారులు ఆధార్ కార్డును చూపించి ఇసుకను పొందాలని సూచించారు. అయితే రోజుకి 20 టన్నులు మాత్రమే ఒక్కో వినియోగదారుడికి అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య వైఫల్యాలపై నిరంతరం యుద్ధం చేసి ప్రజా విజయానికి కృషి చేసిన అక్షరయోధులు రామోజీరావు అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఆదివారం గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో అక్షరయోధులు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు.
దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం ఉదయం నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు పొలాలకు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అగ్నివీర్ భారత వాయు సేనలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని.. 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3వ తేదీ మధ్యలో జన్మించిన వారే అర్హులన్నారు. భారత సైన్యంలో చేరాలనుకునే యువకులు ” https://agnipathvayu.cdac.in ” వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్వే నిర్మిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా ORR వెళ్లనుంది.
Sorry, no posts matched your criteria.