India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఉన్న పాత వాహనాల పరికరాలను శనివారం సాయంత్రం 4 గంటల నుంచి వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కార్యాలయం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాడిన పరికరాలు వేలంలో ఉంచుతున్నామన్నారు.
అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
అమరావతి రాజధాని ప్రాంతానికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలని అమరావతి ప్రాంత ప్రజలు కోరుతున్నారు. పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఎంతోమంది కార్మికులతో పాటు గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తున్నారని, వారి కదలికలపై ఇంటిలిజెన్స్, పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పక్కనే ఉన్న విజయవాడలో ఉగ్ర కదలికలపై కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
రాజధాని ప్రాంతంలో శనివారం CPM సీనియర్ నేత బాబురావు ఆయన బృందంతో పర్యటించనున్నారు. అమరావతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించిన భూములను పరిశీలించి ఎంత మేరకు నిర్మాణాలు జరిగాయని మీడియాతో మాట్లాడనున్నట్లు CPM నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా మే నెల 2వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో CPM ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈనెల 28వ తేదీన రాజధాని ప్రాంతంలోని వృత్తి యూనివర్సిటీకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు VIT విశ్వవిద్యాలయంలో ప్రారంభోత్సవం చేయనున్న మహాత్మా గాంధీ బ్లాక్ను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తేజ, తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మే 2న రాజధాని అమరావతికి రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లను శుక్రవారం పలువురు అధికారులు పరిశీలించారు. పార్కింగ్, వీఐపీ పార్కింగ్ వద్ద బారీకేట్స్, హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు. మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జి.సతీశ్ కుమార్, సెక్రెటరీ బీసీ వెల్ఫేర్ మల్లిఖార్జున, ఎండీ మెప్మా తేజ్ భరత్, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ, ఎస్పీ సతీశ్ కుమార్, తదితరులు ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్ మెన్, గుంటూరు మిర్చి షేక్.రషీద్ (0) నేటి మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఎంఏ చిదంబరం స్టేడియం (చెన్నై) వేదికగా శుక్రవారం CSK-SRH జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో ఓపెనర్ బరిలో దిగిన రషీద్ మహ్మద్ షమీ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే క్యాచ్ ఇచ్చి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు తీవ్రనిరాశకు గురయ్యారు.
మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్న నేపథ్యంలో, గన్నవరం విమానాశ్రయం నుంచి వీఐపీ మార్గాలపై ఆకర్షణీయంగా తబలా ఆకారంలో పూల కుండీలను అమరావతి అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసింది. ఏడీసీ ఛైర్పర్సన్ డి. లక్ష్మీపార్థసారథి ఆదేశాలతో గ్రీనరీ విభాగం అధికారుల నేతృత్వంలో ఈ పనులు పూర్తయ్యాయి. పూల కుండీలు మార్గాన్ని మరింత అందంగా మార్చుతూ, మోదీ పర్యటనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
పదో తరగతి ఫలితాలు దిగజారడానికి చంద్రబాబు ప్రభుత్వమే కారణమని వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఓ ప్రకటనలో ఆరోపించారు. అమ్మ ఒడి రద్దు, ప్రభుత్వ పాఠశాలలపై నిర్లక్ష్యం, ఇంగ్లిష్ మీడియంపై కక్ష, ఉపాధ్యాయుల తొలగింపు వంటి నిర్ణయాలే ఫలితాలు తగ్గడానికి కారణమని ఆయన విమర్శించారు. జగన్ హయాంలో విద్యా సంస్కరణలు, అమ్మ ఒడి వంటి పథకాలతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ కాపు సంక్షేమ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా DSC 2025 ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల కోసం కాపు, బలిజ, తెలగ, ఒంటరి వర్గాల అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణ అందించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 28గా ప్రకటించారు. ఆసక్తి కలిగిన వారు https://mdfc.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.