Guntur

News September 27, 2024

నరసారావుపేటలో యువతులతో వ్యభిచారం

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు యువతులను నరసారావుపేట పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నరసరావుపేట మండలం లలితాదేవి కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు యువతులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 27, 2024

రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు.. నోటీసులు ధర్మమా?: అంబటి

image

మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, అరెస్టులు చేయడం ధర్మమా అని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. శుక్రవారం ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి తిరుమల బయల్దేరనున్న జగన్.. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News September 27, 2024

ఈనెల 30న ANUకు వెంకయ్యనాయుడు

image

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈనెల 30న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి రానున్నారు. పద్మవిభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంత్యుత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రమంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనో హర్, స్థానిక శాసనసభ్యులు దూళిపాళ్ల నరేంద్ర ఈ సభలో పాల్గొననున్నారు. సభ నిర్వహణకు ఇన్చార్జ్ వీసీ ఆచార్య గంగాధర్ 8 కమిటీలను నియమించారు.

News September 27, 2024

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ ఇదే..

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. ఉండవల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు బయలుదేరి 12 గంటలకు వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా ఐటీ పాలసీపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. సాయంత్రం 6:30 గంటలకు విజయవాడలో జరిగే వరల్డ్ టూరిజం డే కార్యక్రమంలో పాల్గొంటారు.

News September 27, 2024

నేడు తాడేపల్లి నుంచి తిరుమలకు జగన్.. షెడ్యూల్ ఇదే.!

image

వైసీపీ అధినేత YS జగన్ శుక్రవారం మధ్యాహ్నం 3.20 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి 4.50 గంటలకు రేణిగుంటకు విమానంలో చేరుకుంటారని ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సాయంత్రం 5 గంటలకు తిరుమల చేరుకొని, 28వ తేదీన స్వామివారిని దర్శించుకుంటారని పేర్కొంది. అనంతరం బెంగుళూరులోని నివాసానికి జగన్ చేరుకుంటారని సమాచారం వెలువడింది.

News September 27, 2024

గుంటూరులో 29న మోడల్ టెట్ పరీక్ష

image

ఈ నెల 29న మోడల్ టెట్ నిర్వహిస్తున్నట్లు యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (UYWO) జిల్లా అధ్యక్షుడు పి.బాలకృష్ణ వెల్లడించారు. గుంటూరు బ్రాడీపేట 2/11లోని కాంపిటీషన్ సక్సెస్ కాలేజీలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పేపర్ – 1, పేపర్ – 2 ద్వారా రాష్ట్రస్థాయిలో మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News September 27, 2024

రేపు క్రోసూరులో జాబ్ మేళా.. రూ.30వేల వరకు జీతం

image

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. క్రోసూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి సంజీవరావు ఓ ప్రకటనలో తెలిపారు. 5కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో.. రూ.10వేల నుంచి రూ.30వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. పది, డిగ్రీ, డిప్లమా, ఫార్మసీ, పీజీ పూర్తి చేసి.. 18-35ఏళ్లు ఉన్నవారు అర్హులు. SHARE IT.

News September 27, 2024

హస్త కళలను ప్రజలు ఆదరించాలి: భార్గవ్ తేజ

image

హస్త కళలను ప్రజలు ఆదరించి కళాకారులను మరింతగా ప్రోత్సహించాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ సూచించారు. నాబార్డ్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్డులో ఏర్పాటు చేసిన చేనేత, హస్త కళా ప్రదర్శనను గురువారం ఆయన ప్రారంభించారు. కళాకారుల జీవన స్థితిగతులు మెరుగు పరచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేస్తున్నాయని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగే క్రాఫ్ట్ బజార్‌ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.

News September 27, 2024

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

➤ నందిగం సురేశ్, మేరుగ నాగార్జునలకు కీలక పదవులు
➤ పల్నాడు: కత్తులతో దాడి చేసుకున్న యువకులు
➤ గుంటూరు: దుగ్గిరాలలో అత్యధిక వర్షపాతం నమోదు
➤ బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
➤ మంగళగిరి: బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్ట్
➤ గుంటూరులో అర్ధరాత్రి మద్యం విక్రయాలు

News September 26, 2024

బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున

image

బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మేరుగు నాగార్జున నియమిస్తూ.. వైసీపీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడిగా నందిగం సురేశ్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి నేతలకు జిల్లా వ్యాప్తంగా వైసీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.