Guntur

News August 30, 2025

గుంటూరు: MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ రిలీజ్‌

image

ANUలో 2025విద్యా సంవత్సరానికి MBA, MCA ప్రవేశాల షెడ్యూల్‌ విడుదలైంది. MBAకి ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ తప్పనిసరి. ఫైనాన్స్‌, మార్కెటింగ్‌, హెచ్‌ఆర్‌, బ్యాంకింగ్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, టూరిజం, బిజినెస్‌ ఎనాలిటిక్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్మెంట్‌ వంటి 8 స్పెషలైజేషన్‌లలో రెండింటిని మాత్రమే ఎంచుకోవాలి. MCAకి మ్యాథ్స్‌ అర్హత తప్పనిసరి. ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 21న ఉంటుంది.

News August 30, 2025

గుంటూరు యువకుడికి బంగారు పతకాలు

image

కజకిస్థాన్‌లో జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో గుంటూరు యువకుడు నేలవల్లి ముఖేష్ సత్తా చాటాడు. జూనియర్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ముఖేష్, 3 టీమ్ విభాగాల్లో బంగారు పతకాలు, ఒక వ్యక్తిగత కాంస్య పతకం సాధించాడు. అతని అద్భుత ప్రదర్శనతో భారత్ పతకాల పట్టికలో మెరుగైన స్థానాన్ని పొందింది.

News August 29, 2025

గుంటూరు జిల్లా TODAY TOP NEWS

image

☞ మంగళగిరిలో 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ధననాథుడు
☞ అలజడులు సృష్టించేందుకు YCP కుట్ర: జూలకంటి  
☞ తెనాలిలో రెండు టన్నుల భారీ శివలింగం లడ్డు
☞ ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం
☞ మంగళగిరిలో రెండు రైళ్లల్లో చోరీలు
☞ మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
☞ పిన్నెల్లి సోదరులకు హైకోర్టులో బిగ్ షాక్
☞ తుళ్లూరులో జాబ్ మేళా.. 91 మందికి ఉద్యోగాలు

News August 29, 2025

ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య అవగాహన ఒప్పందం

image

ANU, KIFT ఫ్యాషన్ కాలేజ్ మధ్య శుక్రవారం ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది. దీనివల్ల యూనివర్సిటీ పరిధిలో ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) డిగ్రీ కోర్సులు, అలాగే ఒక సంవత్సర డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ ఒప్పందం ద్వారా ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయని వీసీ గంగాధర్ తెలిపారు.

News August 29, 2025

మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి డీఅడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ సతీష్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

News August 29, 2025

ANU: దూరవిద్య పీజీ కోర్సులకు నోటిఫికేషన్

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పీజీ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీఈ డైరెక్టర్ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో యూజీసీ, డెబ్ 23 పీజీ కోర్సులకు అనుమతి లభించిందన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తుందన్నారు. వివరాలకు www.anucde.info వెబ్ సైట్‌ను సంప్రదించాలన్నారు.

News August 29, 2025

ANU: డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూన్/జూలై నెలలో నిర్వహించిన డిగ్రీ 5వ, 6వ సెమిస్టర్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం యూనివర్సిటీ వీసీ కె.గంగాధర్ అధికారికంగా ప్రకటించారు. మొత్తం 5,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 4,292 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో www.anu.ac.in చూడవచ్చని తెలిపారు.

News August 29, 2025

గుంటూరులో ఈనెల 30న ఉద్యోగ మేళా

image

గుంటూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 30న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సంజీవరావు తెలిపారు. లక్ష్మీపురం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సమీపంలోని పాంటలూన్స్ షోరూంలో ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఐటీఐ, ఫార్మసీ, పీజీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 35 సంవత్సరాల లోపు వారు ఈ మేళాలో పాల్గొనవచ్చు.

News August 29, 2025

గుంటూరులో భారీ వర్షాలు.. సగటు 40.6 మి.మీ.

image

గుంటూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం వరకు అత్యధికంగా దుగ్గిరాలలో 58.6 మి.మీ, కనిష్టంగా మేడికొండూరులో 15.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. పెదకాకానిలో 57, చేబ్రోలు 48.4, ప్రత్తిపాడు 48.2, గుంటూరు పశ్చిమ 46.2, తాడేపల్లి 45.6 మి.మీ. వర్షం కురిసింది. పొన్నూరులో 22.6 మి.మీ. నమోదు. జిల్లాలో ఇప్పటి వరకు 276.8 మి.మీ. వర్షపాతం నమోదై సాధారణాన్ని మించిపోయింది.

News August 29, 2025

GNT: నేడు డీఎస్సీ అభ్యర్థులకు మెడికల్ బోర్డు పరీక్ష

image

మెగా డీఎస్సీ-2025 ధృవపత్రాల పరిశీలనకు వచ్చిన విభిన్న ప్రతిభావంతులు మెడికల్ బోర్డు పరీక్షకు హాజరు కావాలని గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి. రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష జరుగుతుందని ఆమె చెప్పారు. సామర్థ్య పరీక్ష నిమిత్తం ఒక్కో అభ్యర్థి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు.