Guntur

News August 29, 2024

నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష

image

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

News August 28, 2024

గుంటూరు: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన ఏపీ క్యాబినెట్

image

ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రాష్ట్ర మున్సిపల్ శాఖలో 269 సూపర్ న్యూమరీ భర్తీకి క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. అలాగే పౌరసరఫరాల శాఖలో 2,771 కొత్త రేషన్ దుకాణాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

News August 28, 2024

పల్నాడు: ‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి’

image

ఈనెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. హేలీప్యాడ్, ప్రధాన సభా స్థలాన్ని పరిశీలన అనంతరం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేలాగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News August 28, 2024

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

image

మూడేళ్ల వయసులో కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం మాచర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోజు రాత్రిపూట శీతలపానీయంలో మత్తు మందు కలిపి భార్య, కూతురికి తాగించాడు. మత్తులో నిద్రపోయిన వేళ కూతురుపై రోజు అత్యాచారం చేస్తున్నాడు. చిన్నారి మూత్రవిసర్జన సమయంలో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చూపిస్తే వైద్యులు అసలు నిజం చెప్పారు. 

News August 28, 2024

వినుకొండ: డబ్బుల కోసం తమ్ముడి హత్య చేశారు

image

వినుకొండలో సొంత సోదరుడుని రోకలి బండతో కొట్టి చంపారు. సీఐ శోభన్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దనాల్సా బజారుకు చెందిన సుభానీ జులై 8 నుంచి కనపడటం లేదని అతని భార్య మేహరిన్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి సోదరులను విచారించగా డబ్బులు విషయంలో గొడవ జరిగి రోకలి బండతో కొట్టి చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.

News August 28, 2024

పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు బహుమతిగా ఇద్దాం: నాదెండ్ల

image

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన పార్టీ నాయకులు, శ్రేణులు కలిసి ప్రజోపయోగ కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి నాదెండ్ల మనోహర్ టెలి కాన్ఫరెన్స్ లో పిలుపునిచ్చారు. సెప్టెంబరు 2వ తేదీన అంతా కలిసి ‘క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర’ కాన్సెప్ట్ తో కార్యక్రమాలను ఊరువాడా ఘనంగా నిర్వహిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.

News August 27, 2024

పల్నాడులో దారుణం.. మహిళపై అత్యాచారం ఆపై హత్య

image

నిద్రిస్తున్న మహిళను అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను నాదెండ్ల పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 8న నాదెండ్ల మండలం గణపవరం పీర్లచావిడిలో గదిలో నిద్రపోతున్న మహిళపై మనోజ్ మాలిక్(28), సాంబశివరావు (25) కలిసి అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

News August 27, 2024

గుంటూరు: భార్యను బ్యాట్‌తో కొట్టి హత్య చేసిన భర్త

image

గుంటూరు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పాత గుంటూరుకు చెందిన అభిరామ్ 11 ఏళ్ల క్రితం మౌనికను కులాంతర  ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. అభిరామ్ కొన్ని నెలలుగా మౌనికను అనుమానిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. సోమవారం రాత్రి మౌనిక తలపై క్రికెట్ బ్యాట్‌తో బలంగా కొట్టాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని దిశ డీఎస్పీ సుబ్బారావు తెలిపారు.

News August 27, 2024

అమరావతి : ఏలేశ్వరం ఘటనపై మంత్రి లోకేశ్ ఆరా

image

కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఘటనపై మంత్రి నారా లోకేశ్ మంగళవారం అరా తీశారు. ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన తనను ఆందోళనకు గురి చేసిందన్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్భందీ చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

News August 27, 2024

తాడేపల్లి: టీచర్‌ను బదిలీ చేయవద్దంటూ పిల్లల నిరసన

image

తాడేపల్లి జడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు మంగళవారం రోడ్డుపై వినూత్న నిరసన చేస్తున్నారు. తమకు ఇష్టమైన ఉపాధ్యాయురాలిని పాఠశాల నుంచి బదిలీ చేయవద్దంటూ ఆందోళన చేపట్టారు. హైస్కూల్లో సోషల్ పాఠాలను బోధించే ధూళిపాళ్ల పద్మజ ఇటీవల బదిలీ అయ్యారు. సోషల్ టీచర్ బదిలీ అయితే సరిగ్గా చదవలేమని విద్యార్థులు వాపోతున్నారు.