India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాణికుల సమస్యలను పట్టించుకోకుండా రైల్వే అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. బోర్డు నిబంధనల ప్రకారం ప్రతి 200 కి.మీ.లకు వాటరింగ్ స్టేషన్ తప్పనిసరి అయినా.. గుంటూరు డివిజన్లో ఎక్కడా సౌకర్యం లేదు. సికింద్రాబాద్ నుంచి గుంటూరు చేరేవరకు 274 కి.మీ.ల దూరం నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. నడికుడి వద్ద క్విక్ వాటరింగ్ ప్రతిపాదన కాగితాలకే పరిమితమైందని ప్రయాణికులు మండిపడుతున్నారు.

తన పేరుపై వస్తున ఫేక్ అకౌంట్లు నమ్మవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అధికారికంగా వినియోగంలో ఉన్న ఏకైక ఫేస్ బుక్ పేజీ “District Collector Guntur” మాత్రమే అని చెప్పారు. ఇది తప్ప మరే ఇతర ఫేస్ బుక్ అకౌంట్లు కలెక్టర్కు సంబంధించినవి కావని తెలిపారు. ప్రస్తుతం “DC (District Collector Guntur)” అనే పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ గుర్తించబడింది, జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు పెరుగుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకు ఎగువ నుంచి బ్యారేజీకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 6,46,821 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. కెఈఈ మెయిన్, కెడబ్ల్యు మెయిన్ లకు 8617, 6522, కాల్వలకు 15,139 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిమట్టం 16 అడుగులు ఉండగా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జులై నెలలో జరిగిన బీటెక్ రెగ్యులర్ II / IV (సెకండ్, ఫోర్త్ ఇయర్) సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. మొత్తం 961/743 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రూ.2,070 నగదు అక్టోబర్ 16వ తేదీలోపు చెల్లించాలన్నారు.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, జూన్ లలో జరిగిన బీ ఫార్మసీ రీవాల్యుయేషన్ ఫలితాలను సోమవారం అధికారులు విడుదల చేశారు. I సెమిస్టర్ 42/31, IIసెమిస్టర్ 6/1, III సెమిస్టర్ 59/41, IV సెమిస్టర్ 34/11, V సెమిస్టర్ 138/43, VI సెమిస్టర్ 64/34, VIII సెమిస్టర్ 23/7 మంది విద్యార్థులు లబ్ధి పొందారని తెలిపారు.

రైలు కిందపడి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనతో యువతి స్వగ్రామం కొల్లిపర(M) అత్తోటలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రియాంక ముప్పాళ్ల చెందిన గోపిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇరువురూ పోలీసులను ఆశ్రయించగా తల్లిదండ్రులు వచ్చి వారిని వేర్వేరుగా ఓ హాస్టల్లో ఉంచినట్లు తెలుస్తోంది. విడిగా ఉండలేకనే ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం.

ప్రముఖ విద్యావేత్త కొత్త కోటేశ్వరరావు (1929–2021) తెనాలి సమీపంలో జన్మించారు. ఆయన 1966లో యూనివర్సిటీ ఆఫ్ అయోవా నుండి పీహెచ్డీ పట్టా పొందారు. ముఖ్యంగా, వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల (ప్రస్తుతం NITW)కు 1973 నుండి 1989 వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి, సంస్థను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దారు. గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష గేట్ (GATE) ను రూపొందించిన కమిటీలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. నేడు ఆయన వర్ధంతి.

గుంటూరుకు చెందిన శాస్త్రవేత్త మతుకుమల్లి విద్యాసాగర్ కంట్రోల్ సిస్టమ్స్, సిస్టమ్స్ బయాలజీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఆయన టీసీఎస్ వైస్ ప్రెసిడెంట్గా, DRDO డైరెక్టర్గా పనిచేశారు. 2012లో ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ ఫెలోషిప్ పొందారు. Nonlinear Systems Analysis వంటి పరిశోధనా గ్రంథాలు రచించారు. ప్రస్తుతం యూనివర్శిటీ ఆఫ్ డల్లాస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు.

తెనాలి ఐతానగర్ శ్మశాన వాటికలో ఎటువంటి మృతదేహం లేకుండా కొన్నేళ్లుగా డమ్మీ సమాధి నిర్మించారని ఇదే ప్రాంతానికి చెందిన గడ్డేటి ప్రకాష్ బాబు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం సీఐ రాములు నాయక్ను కలిసి 2015లో డమ్మీ సమాధిని నిర్మించినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు. సమాధిని ముందుగానే నిర్మించి స్థలాన్ని కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంసమైంది.

మహానటి సావిత్రి ఏ పాత్రలోనైనా అద్భుతంగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారని సినీ నటి జయసుధ అన్నారు. ఆదివారం గుంటూరు వచ్చిన సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సావిత్రి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సావిత్రి నటన విశిష్టమైందని, ఆమె స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నారు. సావిత్రి విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు.
Sorry, no posts matched your criteria.