Guntur

News April 26, 2024

గతంలో YCP నుంచి నాకు ఆఫర్లు వచ్చాయి: పెమ్మసాని

image

గతంలో తనకు వైసీపీ నుంచి ఆఫర్లు వచ్చాయని గుంటూరు టీడీపీ MP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. 2019లో నరసరావుపేట, గుంటూరు ఎంపీ టికెట్లు.. రాజ్యసభ సీటు ఇస్తామని వైసీపీ ఆఫర్ చేసినా తాను తిరస్కరించానన్నారు. తన ఐడీయాలజీకి సరిపోని పార్టీ వైసీపీ అని చెప్పారు. ఇవన్నీ చూసిన చంద్రబాబు తన వల్ల సమాజానికి మేలు జరుగుతుందని టికెట్ ఇచ్చినట్లు వివరించారు.

News April 26, 2024

సాగర్ కుడి కాలువకు నీటి నిలుపుదల

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడికాలువకు గురువారం నీటిని నిలుపుదల చేశారు. కుడికాలువ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు తాగు నీటి అవసరాల నిమిత్తం ఈనెల 8న కృష్ణా యాజమాన్య బోర్డు 8టీఎంసీల నీటిని కేటాయించింది. నీటి విడుదల పూర్తవ్వడంతో కేఆర్ఎంబీ ఈఈ రఘునందన్ సమక్షంలో ఉదయం 8.30 గంటలకు గంటకు 1,000 క్యూసెక్కుల చొప్పున తగ్గిస్తూ మధ్యాహ్నం 12 గంటలకు నీటిని పూర్తిగా నిలిపివేశారు.

News April 26, 2024

పల్నాడు: జిల్లాలో ఏడో రోజు 89 నామినేషన్లు 

image

జిల్లాలో ఏడవ రోజు గురువారం మొత్తం 89 నామినేషన్లు దాఖలు అయ్యాయని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి శివశంకర్ తెలిపారు. నరసరావుపేట పార్లమెంట్‌కు 11, నరసరావుపేట అసెంబ్లీకి 14, పెదకూరపాడు అసెంబ్లీకి 10, చిలకలూరిపేట అసెంబ్లీకి11 సత్తెనపల్లి అసెంబ్లీకి 9, వినుకొండ అసెంబ్లీకి 12, గురజాల అసెంబ్లీకి 13, మాచర్ల అసెంబ్లీకి 9 నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు. 

News April 25, 2024

మంగళగిరి వైసీపీ షాక్.. అభ్యర్థి పేరుతో మరో మహిళ నామినేషన్

image

మంగళగిరి వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య పేరును పోలిన మరో మహిళ గురువారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్వో రాజకుమారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. వైసీపీ అభ్యర్థి పేరుతోనే ఉన్న మరో మహిళ నామినేషన్ వేయడంతో వైసీపీ వర్గాల్లో అలజడి మొదలైంది. అయితే స్వతంత్ర అభ్యర్థి లావణ్యతో మంతనాలు సాగుతున్నట్లు సమాచారం.

News April 25, 2024

గుంటూరు:కలెక్టర్‌ను కలిసిన ఎన్నికల పరిశీలకులు

image

మంగళగిరి, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు నీరజ్ కుమార్ గురువారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్ రెడ్డిని కలిశారు. జిల్లాలో సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై చర్చించి, పలు సూచనలు చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులకు, ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థులకు, ఓటర్లకు ఎన్నికల పరిశీలకులు ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉండలన్నారు.

News April 25, 2024

29న ఓటర్ల తుది జాబితా విడుదల: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈనెల 29వ తేదీ ఓటర్లతో తుది జాబితా విడుదల చేస్తామని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు. గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ నెల 29న చిహ్నాలను కేటాయిస్తామన్నారు. బాపట్ల జిల్లాలో మొత్తం 147 నామినేషన్లు దాఖలు చేసినట్లు చెప్పారు.

News April 25, 2024

నరసరావుపేట: ఎలక్షన్ అబ్జర్వర్‌ను కలిసిన కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలు-2024 నిర్వహణలో భాగంగా పెదకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా బూరె సర్వేశ్వరుడు నరేంద్ర నియమితులయ్యారు. ఈ సందర్భంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ లోతేటి అబ్జర్వర్‌ను కలిశారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

News April 25, 2024

గుంటూరు: ‘ఫెసిలిటేషన్ సెంటర్లను వినియోగించుకోవాలి’

image

మే 13న ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి గురువారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. మే 5 నుంచి 8వరకు మాత్రమే ఆయా నియోజకవర్గములో ఏర్పాటు చేయబడిన ఫెసిలిటేషన్ సెంటర్‌లో మాత్రమే, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఈ అవకాశం కల్పించామని చెప్పారు.  

News April 25, 2024

గుంటూరు జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు ఒక్కరోజే 64 నామినేషన్లు

image

గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు బుధవారం 64 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు అందజేసిన నామినేషన్ల నియోజకవర్గాల వారీ వివరాలు.. తాడికొండ నియోజకవర్గం 5, మంగళగిరిలో 17, పొన్నూరులో 5, తెనాలిలో 5, ప్రత్తిపాడు లో 20, గుంటూరు పశ్చిమలో 9, గుంటూరు తూర్పులో మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి.

News April 25, 2024

లక్షా 50 వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తా: పెమ్మసాని చంద్రశేఖర్

image

గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుంటూరు ఎంపీగా తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షా 50 వేల ఓట్ల పైనే మెజార్టీ వస్తుందన్నారు. తాను కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చానని చెప్పారు. అలాంటి తనతో జగన్‌ను పోల్చడం సరికాదన్నారు. కష్టపడి పైకొచ్చిన ఎవరితో అయినా జగన్‌ను పోల్చి చూడటం అవమానకరమని పెమ్మసాని వివరించారు.