India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమె నగరంలో రోడ్ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. గురువారం మధ్యాహ్నం గుంటూరు చేరుకోనున్న ఆమె సాయంత్రం సంజీవయ్యనగర్, రాజీవ్ గాంధీనగర్, శారదాకాలనీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం రోడ్ షో నిర్వహించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

➤ నియోజకవర్గం: చిలకలూరిపేట
➤ అభ్యర్థి: ప్రత్తిపాటి పుల్లారావు(TDP)
➤ భార్య: వెంకాయమ్మ
➤ విద్యార్హతలు: B.COM
➤ చరాస్తి విలువ: రూ.32.33కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.23.37కోట్లు
➤ కేసులు: 13
➤ అప్పులు: రూ.22.72కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.1,55,011
➤ బంగారం: 409.8గ్రాములు, భార్యకు 323.5గ్రాముల బంగారం
➤ NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

ఎన్నికల విధుల్లో దురుసుగా ప్రవర్తించిన SI కి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. మంగళవారం ఎస్సై నాగశివారెడ్డిని పర్చూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద విధులకు వేశారు. ఈ సమయంలో నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావు పై దురుసుగా ప్రవర్తించడంతో, సాంబశివరావు తనకు ఫిర్యాదు చేశారని దీనిపై వివరణ అడిగి నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.

టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలు కిటికీలు తెరిచి దోపిడీ చేస్తే వైసీపీ హయాంలో ఏకంగా తలుపులే తెరిచారని వైఎస్ షర్మిల అన్నారు. కర్లపాలెంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా చెప్పుకోవడానికి రాజధాని ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు, జగన్ కలిసి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించి ప్రజల చేతిలో చిప్ప పెట్టారన్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిసలుగా తయారయ్యారన్నారు.

మహిళ మృతి చెందిన ఘటనపై మంగళవారం పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదకాకాని నుంచి గుంటూరు వెళ్ళు హైవే రోడ్డుపైన గుర్తు తెలియని మహిళ పడి ఉందని గుర్తించారు. మతిస్థిమితం లేని ఆమెను గుంటూరు GGHకు తరలించారు. ఆమె పేరు లావణ్య అని చెప్పినట్లు సమాచారం. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి SST బృందాలతో బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఎస్.ఎస్.టి బృందాలు నిర్వహించే విధులు కీలకమని తెలిపారు. సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మంగళవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి విధివిధానాలు నచ్చక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరానని మెట్టుకూరు చిరంజీవి రెడ్డి అన్నారు.

చిలకలూరిపేట మండలంలోని గొట్టిపాడు వాగు వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు మంగళవారం గుర్తించారు. రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, మహిళ వయసు 30 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. ఈ మహిళను ఎవరైనా గుర్తిస్తే చిలకలూరిపేట రూరల్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

➤ నియోజకవర్గం: మంగళగిరి
➤ అభ్యర్థి: నారా లోకేశ్(TDP)
➤ భార్య: నారా బ్రాహ్మణి
➤ విద్యార్హతలు: MBA
➤ చరాస్తి విలువ: రూ.341.68కోట్లు
➤ భార్య చరాస్తి విలువ: రూ.45.06కోట్లు
➤ కేసులు: 23
➤ అప్పులు: రూ.3.48కోట్లు
➤ చేతిలో ఉన్న డబ్బులు: రూ.16,600
➤ బంగారం: లేదు, భార్యకు 2500.338గ్రాములు బంగారం, 97.441కేజీల సిల్వర్.
NOTE: ఎన్నికల అఫిడవిట్ మేరకు వివరాలు ఇవి.

విజయవాడలో సీఎం జగన్పై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీశ్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో సోమవారం ఈ పిటిషన్ సమర్పించారు. సతీశ్ నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అతడిని ఏడు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సతీశ్ తరఫు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.