Guntur

News September 24, 2024

మంగళగిరి: ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష

image

నైపుణ్యాభివృద్ధి శాఖపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం సంబంధిత శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమీక్ష ఉన్నందున ఉండవల్లిలోని నివాసంలో ముందస్తుగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైపుణ్యాభివృద్ధి శాఖ చేపడుతున్న అనేక కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు. స్కిల్ సెన్సెస్ యాప్ పై చర్చించిన లోకేశ్ పైలెట్ ప్రాజెక్టు కింద మంగళగిరి ప్రాంతాల్లో నైపుణ్యగణన చేపట్టాలని ఆదేశించారు.

News September 24, 2024

అమరావతి: చేనేత జౌళి శాఖపై మంత్రి సమీక్ష

image

చేనేత, జౌళి శాఖాధికారులతో సోమవారం సమీక్షా సమావేశాన్ని సచివాలయం నాలుగో బ్లాక్‌లో రాష్ట్ర బీసీఈడబ్ల్యూఎస్ ఆ శాఖ మంత్రి ఎస్.సవితమ్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. చేనేత కార్మికులు పరిశ్రమలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి అధికారులతో చర్చించారు. చేనేత కార్మికుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News September 23, 2024

అమరావతి: మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష

image

మైనారిటీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్ చేయాలని ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలన్నారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10, రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలాన్నారు. భూముల అభివృద్దికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News September 23, 2024

విజన్-2047 ప్లాన్‌పై అభిప్రాయాలను అందించండి: కలెక్టర్

image

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్లాన్‌పై ప్రభుత్వానికి సూచనలు, అభిప్రాయాలను అందజేయాలని కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్ నుంచి http://swarnandhra.ap.gov.in/Suggestions. లింక్‌తో వచ్చే QR కోడ్‌ ద్వారా పాల్గొనాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో పాటు సంతకంతో కూడిన సర్టిఫికేట్‌ను స్వీకరించాలన్నారు. QR కోడ్‌ని స్కాన్ చేసే సలహాలు అందించాలని చెప్పారు.

News September 23, 2024

అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

image

సీఎం చంద్రబాబు సోమవారం కార్యక్రమ వివరాలను సీఎం కార్యలయ అధికారులు విడుదల చేశారు. 12 గంటలకు చంద్రబాబు సచివాలయం చేరుకొని లా అండ్ జస్టిస్, మైనారిటీ శాఖపై సమీక్ష చేస్తారు. మధ్యాన్నం 3.30 గంటల నుంచి వరుసగా యూత్ అండ్ స్పోర్ట్స్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ శాఖ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై రివ్యూ చేస్తారని అధికారులు తెలియజేశారు.

News September 23, 2024

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళం

image

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంప్రెడా మైన్స్ అండ్ మినరల్స్ ఛైర్మన్ ఏఎస్ విక్రమ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబును కలిసి ఆ చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విక్రమ్‌ను చంద్రబాబు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

News September 23, 2024

GNT: నేడు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే సోమవారం జరుగుతుందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఎస్సార్ శంకరన్ హాల్లో నిర్వహించే గ్రీవెన్స్ డేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక సమస్యలపై అధికారులకు ఫిర్యాదు అందించవచ్చన్నారు. గ్రీవెన్స్ డేలో అందిన సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

News September 22, 2024

తిరుమల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రికి ఆహ్వానం

image

తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని సీఎం చంద్రబాబును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన దేవస్థానం ఈవో జె. శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి సీఎంకి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి, బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News September 22, 2024

ముఖ్యమంత్రి ఆదేశాలతో బాలుడికి మెరుగైన వైద్యం

image

విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాన్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీఎం, మంత్రి లోకేశ్ బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం బాలుడు దేవాన్ష్ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

News September 22, 2024

గుంటూరు: భర్త అనుమానంతో వేధిస్తున్నాడు

image

భర్త అనుమానంతో వేధిస్తున్నాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. వరగానికి చెందిన వీరయ్యకు గుంటూరుకు చెందిన రాణితో 10ఏళ్ల క్రితం పెళ్లైంది. ఎవరితో మాట్లాడినా అనుమానంతో వేధిస్తున్నాడంటూ, మద్యం తాగి వచ్చి తరచూ.. గొడవపడి తన్నుతున్నాడని, మహిళ ఫిర్యాదులో పేర్కొంది.