India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లాలోని 5,85,615 కుటుంబాలకు ఈ నెల 30 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఏటీఎమ్ కార్డు మాదిరిగా, క్యూఆర్ కోడ్తో రూపొందించిన ఈ కార్డులను గ్రామ సచివాలయాల ద్వారా పంపిణీ చేస్తారు. కార్యక్రమంలో పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులు అందజేస్తారు. ఈ కొత్త సాంకేతిక కార్డులతో ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని పర్యావరణ శాస్త్ర విభాగం & సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అండ్ ఇకలాజికల్ డెవలప్మెంట్ (సీడ్) ఇండియా ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రేపు 26వ తేదీ(మంగళవారం) యూనివర్సిటీ ప్రధాన ద్వారం మధ్యాహ్నం 2 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9441812543, 9491991918 నంబర్లను సంప్రదించాలని కోరారు.
తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ఈనెల 29న 300కు పైగా ఉద్యోగాల భర్తీకై జాబ్ మేళా నిర్వహిస్తున్నామని కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని తన కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాలో SSC, ITI, ఇంటర్, డిగ్రీ, BSC నర్సింగ్, డిప్లొమా, PG, బీటెక్ చదివినవారు హాజరుకావొచ్చని చెప్పారు. వివరాలకు ఫెసిలిటేటర్స్ లేదా 9848424207, 9963425999 సంప్రదించాలన్నారు.
లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లచెరువులో నీళ్ల బకెట్లో పడి 16 నెలల బాలుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన పఠాన్ యూసఫ్ ఖాన్ కుమారుడు అతీష్ ఖాన్ (16 నెలలు) మధ్యాహ్నం ఆడుకుంటూ నీళ్ల బకెట్లో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. యూసఫ్ ఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా వ్యాప్తంగా మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని అన్నారు. అలాగే, 1100 నెంబర్కు నేరుగా ఫోన్ చేసి కూడా ఫిర్యాదులు, వాటి స్థితిగతులను తెలుసుకోవచ్చని తెలిపారు.
☞ గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. కార్లు దగ్ధం
☞ పల్నాడు యువకుడికి డీఎస్సీలో 3 ఉద్యోగాలు
☞ GNT: గంజాయి కేసులో నిందితులకు DSP కౌన్సెలింగ్
☞ గుంటూరులో కొనసాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు
☞ రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమిస్తాం: అంబటి
☞ అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డులో మాక్ డ్రిల్
గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులు కూడా ఈ పదవి కోసం పోటీ పడుతుండటంతో రాష్ట్ర నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే, మాజీ కార్పొరేటర్ ఈ రేసులో ముందున్నట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో పార్టీ అధిష్ఠానం ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటుందని నాయకులు భావిస్తున్నారు.
గుంటూరు జిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సాహించడానికి నిధులు మంజూరు చేయిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్ మానస సరోవరం, ఉండవల్లి గుహలు వంటి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. సూర్యఘర్ పథకం కింద నమోదైన లక్ష మందిలో కేవలం 3,600 మందికే పరికరాలు అమర్చారని, ఈ సమస్యలను పరిష్కరించి అందరికీ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.