Guntur

News July 7, 2024

పల్నాడు: పొలంలో పేలిన నాటు బాంబు

image

దుర్గి మండలం జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు ప్రాంతంలో ఆదివారం ఉదయం నాటు బాంబు పేలుడు కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జంగమహేశ్వరంపాడు గ్రామ శివారు పొలాలకు ఆనుకొని ఉన్న కంచెలో నాటు బాంబు పేలి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News July 7, 2024

బాపట్ల: అగ్నివీర్‌కు దరఖాస్తులు ఆహ్వానం.. వెబ్సైట్ ఇదే.!

image

అగ్నివీర్ భారత వాయు సేనలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం నాన్ కమిషన్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని.. 2004 జులై 3 నుంచి 2008 జనవరి 3వ తేదీ మధ్యలో జన్మించిన వారే అర్హులన్నారు. భారత సైన్యంలో చేరాలనుకునే యువకులు ” https://agnipathvayu.cdac.in ” వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

News July 7, 2024

అమరావతిలో ORR విశేషాలు ఇలా.!

image

ఉమ్మడి గుంటూరు జిల్లా CRDA పరిధిలో 189 KM పొడవున ORR నిర్మాణం జరగనుంది. 150 మీటర్ల వెడల్పుతో 2 వైపులా సర్వీస్‌ రోడ్లు కాకుండా 6 వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నిర్మాణం పూర్తయితే కొల్లిపర, పొన్నూరు, తెనాలి, చేబ్రోలు, వట్టిచెరుకూరు, గుంటూరు, మేడికొండూరు, యడ్లపాడు, తాడికొండ, పెదకూరపాడు, అమరావతి మండలాల్లోని 38 గ్రామాల మీదుగా ORR వెళ్లనుంది.

News July 7, 2024

ఇసుక ప్రైవేటుగా విక్రయిస్తే చర్యలు: జిల్లా అధికారి

image

పల్నాడు జిల్లాలో సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం చేపడుతున్నట్లు గనులు భూగర్భ శాఖ జిల్లా అధికారి నాగిని తెలిపారు. నరసరావుపేటలోని జిల్లా కార్యాలయంలో ఆమె శనివారం మాట్లాడుతూ.. కృష్ణానది సమీప యార్డుల్లో నిల్వ చేసిన ఇసుక టన్ను రూ.191.52గా ఉన్నతాధికారులు నిర్ణయించారన్నారు. అయితే ఎక్కడైనా ఇసుక ప్రైవేటుగా విక్రయించినట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 7, 2024

ఇసుక కోసం ముందుగా వచ్చిన వారికే ప్రాధాన్యత: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమలులోకి రానుందని, అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని శనివారం అధికారులను కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే సోమవారం ఉదయం 6 గంటల నుంచి ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు. జిల్లాలోని గుండిమెడ, మున్నంగి, కొల్లిపర డిపో, తాళ్లాయపాలెం, లింగాయపాలెం నుంచి సరఫరా చేస్తారని, ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

News July 7, 2024

గుంటూరు: ఇంట్లో వ్యభిచారం.. మహిళపై కేసు

image

వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళపై శనివారం నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏటి అగ్రహారంలో దేవి అనే మహిళ ఒక ఇంటిని కొన్ని నెలల కిందట అద్దెకు తీసుకుని ఉంటుంది. అయితే ఆ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారు. నిజమేనని తేలడంతో నిర్వాహకురాలు దేవిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్ రావు తెలిపారు.

News July 7, 2024

ఉచిత ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకు సోమవారం నుంచి ఉచిత ఇసుక సరఫరాపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆమె కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి ప్రజలకు అవసరమైన ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సరఫరా చేసే ఇసుక నాణ్యతగా ఉండేటట్లు చూడాలన్నారు.

News July 6, 2024

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో మంత్రి అనగాని

image

మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్‌ ప్రజా‌భవన్‌లో శనివారం తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ నుంచి ముగ్గురు మంత్రులు హాజరవగా.. వారిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు. సీఎంల పక్కనే కూర్చొని విభజన అంశాలపై ఆయన చర్చించారు. భేటీ అనంతరం మీడియా సమావేశంలో అనగాని మాట్లాడారు. మంత్రులు కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

News July 6, 2024

బాపట్ల: అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

అగ్ని‌వీర్ వాయు భారత సైన్యంలోకి చేరడానికి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భారత వైమానిక దళం అధికారి సందీప్ తెలిపారు. అగ్నివీర్ వాయు అనుబంధ శాఖల అధికారులతో శనివారం బాపట్ల కలెక్టరేట్‌లో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. భారత సైన్యంలోకి యువకులు చేరడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పారు. ఆసక్తి గలవారు ఈ నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News July 6, 2024

సహచర మంత్రులతో అనగాని భేటీ

image

విభజన హామీలు, ఇతర పెండింగ్ అంశాల కోసం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సహచర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేశ్‌లతో అనగాని సత్యప్రసాద్ భేటీ అయ్యారు. IAS అధికారి ప్రేమ్ చంద్రారెడ్డితో కలిసి పలు అంశాలపై చర్చించారు.