India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారని తెలిపాయి.
నూతన సంవత్సరం తొలిరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు లబ్ధి చేకూర్చేలా సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. దీంతో 1,600 మంది దరఖాస్తుదారులకు రూ.24 కోట్ల మేర నిధులు విడుదల కానున్నాయి. గత ఏడాది అధికారం చేపట్టిన దగ్గర నుంచి డిసెంబర్ 31 వరకు రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులు పేదవర్గాలకు ఇచ్చారని తెలిపాయి.
భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీలోని పెద్దూరు గ్రామంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. 31వ తేదీ రాత్రి అమరేంద్రబాబు మద్యం తాగి ఇంటికి రాగా భార్యాభర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో భర్త అమరేంద్ర (38) తలపై భార్య కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న రేపల్లె రూరల్ సురేశ్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూతన సంవత్సరం రోజున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి జాతీయ రహదారి రక్తమోడింది. ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు మార్టూరు వైపు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహిళను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నూతన సంవత్సరం వేళ ఓ కుటుంబంలో తీరని విషాదం చోటుచేసుకుంది. కుమారుడికి కేక్ కొనిచ్చేందుకు తీసుకెళ్తుండగా లారీ మృత్యువు రూపంలో వెంటాడింది. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామం వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాద విషాదాంతమిది. గ్రామానికి చెందిన దుర్గారావు బైక్పై కుమారుడితో కలిసి వెళ్తుండగా లారీ ఢీకొనడంతో బాలుడు కార్తీక్ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
వివాహిత షేక్ మల్లిక(29) హత్య కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వివరాల ప్రకారం.. పెదకాకాని(M) నంబూరికి చెందిన మల్లికకు అక్బర్తో 15ఏళ్ల క్రితం వివాహం అయింది. పెళ్లైన ఏడేళ్ల తర్వాత ఆమె భర్తను, పిల్లలను వదిలేసి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత రెహమాన్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే మరో యువకుడితో కూడా సహజీవనం చేస్తున్నట్లు తెలియడంతో రెహమాన్ ఆమెను చంపించాడు.
వినుకొండలో విద్యార్థులు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మంగళవారం రంగవల్లిని అందంగా అలంకరించారు. లైట్లు వెలిగించి వాటి చుట్టూ క్యాండిల్స్ వెలిగించారు. అనంతరం రంగవల్లుల చుట్టూ విద్యార్థులు మానవహారం నిర్వహించారు. దీంతో రంగవల్లి చుట్టూ ఉన్న చిన్నారుల ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఉమ్మడి గుంటూరులో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.
తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసుల దాడిలో మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గుంటూరుకి చెందిన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. వారితో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి నిందితుల్ని కోర్టులో హాజరుపర్చారు.
రాష్ట్రంలో ప్రజాహిత పాలన కొనసాగుతుందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. లక్ష 82 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టామని, రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేశారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు సవరిస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తమన్నారు.
Sorry, no posts matched your criteria.