India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరగనున్న పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. https://Meekosam.ap.gov.in సైట్లో కూడా అర్జీలు సమర్పించవచ్చని తెలిపారు. టోల్ ఫ్రీ 1100 ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చని సూచించారు. రెవెన్యూ క్లీనిక్ కోసం కలెక్టరేట్లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.

అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహానికి, జ్యూడిషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల సముదాయాలు ప్రారంభించారు. రూ.210 కోట్లతో 33.20 ఎకరాల్లో 36మంది జడ్జీలకు బంగ్లాలు నిర్మించారు. సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.

గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేయడం ఆపాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం LPGడిస్టిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. IVRSసర్వేలో రెండు ప్రశ్నలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. వృద్దులకు ఇంటికి రేషన్ సరఫరా చేయకపోవడం కారణంగా కూడా వ్యతిరేకత వస్తుందన్నారు.

కార్యం ఏదైనా కుట్టిన దుస్తులు అంటే గుర్తొచ్చేది దర్జీ. కాల క్రమేణా ప్రజలు రెడీమేడ్పై ఆసక్తి చూపిస్తున్నారు. దర్జీ కూలీ, రెడీమేడ్ దుస్తులు అటు, ఇటుగా ఒకటే అవుతుండటంతో అప్పటికప్పుడు దొరికే రెడీమేడ్ దుస్తులు కొంటున్నారు. ఒకప్పుడు దర్జీకి కొలతలు ఇవ్వడం, స్టిచ్చింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? అని ఎదురు చూడటం అంతా ఆసక్తిగా ఉండేది. నేడు టైలర్స్ డే ఈ సందర్భంగా వారితో మీకు ఉన్న అనుబంధం కామెంట్ చేయండి.

మంగళగిరి జనసేన కార్యాలయంలో నీలాద్రి అనే వ్యక్తి కార్ల అద్దాలను ధ్వంసం చేసి సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలు ఆరంభించారు. భద్రతా విభాగం రిజర్వు ఇన్స్పెక్టర్ పెంటారావుతో పాటు మరో నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. భద్రత వైఫల్యాల వల్లనే ఘటన చోటు చేసుకుందని నిర్ధారణ కావడంతో చర్యలకు ఉపక్రమించినట్లు చెబుతున్నారు. ఇప్పటికే నీలాద్రిని అరెస్ట్ చేశారు

భారత ప్రధాన న్యాయమూర్తి అమరావతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో శంకుస్థాపన వేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని అధికారులకు ఆమె స్పష్టం చేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి అమరావతి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్షలో ఆమె పాల్గొన్నారు. అనంతరం క్షేత్రస్థాయిలో శంకుస్థాపన వేదికలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని అధికారులకు ఆమె స్పష్టం చేశారు.

గుంటూరులో ముప్పై ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గుంటూరు మెడికల్ కాలేజీ మెడికల్ ఎగ్జిబిషన్ రేపటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనకు ఇప్పటివరకు సుమారు 80 వేల మంది హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సందర్శించి అభినందించారు. చివరి రోజున ప్రజలు తప్పక వీక్షించాలని ప్రిన్సిపల్ డా. సుందరాచారి కోరారు. మరుపురాని వైద్య విజ్ఞాన అనుభూతిని పొందినట్లు పలువురు సందర్శకులు పేర్కొన్నారు.

వచ్చే విద్యాసంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తెలిపారు. అర్హులైన వారు మార్చి 10వ తేదీలోగా cse.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శుక్రవారం జిల్లా కోర్టులో దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నిరుపేద విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.