Guntur

News December 30, 2024

అమరావతి: పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్‌రాజు

image

అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ను ఆహ్వానించారు. సినిమా టికెట్‌ రేట్లు, సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాట్లపై చర్చించారు. కాగా కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. పవన్‌ హాజరవుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

News December 30, 2024

2024: ఉమ్మడి గుంటూరు పొలిటికల్ పిక్చర్ ఛేంజ్

image

ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రాన్ని 2024 ఎన్నికలు మార్చేశాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 17 నియోజకవర్గాల్లో 15 YCP, 2 సీట్లలో TDP గెలిచింది. కాగా ఈసారి 3 ఎంపీ సీట్లతో పాటు 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో జనసేన నెగ్గి క్లీన్ స్వీప్ చేశాయి. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి 90 వేల మెజార్టీతో నెగ్గడం విశేషం. మంత్రులుగా నారా లోకేశ్, నాదెండ్ల, అనగాని కొనసాగుతున్నారు.

News December 30, 2024

శావల్యాపురం: సైబర్ నేరగాళ్ల వలలో మండల నివాసి

image

శావల్యాపురం(M) కారుమంచికి చెందిన నరసింహారావు ఖాతాలోని నగదు మాయంపై ఫిర్యాదు అందినట్లు ఎస్సై లోకేశ్వరరావు తెలిపారు. నరసింహరావు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిర్వహించుకొని ఆరోగ్యశ్రీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే సైబర్ నేరగాడు నరసింహరావుకు ఫోన్ చేసి ఆరోగ్యశ్రీ డబ్బులు ఖాతాలో పడతాయని, మీకు వచ్చిన లింక్ ఓపెన్ చేయమన్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే ఖాతాలో డబ్బులు మాయయ్యాయి. 

News December 30, 2024

గుంటూరులో దారుణం.. కట్టుకున్న భర్తే చంపేశాడు

image

గుంటూరు జిల్లా నంబూరులో శనివారం అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మల్లికది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. స్థానికుల వివరాల మేరకు.. అదే గ్రామానికి చెందిన అక్బర్‌తో మల్లికకు పెళ్లైంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో పిల్లలు పుట్టిన కొద్ది రోజులకే గొడవలు జరిగాయి. అప్పటి నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. వివాహేతర సంబంధమే ఆమె హత్యకు కారణమని ప్రాథమిక సమాచారం. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News December 30, 2024

ఏకసభ్య కమిషన్‌కు అభిప్రాయాలు తెలపవచ్చు: కలెక్టర్

image

షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై విచారణకు శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్యకమిషన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలుకు వస్తుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు కమిషన్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులకు తెలియజేయవచ్చని అన్నారు. 

News December 30, 2024

GNT: నేడు ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు’

image

ఈనెల 30న వన్ మాన్ కమిషన్ పర్యటన (శ్రీ రాజీవ్ రంజాన్ మిశ్రా ఐఏఎస్(రిటైర్డ్) నేతృత్వంలోని బృందం రాష్ట్రంలోని షెడ్యూల్ కులాల వర్గీకరణపై నిర్దిష్ఠ సిఫారసులు సూచించడానికి జిల్లాలో పర్యటించనుంది. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షల దృష్ట్యా గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

News December 29, 2024

నరసరావుపేటలో సీఎం పర్యటన ఇలా.!

image

నరసరావుపేట మండలం యల్లమంద గ్రామానికి ఈనెల 31న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకుంటారు. 11.40 వరకు పింఛన్లు అందజేస్తారు. అనంతరం గ్రామంలోని ఆలయాన్ని సీఎం సందర్శిస్తారు. మధ్యాహ్నం కోటప్పకొండకు చేరుకొని 2.20కి త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకొని 3.10లకు ముఖ్యమంత్రి తిరిగి ఉండవల్లి చేరనున్నారు.  

News December 29, 2024

గుంటూరు జిల్లాలో 16 శాతం క్రైమ్ రేటు తగ్గింది: ఎస్పీ

image

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ సతీశ్ కుమార్ వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. గత ఏడాదితో పోల్చితే 16 శాతం క్రైమ్ రేటు గుంటూరు జిల్లాలో తగ్గిందని వెల్లడించారు. జిల్లాలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించామన్నారు. రోడ్డు ప్రమాదాలు 5 శాతం పెరిగాయని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 224 మందిని గంజాయి కేసుల్లో పట్టుకొని 12 మందిపై పీడీ యాక్ట్ పెట్టామన్నారు.  

News December 29, 2024

పెదకాకాని: మహిళ అనుమానాస్పద మృతి

image

పెదకాకాని(M) నంబూరులో మల్లికా(29) అనే మహిళ శనివారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు.. మల్లిక మొదటి భర్తతో విడిపోయి ప్రేమ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్త పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి భార్య మంచంపై శవమై ఉంది. మెడ మీద గాయాలు ఉండటంతో పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. సీసీ కెమెరాలో ఇద్దరు మాస్కులు ధరించి వచ్చి వెళ్లినట్లు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2024

2024లో ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్

image

@అమరావతిని తిరిగి రాజధానిగా అభివృద్ధి చేయడం @ఎలక్షన్ సమయంలో నరసరావుపేట, మాచర్ల పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు @గుంటూరు నుంచి ఎంపీ పెమ్మసాని కేంద్రమంత్రిగా ఎంపిక @వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ దారుణ హత్య @అక్టోబర్లో కృష్ణానది ఉగ్రరూపం, బోటు ఢీకొనడంతో ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసం @ఆస్తి కోసం అన్నదమ్ములను సోదరి హత్య చేయడం @ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుఫాన్లు, వరదల నేపథ్యంలో తీవ్ర పంట నష్టం.